పెరిగిన అవసరాలు.. సేవలకు అవస్థలు
ఇక్కడ కనిపిస్తున్న శాశ్వత ఆధార్ సేవాకేంద్రం చెన్నూరు తహసీల్దారు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసింది. గత ఏడాది కాలంగా ఇది తెరచుకోవడం లేదు. కేంద్రం మూసి ఉండటంతో నూతనంగా ఆధార్ నమోదు, నవీకరణకు చెన్నూరుతో పాటు ఇతరప్రాంతాల నుంచి వచ్చే వారు జిల్లా కేంద్రానికి వెళ్తున్నారు.
ఆధార్ కేంద్రాలు లేక జిల్లా కేంద్రానికి ఉరుకుల పరుగులు
కోటపల్లి, న్యూస్టుడే
ఇటీవల జిల్లా కేంద్రంలోని పురపాలిక కార్యాలయ ఆవరణలో వరుసలో నిల్చున్న వీరంతా ఆధార్కార్డులు నవీకరించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. ఉదయం 7 గంటల నుంచి స్లాట్బుక్ చేసుకోవాల్సి ఉండటంతో అంతకుముందే జిల్లా కేంద్రానికి పరుగులు పెడుతున్నారు. కేవలం 50 మందికే ఇస్తుండటంతో ప్రత్యామ్నాయం లేక వెనుదిరుగుతున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న శాశ్వత ఆధార్ సేవాకేంద్రం చెన్నూరు తహసీల్దారు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసింది. గత ఏడాది కాలంగా ఇది తెరచుకోవడం లేదు. కేంద్రం మూసి ఉండటంతో నూతనంగా ఆధార్ నమోదు, నవీకరణకు చెన్నూరుతో పాటు ఇతరప్రాంతాల నుంచి వచ్చే వారు జిల్లా కేంద్రానికి వెళ్తున్నారు.
ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికి సంబంధిత విశిష్ట సంఖ్య తప్పనిసరి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్కార్డు ప్రామాణికంగా మారింది. బ్యాంకు ద్వారా రుణాలు, విద్యాపరమైన అంశాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇలా ఏ అవసరానికైనా కీలకం. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పెరిగిన అవసరాలకు అనుగుణంగా సేవలు వినియోగించుకోవడానికి సరిపడా కేంద్రాలు లేకపోవడం సమస్యగా ఉత్పన్నమైంది. కొంతకాలంగా ఈ సేవలు పొందాలంటే కేవలం జిల్లా కేంద్రాలకే పరిమితం చేయడంతో మారుమూల మండలాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
చెన్నూరు పట్టణంతో పాటు జిల్లాలో మారుమూల మండలాలైన కోటపల్లి, వేమనపల్లి, కన్నెపల్లి, భీమారం, జైపూర్ తదితర మండలాల్లో ఇప్పటికీ ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాలు లేవు. దీంతో ఇక్కడి ప్రజలు ఆధార్ అవసరాలను తీర్చుకునేందుకు జిల్లా కేంద్రానికి పరుగులు పెడుతున్నారు. నూతనంగా ఆధార్కార్డులు పొందడం, నవీకరించుకోవడం, ఉన్నవాటిలో సమాచార మార్పులు చేర్పులు, ఫొటో అప్డేట్ చేసుకునేందుకు వ్యయప్రయాసాల కోర్చి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సమయాభావంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సంక్షేమ పథకాలకు ఆధారం
ప్రస్తుతం విద్యాసంవత్సరం, వ్యవసాయ సీజన్ ఆరంభమవడంతో విద్యార్థులు, రైతులు ఆధార్ కార్డు అవసరాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందికి మొదట్లో జారీ చేసిన కార్డులు ఉన్నప్పటికీ వాటిలో జనన వివరాలు లేకపోవడం, చిరునామాల్లో తప్పుడు దొర్లడం, ఇంటి పేర్లు లేకపోవడం తదితర సమస్యలు ఉన్నాయి. అప్పటి కార్డులను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశం ముగిసిపోవడం, అవగాహన లేకపోవడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోలేక పోయారు. ఇటీవలి కాలంగా ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేట్ సంస్థల వారు సంబంధిత ఆధార్ కార్డుల్లో వివరాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. లేని వాటిని తిరస్కరిస్తుండటంతో అధికశాతం మంది ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్థానికంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
తాజా వార్తలు (Latest News)
-
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!