సంప్రదాయ ఆటలో మెరికలు
కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు.
నేడు జాతీయ ఖోఖో దినోత్సవం
కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. ఆదివారం జాతీయ ఖోఖో దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంతమంది ఆ ఆటల్లో మెరికల గురించి వివరిస్తూ ‘న్యూస్టుడే’ కథనం.
న్యూస్టుడే, ఆదిలాబాద్ క్రీడావిభాగం
గతంలో నేల.. ఇప్పుడు సింథటిక్ మ్యాట్
ఏ పాఠశాలలో చూసినా ఖాళీ పీరియడ్ ఉంటే చాలు పిల్లలు ఎంతో హుషారుగా మైదానంలో నేలపైన ఖోఖో ఆడేవారు. క్రమంగా ఈ ఆట కాస్త ఇండోర్గా మారింది. సింథటిక్ మ్యాట్లపైన విద్యుద్దీపాల వెలుగులో ఆడుతున్నారు. ప్రీమియర్ ఖోఖో లీగ్ పోటీల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చురుకైన క్రీడాకారులను కొనుగోలు చేస్తున్నారు. అందులో అత్యుత్తమంగా రాణించిన వారిని భారత ఖోఖో జట్టుకు ఎంపిక చేస్తున్నారు.
పతకాలే లక్ష్యం..
వీరు ఉట్నూరు గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు సిడాం నవీన్కుమార్, మెస్రం నిఖిల్కుమార్, సిడాం శంకర్, కుమ్ర సురేందర్. ఖోఖో శిక్షకుడు శివకృష్ణ వద్ద రాటుదేలారు. భారత ఖోఖో సమాఖ్య ఆధ్వర్యంలో కర్ణాటకలో జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించి మూడో స్థానంలో నిలిపారు. కాంస్య పతకాన్ని అందుకున్నారు. 67వ ఎస్జీఎఫ్ జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో నిఖిల్కుమార్, ఆత్రం ఉదయ్కిరణ్ రజత పతకాలు సాధించారు. ఈ విద్యార్థులు పతకాలే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు.
భవిష్యత్తు క్రీడా తార..
ఇంద్రవెల్లి మండలం బుర్సన్పటార్ కొలాంగూడకు చెందిన మడావి ప్రశాంత్ భవిష్యత్తు క్రీడా తారగా అందరిని భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 33 జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్నారు. మూడుసార్లు సీనియర్ జాతీయస్థాయి పురుషుల ఖోఖో పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు ఖేలో ఇండియా జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని కాంస్య పతకాలు సాధించారు. పోల్ డైవ్లో ప్రావీణ్యం పొందిన ఆయన అదే ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థులను ఔట్ చేయడంలో ఈయనకు ఈయనే సాటి. ప్రీమియర్ ఖోఖో లీగ్లో ఆడడమే తనముందున్న లక్ష్యంగా సాదన చేస్తున్నారు.
ఆల్రౌండర్లుగా రాణింపు..
ఈ బాలికలు ఆసిఫాబాద్ గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో చదువుతున్నారు. ఖోఖో శిక్షకుడు వి.తిరుమల్ వద్ద శిక్షణ పొందుతున్న వీరంతా అనతి కాలంలోనే ఆ ఆటపై పట్టు సాధించారు. టి.నందిని, ఎ.సోని, కె.నాగేశ్వరి, కె.సత్యశీల, సీహెచ్.జంగుబాయి, ఎ.శ్రీలత మంచి ఆల్రౌండర్లుగా(డిఫెండర్, ఆటాకర్) గుర్తింపు పొందారు. బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి ఖోఖో ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటారు. దిల్లీలో నిర్వహించిన సీనియర్ జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్నారు. రెండుసార్లు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలిచారు. దేశానికి ఆడాలన్నదే తమ లక్ష్యమంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీగా ఎస్జీటీల స్థానచలనం
[ 02-07-2024]
జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు భారీగా జరిగాయి. సోమవారం మొత్తం 812 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
విపత్తుల నివారణదళం.. సన్నద్ధం
[ 02-07-2024]
జిల్లాలో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు ఏర్పడితే సహాయక చర్యల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ బాధలు ఎక్కువ. భారీ వర్షాల్లో ఎవరైనా చిక్కుకుంటే అంతే సంగతులు. కేంద్ర రక్షణ బృందాలు రావాలంటే ఆలస్యమౌతుంది. -
రైతు నేస్తం.. సాంకేతిక ఫలం
[ 02-07-2024]
జిల్లాల్లో నిర్మించిన రైతు వేదికల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు వీలుగా దృశ్యశ్రవణ పరికరాలను బిగించి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
హరితవనంలో గంజాయి మొక్క
[ 02-07-2024]
పట్టణ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా ఎదిగాయి. హరితవనాన్ని తలపిస్తున్న చెట్ల మధ్య ఓ గంజాయి మొక్క కూడా ఏపుగా 10 అడుగుల ఎత్తు పెరిగింది. -
అమ్మకు కానుక.. అవనికి వేడుక
[ 02-07-2024]
పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ విసీˆ్తర్ణం పెంపుపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నా మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటడం ఆనందంగా ఉంది. -
బదిలీలకు హేతుబద్ధీకరణ ముడి!
[ 02-07-2024]
బదిలీ ఆర్డర్లు చేతికి అందినా పాత స్థానం నుంచి విడుదలై కొత్త చోటికి వెళ్లలేని పరిస్థితి. ఎంతో కాలం తర్వాత కోరుకున్న చోటికి బదిలీ జరిగిందన్న సంతోషం లేకుండా పోయింది. -
ఇంటి నంబర్లు రావు.. రిజిస్ట్రేషన్లు కావు
[ 02-07-2024]
పంచాయతీ నుంచి పురపాలికగా ప్రకటించిన అనంతరం దస్త్రాల బదలాయింపు, డిజిటల్ కీ రాకపోవడంతో.. ఆసిఫాబాద్ పట్టణంలో పురపాలన నిలిచిపోయింది. -
తాగుడికి బానిసైన భర్త..
[ 02-07-2024]
రోజూ తాగొచ్చి గొడవ చేసే భర్తతో.. ఆ ఇల్లాలు, సంతానం అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో అతను హత్యాయత్నం చేసిన ఘటనలో నమోదైన కేసులో జైలుకు వెళ్లాడు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 02-07-2024]
జిల్లాలో నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎ.భాస్కర్ పేర్కొన్నారు. -
వందేభారత్ నిలపాలని రైల్వేబోర్డు ఛైర్పర్సన్కు వినతి
[ 02-07-2024]
హైదరాబాద్ నుంచి నాగ్పూర్కు వెళ్లే వందేభారత్ సూపర్ఫాస్ట్ రైలును మంచిర్యాలలో నిలపాలని కోరుతూ రైల్వే బోర్డు ఛైర్పర్సన్ జయవర్మసిన్హాకు భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు. -
పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు
[ 02-07-2024]
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జీఎస్టీలో ఉత్తమ పురస్కారం
[ 02-07-2024]
జీఎస్టీ దినోత్సవం పురస్కరించుకుని ఆలిండియా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 28 మంది జీఎస్టీ ఇన్స్పెక్టర్లను ఎంపిక చేశారు. -
అమల్లోకి కొత్త చట్టాలు
[ 02-07-2024]
భారత ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నేర, న్యాయ చట్టాలు-2023 సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. -
నకిలీ విత్తనాల కేసులో ముగిసిన పోలీసు కస్టడీ
[ 02-07-2024]
నకిలీ పత్తి విత్తనాల కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు నాలుగు రోజుల కిందట విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి తీసుకోగా గడువు పూర్తవ్వటంతో సోమవారం తిరిగి కోర్టులో ప్రవేశ పెట్టారు. -
ఏసీ గదులు వీడి గ్రామాల్లో తిరగండి
[ 02-07-2024]
‘అధికారులు కార్యాలయాల్లో ఏసీ గదుల్లో కూర్చునే బదులు గ్రామాలు తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రజాప్రతినిధులం మేం అయిదేళ్లు మాత్రమే ఉంటే.. మీరు జీవితకాలం వివిధ హోదాల్లో ప్రజల మధ్యనే ఉండి విధులు నిర్వహిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం