కుమార్తె మృతి తట్టుకోలేక అయిదు నెలల గర్భిణి మృతి
అల్లారుముద్దుగా కంటికి రెప్పలా పెంచుకున్న కుమార్తె అకాల మరణంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ మాతృమూర్తికి మిగిలిన కడుపుకోత వల్ల బిడ్డ లేదనే విషయం పీడకలగా వెంటాడింది.
కుమురంభీం జిల్లాలో విషాదం
నీత
ఈనాడు, ఆసిఫాబాద్: అల్లారుముద్దుగా కంటికి రెప్పలా పెంచుకున్న కుమార్తె అకాల మరణంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ మాతృమూర్తికి మిగిలిన కడుపుకోత వల్ల బిడ్డ లేదనే విషయం పీడకలగా వెంటాడింది. అయిదు నెలల గర్భిణి అనే విషయం సైతం మరిచి బరువెక్కిన గుండెతో కుంగిపోయి తనువు చాలించింది. మూడేళ్ల మరో చిన్నారి తల్లి ప్రేమకు దూరం కాగా, ఇద్దరు పిల్లలు, భార్యనూ పోగొట్టుకుని భర్త, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.
కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్లోని జన్కాపూర్కు చెందిన నీత-హరీష్ దంపతుల సంతానం లోహిత(5)కు వారం కిందట జూన్ 23న వాంతులు కాగా స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా సెలైన్ ఎక్కించారు. రాత్రి 7.40 గంటలకు పరిస్థితి విషమించడంతో కాగజ్నగర్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించగా.. అక్కడికి వెళ్లారు. రెండు గంటల ముందే పాప చనిపోయిందని అక్కడి డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. కుమార్తె మరణాన్ని తల్లి నీత తట్టుకోలేకపోయింది. చిన్నారి అంత్యక్రియలు అయిన రోజే సృహ తప్పింది. వెంటనే ఆమెను కుటుంబీకులు కాగజ్నగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. మంచిర్యాలకు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో వారు హైదరాబాద్కు వెళ్లి గాంధీ, నిమ్స్తోపాటు, ప్రైవేటు ఆసుపత్రులకు తిరిగారు. అక్కడికి వెళ్లి ఆసుపత్రులు తిరిగే సమయంలో వాహనంలోనే నీతకు అబార్షన్ అయింది. అనంతరం కుటుంబీకులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స చేశారు. రూ.4 లక్షలు ఆసుపత్రి బిల్లు అయింది. అయినా ఆరోగ్య పరిస్థితి విషమించి నీత ఆదివారం ఉదయం కన్నుమూయడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
నీత మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ