నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం
వివిధ అవసరాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తులు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు ఆదుర్దా తప్పడం లేదు. కొందరు వాహన చోదకులు రహదారి నిబంధనలు పాటించక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు.
శిరస్త్రాణం భారమనుకుంటున్న వాహనచోదకులు
దిలావర్పూర్- నర్సాపూర్(జి), న్యూస్టుడే
వివిధ అవసరాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తులు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు ఆదుర్దా తప్పడం లేదు. కొందరు వాహన చోదకులు రహదారి నిబంధనలు పాటించక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. పోలీసులు రోడ్డు నిబంధనలు పాటించాలని, ద్విచక్రవాహన వాహనదారులు శిరస్త్రాణం ధరించాలని ఎంత సూచించినా రహదారిపై పోలీసులు ఉన్నప్పుడే ధరించి మళ్లీ నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నారు. ప్రతి వాహనదారుడి దగ్గర శిరస్త్రాణం ఉన్నా తలకు ధరించడం భారంగా భావిస్తున్నారు. యువత అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాహనాలను ప్రమాదాలపాల్జేస్తున్నారు.
అవగాహనతో పాటు పోలీసుల అభినందనలు..
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్రవాహనదారులు శిరస్త్రాణం ధరించాలని పోలీసులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను ఛైతన్య పరుస్తున్నారు. క్రమం తప్పకుండా శిరస్త్రాణం ధరించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులను గుర్తించి గ్రామస్థుల సమక్షంలో అభినందించి, వారి అనుభవాన్ని ప్రజలకు పంచుతున్నారు. అయినా యువకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబ సభ్యులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.
రోడ్డు నిబంధనలు పాటించిన ఓ చోదకుడికి శిరస్త్రాణం బహుమతిగా అందిస్తున్న ఎస్పీ జానకిషర్మిల (పాతచిత్రం)
ఇటీవల జరిగిన ప్రమాదాలు..
- భైంసా మండలం లింగి గ్రామం వద్ద గత నెల 25న రాత్రి ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు. మరో ద్విచక్రవాహనదారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు.
- లోకేశ్వరం మండలం బాగాపూర్ వాసి మాదరి భోజన్న ద్విచక్రవాహనంపై వెళుతుండగా, చాక్పల్లి సమీపంలో ముందర ఉన్న ట్రాక్టర్ అనుకోకుండా బ్రేక్ వేయడంతో దాన్ని ఢీకొని మృతి చెందారు.
- రాంపూర్ సమీపంలో ఓ యువకుడు అతివేగంగా ద్విచక్రవాహనం నడుపుతూ ఎదురుగా ఆటోను ఢీ కొనడంతో నిర్మల్ పట్టణానికి చెందిన క్రాంతి కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు.
- దిలావర్పూర్ గ్రామంలో ఎక్సెల్ ద్విచక్రవాహనంపై వెళ్తున్న చోదకుడిని వెనుక నుంచి మరో ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
అతివేగంతోనే ప్రమాదాలు..
శ్రీనివాస్, సీఐ, నిర్మల్ రూరల్
వాహనదారులు రహదారి నిబంధనలు పాటించక పోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయరహదారిపై ఇరువైపులా ఉన్న గ్రామ ప్రజలు రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదు. యువత రోడ్డు ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్