కొత్త చట్టం.. సత్వర న్యాయమే లక్ష్యం
బాధితుడు ఇక పోలీసు స్టేషన్ను వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే ఫిర్యాదు చేయొచ్చు. జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం. రహదారి ప్రమాదానికి కారకులై పారిపోయిన వారిపై నాన్బెయిలెబుల్ కేసు, మహిళలపై అఘాయిత్యాలకు శిక్ష కాలం పెంపు, చైన్ స్నాచింగ్పై కొత్త సెక్షన్..
ఇక అంతా ఆన్లైన్లోనే..
నేటి నుంచే అమలు..
న్యూస్టుడే, ఆసిఫాబాద్ అర్బన్, న్యాయ విభాగం, మంచిర్యాల
బాధితుడు ఇక పోలీసు స్టేషన్ను వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే ఫిర్యాదు చేయొచ్చు. జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం. రహదారి ప్రమాదానికి కారకులై పారిపోయిన వారిపై నాన్బెయిలెబుల్ కేసు, మహిళలపై అఘాయిత్యాలకు శిక్ష కాలం పెంపు, చైన్ స్నాచింగ్పై కొత్త సెక్షన్.. ఇలా భారత ప్రభుత్వం సోమవారం నుంచి అమలు చేయబోతున్న నూతన చట్టాల్లో చోటు చేసుకున్న కొన్ని అంశాలివి.
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో ఉంచుకుని భారతీయ సాక్ష్యా అధినియం-2023 పేరుతో తెచ్చిన కొత్త చట్టాలు న్యాయవ్యవస్థలో పెను మార్పు తేనున్నాయి. ప్రస్తుతమున్న ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత-2023, సీఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత-2023లు సమగ్ర మార్పులతో అమలు కానున్నాయి. కొత్త చట్టాల అమలు ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే జరగనున్నాయి. ఇప్పటికే ఈ చట్టాలపై అవగాహన కోసం పోలీసులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. ఇందుకోసం పోలీసుశాఖ విస్తృత ప్రచారం చేపట్టింది.
అవగాహన కల్పిస్తాం
- డి.వి.శ్రీనివాసరావు, కుమురం భీం జిల్లా ఎస్పీ
జులై ఒకటో తేదీ నుంచి కొత్త చట్టాలను అమలు చేస్తాం. వీటి ద్వారా ప్రజలకు సత్వర న్యాయం లభించనుంది. ఇప్పటికే జిల్లాలోని అన్ని స్థాయిల పోలీసులకు ప్రత్యేక శిక్షణనిచ్చి కొత్త చట్టాలపై అవగాహన కల్పించాం. ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రచారం చేస్తాం. పోలీసు స్టేషన్లలో పాత చట్టాలు, కొత్త చట్టాల వివరాలను తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్
-
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు