logo

కొత్త చట్టం.. సత్వర న్యాయమే లక్ష్యం

బాధితుడు ఇక పోలీసు స్టేషన్‌ను వెళ్లకుండానే ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలోనే ఫిర్యాదు చేయొచ్చు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అవకాశం. రహదారి ప్రమాదానికి కారకులై పారిపోయిన వారిపై నాన్‌బెయిలెబుల్‌ కేసు, మహిళలపై అఘాయిత్యాలకు శిక్ష కాలం పెంపు, చైన్‌ స్నాచింగ్‌పై కొత్త సెక్షన్‌..

Published : 01 Jul 2024 05:16 IST

ఇక అంతా ఆన్‌లైన్‌లోనే..  
నేటి నుంచే అమలు..
న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌ అర్బన్, న్యాయ విభాగం, మంచిర్యాల

బాధితుడు ఇక పోలీసు స్టేషన్‌ను వెళ్లకుండానే ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలోనే ఫిర్యాదు చేయొచ్చు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అవకాశం. రహదారి ప్రమాదానికి కారకులై పారిపోయిన వారిపై నాన్‌బెయిలెబుల్‌ కేసు, మహిళలపై అఘాయిత్యాలకు శిక్ష కాలం పెంపు, చైన్‌ స్నాచింగ్‌పై కొత్త సెక్షన్‌.. ఇలా భారత ప్రభుత్వం సోమవారం నుంచి అమలు చేయబోతున్న నూతన చట్టాల్లో చోటు చేసుకున్న కొన్ని అంశాలివి.

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో ఉంచుకుని భారతీయ సాక్ష్యా అధినియం-2023 పేరుతో తెచ్చిన కొత్త చట్టాలు న్యాయవ్యవస్థలో పెను మార్పు తేనున్నాయి. ప్రస్తుతమున్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత-2023, సీఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత-2023లు సమగ్ర మార్పులతో అమలు కానున్నాయి. కొత్త చట్టాల అమలు ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలోనే జరగనున్నాయి. ఇప్పటికే ఈ చట్టాలపై అవగాహన కోసం పోలీసులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. ఇందుకోసం పోలీసుశాఖ విస్తృత ప్రచారం చేపట్టింది.

అవగాహన కల్పిస్తాం

- డి.వి.శ్రీనివాసరావు, కుమురం భీం జిల్లా ఎస్పీ

జులై ఒకటో తేదీ నుంచి కొత్త చట్టాలను అమలు చేస్తాం. వీటి ద్వారా ప్రజలకు సత్వర న్యాయం లభించనుంది. ఇప్పటికే జిల్లాలోని అన్ని స్థాయిల పోలీసులకు ప్రత్యేక శిక్షణనిచ్చి కొత్త చట్టాలపై అవగాహన కల్పించాం. ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రచారం చేస్తాం. పోలీసు స్టేషన్లలో పాత చట్టాలు, కొత్త చట్టాల వివరాలను తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని