ముంచుకొస్తున్న ముప్పు.. కలగాలి కనువిప్పు!
కాగజ్నగర్ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి.
కాగజ్నగర్ మున్సిపాలిటీ వార్డులు: 30
జనాభా: 56,370
కృష్ణానగర్ కాలనీలో అసంపూర్తి మురుగు కాలువ
కాగజ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే : కాగజ్నగర్ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడి కలిగిన కాలనీల్లో మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టడం, పేదలు నివాసముంటున్న కాలనీల్లో రోడ్లు సక్రమంగా ఉండటం లేదని, మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో అపరిశుభ్రత వాతావరణంతో ఈగలు, దోమలు వృద్ధి చెంది పలు వ్యాధులకు కారణమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇంటి పన్నుల వసూళ్లలో ముందుంటున్న పురపాలక సంఘ పాలకవర్గం అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శలు సైతం వస్తున్నాయి.
భట్టుపల్లి చౌరస్తా వద్ద ఇదీ పరిస్థితి..
కౌసర్నగర్, కృష్ణానగర్, నౌగాంబస్తీ కాలనీల్లో కనీస మురుగు కాలువల వ్యవస్థ లేకపోవడంతో.. కాలనీలవాసులు అపరిశుభ్ర వాతావరణంలోనే కాలం వెళ్లదీస్తున్నారు. వానకాలానికి ముందే వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి ఇటీవలే ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడంలేదు. ఈ రెండు కాలనీలతోపాటు సంజీవయ్యకాలనీ, ఇందిరామార్కెట్ ఏరియాల్లో వానలు పడిన సందర్భాల్లో వరదతో ముంపునకు గురికావడం సర్వసాధారణంగా మారిందని కాలనీవాసులు వాపోతున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లపై వరదనీరు చేరి బురదమయంగా మారిందని, కనీసం నడవలేని దుస్థితి నెలకొందని చెబుతున్నారు.
దీంతోపాటు వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా.. తాగునీటి పథకాల వద్ద అపరిశుభ్రత లేకుండా చూడటం, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చి వేయడం, చిత్తడిగా మారిన రోడ్లపై బ్లీచింగ్ పౌడర్ చల్లాల్సి ఉంటుంది. దోమల నివారణ చర్యల్లో భాగంగా కాలనీల్లో ఫాగింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ.. ఇందులో ఏ ఒక్కటీ బల్దియాలో కానరావడం లేదు. తొలకరి వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలని ఆయా కాలనీవాసులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు నేస్తం.. సాంకేతిక ఫలం
[ 02-07-2024]
జిల్లాల్లో నిర్మించిన రైతు వేదికల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు వీలుగా దృశ్యశ్రవణ పరికరాలను బిగించి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
హరితవనంలో గంజాయి మొక్క
[ 02-07-2024]
పట్టణ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా ఎదిగాయి. హరితవనాన్ని తలపిస్తున్న చెట్ల మధ్య ఓ గంజాయి మొక్క కూడా ఏపుగా 10 అడుగుల ఎత్తు పెరిగింది. -
అమ్మకు కానుక.. అవనికి వేడుక
[ 02-07-2024]
పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ విసీˆ్తర్ణం పెంపుపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నా మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటడం ఆనందంగా ఉంది. -
బదిలీలకు హేతుబద్ధీకరణ ముడి!
[ 02-07-2024]
బదిలీ ఆర్డర్లు చేతికి అందినా పాత స్థానం నుంచి విడుదలై కొత్త చోటికి వెళ్లలేని పరిస్థితి. ఎంతో కాలం తర్వాత కోరుకున్న చోటికి బదిలీ జరిగిందన్న సంతోషం లేకుండా పోయింది. -
ఇంటి నంబర్లు రావు.. రిజిస్ట్రేషన్లు కావు
[ 02-07-2024]
పంచాయతీ నుంచి పురపాలికగా ప్రకటించిన అనంతరం దస్త్రాల బదలాయింపు, డిజిటల్ కీ రాకపోవడంతో.. ఆసిఫాబాద్ పట్టణంలో పురపాలన నిలిచిపోయింది. -
తాగుడికి బానిసైన భర్త..
[ 02-07-2024]
రోజూ తాగొచ్చి గొడవ చేసే భర్తతో.. ఆ ఇల్లాలు, సంతానం అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో అతను హత్యాయత్నం చేసిన ఘటనలో నమోదైన కేసులో జైలుకు వెళ్లాడు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 02-07-2024]
జిల్లాలో నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎ.భాస్కర్ పేర్కొన్నారు. -
వందేభారత్ నిలపాలని రైల్వేబోర్డు ఛైర్పర్సన్కు వినతి
[ 02-07-2024]
హైదరాబాద్ నుంచి నాగ్పూర్కు వెళ్లే వందేభారత్ సూపర్ఫాస్ట్ రైలును మంచిర్యాలలో నిలపాలని కోరుతూ రైల్వే బోర్డు ఛైర్పర్సన్ జయవర్మసిన్హాకు భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు. -
పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు
[ 02-07-2024]
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జీఎస్టీలో ఉత్తమ పురస్కారం
[ 02-07-2024]
జీఎస్టీ దినోత్సవం పురస్కరించుకుని ఆలిండియా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 28 మంది జీఎస్టీ ఇన్స్పెక్టర్లను ఎంపిక చేశారు. -
అమల్లోకి కొత్త చట్టాలు
[ 02-07-2024]
భారత ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నేర, న్యాయ చట్టాలు-2023 సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. -
నకిలీ విత్తనాల కేసులో ముగిసిన పోలీసు కస్టడీ
[ 02-07-2024]
నకిలీ పత్తి విత్తనాల కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు నాలుగు రోజుల కిందట విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి తీసుకోగా గడువు పూర్తవ్వటంతో సోమవారం తిరిగి కోర్టులో ప్రవేశ పెట్టారు. -
ఏసీ గదులు వీడి గ్రామాల్లో తిరగండి
[ 02-07-2024]
‘అధికారులు కార్యాలయాల్లో ఏసీ గదుల్లో కూర్చునే బదులు గ్రామాలు తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రజాప్రతినిధులం మేం అయిదేళ్లు మాత్రమే ఉంటే.. మీరు జీవితకాలం వివిధ హోదాల్లో ప్రజల మధ్యనే ఉండి విధులు నిర్వహిస్తారు.