వరుస చోరీలు.. జనం బెంబేలు
జిల్లాలో మళ్లీ దొంగల అలజడి మొదలైంది. కొంత కాలంగా ఆయా మండలాల్లో ఏదో ఓ చోట వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెలలో బెజ్జూరు, చింతలమానెపల్లి, కౌటాల, కాగజ్నగర్ మండలాల్లోని ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ చేన్లలోని బోరు మోటార్లు సైతం చోరీకి గురవడం ఆందోళన కలిగిస్తోంది.
వ్యవసాయ మోటార్లనూ వదలని దొంగలు..
న్యూస్టుడే - కౌటాల, బెజ్జూరు
ఇటీవల బెజ్జూరు మండల కేంద్రంలోని ఎరువుల దుకాణంలో చోరీకి పాల్పడిన దొంగలు
జిల్లాలో మళ్లీ దొంగల అలజడి మొదలైంది. కొంత కాలంగా ఆయా మండలాల్లో ఏదో ఓ చోట వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెలలో బెజ్జూరు, చింతలమానెపల్లి, కౌటాల, కాగజ్నగర్ మండలాల్లోని ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ చేన్లలోని బోరు మోటార్లు సైతం చోరీకి గురవడం ఆందోళన కలిగిస్తోంది. కాగజ్నగర్, కౌటాల, బెజ్జూరు, సిర్పూర్(టి) మండలాల్లో తరచూ చోరీలు జరుగుతుండటంతో.. భయాందోళన వాతావరణం నెలకొంది.
జిల్లావ్యాప్తంగా గత రెండేళ్లుగా దొంగలు రెచ్చిపోతున్నారు. మొదట్లో ఇళ్లు, దుకాణాలను లక్ష్యం చేసిన దుండగులు తరువాత వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న బోరుమోటార్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న విలువైన కంప్యూటర్లను దొంగిలించారు. గతేడాది చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్లో ఏకంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకులోనే చోరీకి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల దుండగులు రూటు మార్చి పక్కాగా రెక్కీ నిర్వహించి దుకాణాలు, ఇళ్లల్లో చోరీలకు పాల్పడి భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్తున్నారు. వారంరోజుల వ్యవధిలో చింతలమానెపల్లి మండలంలోని బూరెపల్లి, బాబాసాగర్ గ్రామాల శివారులోని బోరు మోటార్లను ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినా, రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించినా అందరి కళ్లుగప్పి దుండగులు వరుస చోరీలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాన కూడలిలో పనిచేయని నిఘానేత్రాలు
పనిచేయని నిఘానేత్రాలు..
ఒక్క నిఘా నేత్రం వందమంది పోలీసులతో సమానమని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రజలకు అవగాహన కల్పించి వివిధ మండలాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. దాతలు, చందాల రూపంలో నగదు జమచేసి అమర్చారు. తదనంతరం వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయాయి. దీన్ని అదనుగా చేసుకుంటున్న దుండగులు చోరీలకు పాల్పడుతూ సులువుగా తప్పించుకుంటున్నారు. జిల్లాకు ఎక్కువ శాతం మహారాష్ట్ర సరిహద్దు ఉండటం, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటంతో.. ఎవరు ఎప్పుడు వస్తున్నారో, వెళ్తున్నారో తెలియని పరిస్థితి. నిఘా నేత్రాలు పనిచేస్తే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలి ఘటనలు పరిశీలిస్తే..
- జూన్ 1న కాగజ్నగర్లోని కాపువాడలో చోరీకి పాల్పడిన దుండగులు.. ఇంట్లో ఉన్న రూ.1.50 లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
- జూన్ 3న కాగజ్నగర్లో ఆర్టీసీ బస్సులో దొంగతనం జరిగింది. బెజ్జూరు మండలం రెబ్బెన గ్రామానికి చెందిన ఓ మహిళ బస్సులో కాగజ్నగర్కు రాగా బస్సులోనే ఆమె వద్ద ఉన్న రూ.1.18 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.
- జూన్ 25వ తేదీన చింతలమానెపల్లి మండలంలోని రణవెల్లిలో వ్యవసాయక్షేత్రంలో ఉన్న బోరు మోటారు చోరీకి గురైంది.
- మే నెలలో కౌటాల మండలంలోని గుండాయిపేట ఎత్తిపోతల పథకం వద్ద ఉన్న మోటార్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. మోటార్లలోని విలువైన రాగి తీగలను ఎత్తుకెళ్లారు.
- రెండు నెలల కిందట కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లోని గుడ్లబోరి, కౌటాల రైతువేదికల్లోని, బాబాసాగర్, బాలాజీ అనుకొడ గ్రామ సమీపంలోని చేలల్లో ఉన్న బోరు మోటార్లు చోరీకి గురయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ మంత్రి జన్మదిన వేడుకలు
[ 04-07-2024]
భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలు ఆదిలాబాద్లో గురువారం ఘనంగా నిర్వహించారు. -
సీపీఐ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి
[ 04-07-2024]
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలను సీపీఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. -
అమరుల ఆశయాలు సాధిద్దాం
[ 04-07-2024]
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమర వీరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధించటానికి కృషి చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. -
మాజీ మంత్రి జన్మదిన వేడుకలు
[ 04-07-2024]
మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలను రిమ్స్లో ఘనంగా నిర్వహించారు. -
విద్యాసంస్థల బంద్ ప్రశాంతం
[ 04-07-2024]
నీట్ పరీక్ష రద్దు, ఎన్డీఏ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్లో విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యాసంస్థలు బంద్ విజయవంతమైంది. -
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మొన్న ఆర్మీ ట్రైనింగ్.. ఇప్పుడు పాత పరుపులపై ప్రాక్టీస్.. పాక్పై ట్రోలింగ్
-
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్.. కాసేపట్లో ప్రమాణస్వీకారం
-
పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ చేసిన ఖర్చు రూ.25 లక్షలు: హోంమంత్రి అనిత
-
హైదరాబాద్-అమరావతి హైవేపై కేంద్రమంత్రి గడ్కరీతో చర్చించిన సీఎం చంద్రబాబు
-
8 నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు.. వెల్లడించిన సీఎంఐఈ
-
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె.కేశవరావు