logo

పట్టుదలతో చదివి.. మూడు కొలువులు సాధించి

దండేపల్లికి చెందిన ఆర్టీసీ  విశ్రాంత కండక్టరు పెండ్యాల సత్యనారాయణ, శకుంతల దంపతుల కుమారుడు  సాయికిరణ్‌ వ్యవసాయ అధికారి ఉద్యోగానికి ఎంపికయ్యారు. టీజీపీఎస్‌సీ  ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఓ పరీక్షలో 450 మార్కులకు 316 సాధించి రాష్ట్రస్థాయిలో 42వ ర్యాంకు సాధించారు.

Updated : 01 Jul 2024 06:33 IST

పెండ్యాల సాయికిరణ్‌

దండేపల్లి, న్యూస్‌టుడే: దండేపల్లికి చెందిన ఆర్టీసీ విశ్రాంత కండక్టరు పెండ్యాల సత్యనారాయణ, శకుంతల దంపతుల కుమారుడు  సాయికిరణ్‌ వ్యవసాయ అధికారి ఉద్యోగానికి ఎంపికయ్యారు. టీజీపీఎస్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఓ పరీక్షలో 450 మార్కులకు 316 సాధించి రాష్ట్రస్థాయిలో 42వ ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు స్థానిక భారతి విద్యానికేతన్‌లో చదివి ఇంటర్‌ తర్వాత జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ(వ్యవసాయం), ఎంఎస్సీ పూర్తి చేశారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి పట్టుదలతో చదవడం వల్లనే ఉద్యోగానికి ఎంపికయ్యాయని సాయికిరణ్‌ చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్‌-4 ఉద్యోగంలో జిల్లా స్థాయిలో 14వ ర్యాంకు సాధించగా, ఇండియన్‌ బ్యాంకులో క్షేత్ర అధికారి ఉద్యోగానికి ఎంపిక కావడం విశేషం. సాయికిరణ్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని