అనాలోచిత పనులతో ఆగమాగం..!
ఖర్చుచేసే ప్రతీ రూపాయి మనకు ఎంతోకొంత ప్రయోజనం కలిగించాలని చూస్తాం. అంతే తప్ప పోతే పోయిందిలే అనుకొని వృథా చేయం కదా. కానీ, నిర్మల్ మున్సిపల్ పాలకులు, అధికారుల వ్యవహారం చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే.
ప్రజాధనం.. కళ్లముందే దుర్వినియోగం
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే
ఫౌంటేన్ ఎత్తు తగ్గించేందుకు కూల్చేస్తున్నారిలా..
ఖర్చుచేసే ప్రతీ రూపాయి మనకు ఎంతోకొంత ప్రయోజనం కలిగించాలని చూస్తాం. అంతే తప్ప పోతే పోయిందిలే అనుకొని వృథా చేయం కదా. కానీ, నిర్మల్ మున్సిపల్ పాలకులు, అధికారుల వ్యవహారం చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. మన సొమ్ము కాదు కదా అనే నిర్లక్ష్యమో, అనాలోచితంగా ఆదరాబాదరాగా పనులు ముగించాలన్న ఆతృతో.. మొత్తానికి విలువైన ప్రజాధనాన్ని నష్టపరుస్తున్నారు. ఈ వైఖరి కారణంగా కలకాలం మన్నుతూ సేవలందించాల్సిన పనులు స్థానికులకు కంటకంగా మారుతున్నాయి.
కుంగినా.. పట్టింపు కరవు..
జిల్లాకేంద్రం.. రహదారి సుందరంగా ఉండాలి. వచ్చిపోయేవారిని ఆకట్టుకోవాలనే సదుద్దేశంతో శివాజీచౌక్ నుంచి ప్రయాణప్రాంగణం వరకు రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రహదారిని ఇరువైపులా విస్తరించే ఆలోచన చేయలేదు. పైపెచ్చు ఉన్న ప్రాంతంలోనే ఇరువైపులా పాదబాట నిర్మించారు. అది కూడా అసంపూర్తిగా. పైగా నిర్మాణ సమయంలో నాణ్యతను అంతగా పట్టించుకోకపోవడంతో పలుచోట్ల కుంగిపోయి దెబ్బతింటోంది. ఇంకొన్ని చోట్ల ఆక్రమణలకు అడ్డాగా మారింది. బస్టాండ్ సమీపంలో పాదబాట దెబ్బతినడంతో దీనిపై నడుచుకుంటూ వెళ్లేవారిలో నిత్యం పలువురు కిందపడుతున్నారు. నిర్లక్ష్యపు పనితీరును దుమ్మెత్తిపోస్తున్నారు. మున్సిపల్ అధికారులకు, పాలకులకు ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదంటూ స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. దీనివల్ల గిరాకీలు సైతం దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా పాదబాట నిర్మించి ఆక్రమణలకు ఊతమిచ్చినట్లయిందని ఆరోపిస్తున్నారు.
కూర్చోలేదు.. కుంగిన పాదబాటపై అదుపుతప్పి పడిపోయాడిలా..
కట్టించింది వారే.. కూల్చేసింది వారే..
పట్టణంలోని జయశంకర్ సర్కిల్లోని కూడలిలో ఫౌంటేన్ నిర్మించారు. నిర్మల్ ప్రాభవం తెలిపేలా కొయ్యబొమ్మల ఆకృతులు ఏర్పాటుచేశారు. అయితే.. రహదారి కాస్త మూలమలుపుగా ఉండటం, ఎత్తుగా ఉండటం కారణంగా వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతాయని, ఫౌంటేన్ నిర్మాణం అంతగా అవసరం లేదని నిర్మాణ సమయంలోనే పలువురు వాపోయారు. కానీ, రహదారి సుందరీకరణ, అభివృద్ధి అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసి పనులు వేగంగా పూర్తిచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే సమస్య మొదలైంది. కొద్దిరోజుల తర్వాతగానీ ఆ నిర్మాణం వల్ల కలిగే ఇబ్బందులు తెలుసుకోలేకపోయారు. ఫౌంటేన్ ఎత్తు ఎక్కువగా ఉండటంతో వాహనాలను గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారన్న కారణంతో దాని ఎత్తును తగ్గించేలా నిర్మాణం కూల్చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పనులు చేపట్టిన సమయంలో ఉన్న పాలకులే ఇప్పుడు కూల్చేస్తున్న సమయంలో ఉండటం గమనార్హం. నిర్మాణ సమయంలోనే ఇవన్నీ పరిశీలించి ఉంటే ఇప్పుడిలా నిధులు నష్టపోయే పరిస్థితి ఉండేది కాదుకదా అనే భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
మరమ్మతులు చేయిస్తాం
సి.వి.ఎన్.రాజు, మున్సిపల్ కమిషనర్
పాదబాట కుంగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. అవసరమైన మరమ్మతులు చేయించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. వాహనదారుల ఇబ్బందుల దృష్ట్యా ఫౌంటేన్ ఎత్తు తగ్గించారు. మున్సిపల్ ఛైర్మన్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన