అవినీతిలో ఘనుడు
పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్లు, ఢైరీఫామ్లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య.
ఆసిఫాబాద్లో సుబ్బ శంభుదాస్ను ఆయన నివాసం వద్ద కారులో
ఎక్కించేందుకు తీసుకెళ్తున్న అనిశా అధికారులు
ఈనాడు, ఆసిఫాబాద్: పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్లు, ఢైరీఫామ్లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య. రెవెన్యూ వ్యవస్థలో వెళ్లూనుకున్న అవినీతికి చిరునామాగా ఉండే ఆర్డీఓను.. తాజాగా ఏసీబీ కేసులో అధికారులు అదుపులోకి తీసుకుని విచారించడం చర్చనీయాంశంగా మారింది. సదరు అధికారి ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేయడంతో ఆయన హయాంలో ఇక్కడ జరిగిన అవినీతిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
ఆసిఫాబాద్ ఆర్డీఓగా సిడాం దత్తు 2019లో పనిచేసే సమయంలోనే.. ఆయనపై భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్థిరాస్తి వ్యాపారికి విక్రయించేందుకు వీలుగా ఓ పార్టీ నేతకు పట్టా చేసి ఇస్తానని అందుకు రూ.50 లక్షల వరకు ఇవ్వాలనే ఆడియో అప్పట్లోనే వైరల్ అయింది. ఇందులో వివిధ స్థాయి అధికారులతో పాటు, కలెక్టర్ పేరును సైతం ప్రస్తావించడం సంచలనంగా మారింది. అనంతరం ఈ విషయంపై ఎలాంటి విచారణ చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఈ స్థలం కబ్జాకు గురై భారీ కట్టడాలకు నిలయంగా మారింది. ఆయన హయాంలో 21 మంది వధువుల నకిలీ పత్రాలు సృష్టించి కల్యాణలక్ష్మి పథకం డబ్బులు రూ.21 లక్షలు పక్కదారి పట్టించారు. కెరమెరి మండల కేంద్రానికి చెందిన ఆన్లైన్ కేంద్రాలు నిర్వహించే ముగ్గురు వ్యక్తులు ఈ దందాకు పాల్పడినట్లుగా తెలిపారు. రూ.17 లక్షలు రికవరీ చేసినా, అనంతరం ఎలాంటి విచారణ, ఈ అక్రమాల వెనుక ఎవరున్నారనే విషయాలు ఇప్పటికీ నిగ్గు తేలలేదు.
రాజకీయ నేతల మద్దతుతో...
నాలుగు వరుసల రహదారి జిల్లా నుంచి వెళ్లడంతో భూములు కోల్పోయిన వారికి, మంజూరైన పరిహారంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లుగా అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. భూములు పోకున్నా, రూ.లక్షల్లో పరిహారం రావడం, పోయిన వారికి అతి తక్కువ, పక్కపక్కన ఉన్న వ్యక్తులకు పరిహారం చెల్లింపుల్లో భారీ వ్యత్యాసాలు, ఎక్కువగా భూమి పోయిన వారికి తక్కువ డబ్బులు రావడం, తదితర సమస్యలు ఎన్నో వెలుగు చూశాయి. రహదారి ప్రస్తుతం పూర్తయినా, ఇంకా పరిహారం రాని బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నేతల మద్దతుతోనే రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా సర్వే చేసి, భారీ స్థాయిలో నిధులు పక్కదారి పట్టించారని ప్రజలంతా భావించారు.
ముందస్తు బెయిల్ తిరస్కరణ..
పరిహారం చెల్లింపు అంశంలో రూ.కోట్లలో అవినీతి జరిగిందనే అనిశా అధికారుల కేసు నేపథ్యంలో.. నిందితులందరూ, కరీంనగర్ ఏసీబీ కోర్టుతో పాటు, హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. మే 17, 27 తేదీల్లో రెండు సార్లు విచారణ జరిగిన అనంతరం వీరి బెయిల్ అభ్యర్థనను కోర్టులు తిరస్కరించడంతో.. శనివారం వేర్వేరు ప్రాంతాల్లో అనిశా అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సర్వేయర్ భరత్ డిప్యూటేషన్పై హైదరాబాద్లో పనిచేయడం, శనివారం కార్యాలయానికి రాకపోవడంతో అదుపులోకి తీసుకోలేదని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీగా ఎస్జీటీల స్థానచలనం
[ 02-07-2024]
జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు భారీగా జరిగాయి. సోమవారం మొత్తం 812 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
విపత్తుల నివారణదళం.. సన్నద్ధం
[ 02-07-2024]
జిల్లాలో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు ఏర్పడితే సహాయక చర్యల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ బాధలు ఎక్కువ. భారీ వర్షాల్లో ఎవరైనా చిక్కుకుంటే అంతే సంగతులు. కేంద్ర రక్షణ బృందాలు రావాలంటే ఆలస్యమౌతుంది. -
రైతు నేస్తం.. సాంకేతిక ఫలం
[ 02-07-2024]
జిల్లాల్లో నిర్మించిన రైతు వేదికల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు వీలుగా దృశ్యశ్రవణ పరికరాలను బిగించి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
హరితవనంలో గంజాయి మొక్క
[ 02-07-2024]
పట్టణ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా ఎదిగాయి. హరితవనాన్ని తలపిస్తున్న చెట్ల మధ్య ఓ గంజాయి మొక్క కూడా ఏపుగా 10 అడుగుల ఎత్తు పెరిగింది. -
అమ్మకు కానుక.. అవనికి వేడుక
[ 02-07-2024]
పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ విసీˆ్తర్ణం పెంపుపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నా మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటడం ఆనందంగా ఉంది. -
బదిలీలకు హేతుబద్ధీకరణ ముడి!
[ 02-07-2024]
బదిలీ ఆర్డర్లు చేతికి అందినా పాత స్థానం నుంచి విడుదలై కొత్త చోటికి వెళ్లలేని పరిస్థితి. ఎంతో కాలం తర్వాత కోరుకున్న చోటికి బదిలీ జరిగిందన్న సంతోషం లేకుండా పోయింది. -
ఇంటి నంబర్లు రావు.. రిజిస్ట్రేషన్లు కావు
[ 02-07-2024]
పంచాయతీ నుంచి పురపాలికగా ప్రకటించిన అనంతరం దస్త్రాల బదలాయింపు, డిజిటల్ కీ రాకపోవడంతో.. ఆసిఫాబాద్ పట్టణంలో పురపాలన నిలిచిపోయింది. -
తాగుడికి బానిసైన భర్త..
[ 02-07-2024]
రోజూ తాగొచ్చి గొడవ చేసే భర్తతో.. ఆ ఇల్లాలు, సంతానం అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో అతను హత్యాయత్నం చేసిన ఘటనలో నమోదైన కేసులో జైలుకు వెళ్లాడు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 02-07-2024]
జిల్లాలో నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎ.భాస్కర్ పేర్కొన్నారు. -
వందేభారత్ నిలపాలని రైల్వేబోర్డు ఛైర్పర్సన్కు వినతి
[ 02-07-2024]
హైదరాబాద్ నుంచి నాగ్పూర్కు వెళ్లే వందేభారత్ సూపర్ఫాస్ట్ రైలును మంచిర్యాలలో నిలపాలని కోరుతూ రైల్వే బోర్డు ఛైర్పర్సన్ జయవర్మసిన్హాకు భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు. -
పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు
[ 02-07-2024]
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జీఎస్టీలో ఉత్తమ పురస్కారం
[ 02-07-2024]
జీఎస్టీ దినోత్సవం పురస్కరించుకుని ఆలిండియా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 28 మంది జీఎస్టీ ఇన్స్పెక్టర్లను ఎంపిక చేశారు. -
అమల్లోకి కొత్త చట్టాలు
[ 02-07-2024]
భారత ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నేర, న్యాయ చట్టాలు-2023 సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. -
నకిలీ విత్తనాల కేసులో ముగిసిన పోలీసు కస్టడీ
[ 02-07-2024]
నకిలీ పత్తి విత్తనాల కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు నాలుగు రోజుల కిందట విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి తీసుకోగా గడువు పూర్తవ్వటంతో సోమవారం తిరిగి కోర్టులో ప్రవేశ పెట్టారు. -
ఏసీ గదులు వీడి గ్రామాల్లో తిరగండి
[ 02-07-2024]
‘అధికారులు కార్యాలయాల్లో ఏసీ గదుల్లో కూర్చునే బదులు గ్రామాలు తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రజాప్రతినిధులం మేం అయిదేళ్లు మాత్రమే ఉంటే.. మీరు జీవితకాలం వివిధ హోదాల్లో ప్రజల మధ్యనే ఉండి విధులు నిర్వహిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఒక్క రోజులో యుద్ధం ఆపేస్తానన్న ట్రంప్.. సాధ్యం కాదన్న రష్యా!
-
రెప్పపాటులో మృత్యు కాటు.. సర్పంచి దుర్మరణం
-
పిన్నెల్లితో మాజీ మంత్రుల ములాఖత్
-
తిరుమల శ్రీవారి ప్రసాదం ఇచ్చి వెళ్తూ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
-
ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి: లోక్సభలో తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు