వెన్నుపూసలు కదులుతున్నాయ్!
జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు.
అడుగడుగునా గుంతలతో ఇబ్బందులు
జోడువాగుల ప్రాంతంలో అధ్వానంగా రహదారి
భీమారం వైపు రహదారిపై ఏర్పడ్డ గుంతల్లో నిలిచిన నీరు
జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. చెన్నూరు నుంచి మంచిర్యాలకు వెళ్లడం ఒక ఎత్తయితే ఈ కి.మీ. ప్రయాణం మరో ఎత్తుగా మారింది. అడుగడుగునా గుంతలు ఏర్పడటంతోపాటు బస్సులు, లారీలు, ఇతర వాహనాలు వెళ్తున్నపుడు విపరీతంగా దుమ్ము లేస్తోంది. రాకపోకలు సాగించేందుకు ద్విచక్ర వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతల్లో ప్రయాణంతో వెన్నుపూసలు కదులుతున్నాయని చోదకులు వాపోతున్నారు.
న్యూస్టుడే, చెన్నూరు గ్రామీణం
కిలోమీటరు.. బేజారు..
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలుపుతూ చేపట్టిన నిజామాబాద్- జగ్ధల్పూర్ 63వ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భీమారం- చెన్నూరు మండలాల సరిహద్దున ఉన్న జోడువాగుల ప్రాంతంలో 1.09 కిలోమీటర్ల రిజర్వు ఫారెస్ట్ ప్రాంతం ఉంది. ఇక్కడ రోడ్డుతోపాటు వంతెన నిర్మాణ పనులు చేపట్టాలి. వివిధ కారణాలతో పనులు చేపట్టకపోవడంతో రోడ్డంతా అధ్వానంగా మారింది. రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గుంతలతోపాటు, అనేక చోట్ల తారు లేచిపోయింది. రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితులున్నాయి. భారీ వాహనాలు వచ్చే సమయంలో ద్విచక్ర, ఇతర వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రివేళల్లో అయితే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక వర్షం పడితే రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో నీళ్లు నిలిచి ఉండటంతో వాహనచోదకులు పడరాని పాట్లు పడుతున్నారు. గుంతలు తప్పించబోయే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. కార్లు, టాటాఏస్, ఇతర వాహనాలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నవారు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. గుంతల కారణంగా తరచూ వాహనాలు చెడిపోతున్నాయి. దీంతో వాటి మరమ్మతులకు డబ్బులు వెచ్చిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
జోడువాగుల వద్ద అధ్వానంగా మారిన రహదారి
విపరీతమైన దుమ్ము..
రోడ్డుపై నుంచి భారీ వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో దుమ్ముతో వాటి వెనకాల వెళ్తున్న ద్విచక్ర వాహనచోదకులు కళ్లు కనపడని పరిస్థితి ఉంది. చోదకులు తలలకు రుమాలు, మహిళలు చున్నీలు చుట్టుకొని దుమ్ము బారి నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, వందలాది ఇసుక లారీలు, ఇతర వాహనాలు నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనచోదకులు వెళ్లాలంటే జంకుతున్నారు. రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు దూరం చేసేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. సిమెంటు, కంకరతో గుంతలు పూడ్చివేస్తే కొంతవరకు ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలున్నాయి.
ఆర్థికంగా నష్టపోతున్నాం..
ఆకుల రామకృష్ణ, కారు యజమాని, చోదకులు
కొన్నాళ్ల నుంచి చెన్నూరు నుంచి వివిధ పట్టణాలకు కారు నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటాను. జోడు వాగుల వద్ద రోడ్డుపై ఏర్పడ్డ గుంతలతో కారుకు తరచూ మరమ్మతులు చేయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నెలరోజుల పాటు కష్టపడి సంపాదించిన డబ్బులు ఒక్కసారిగా కారు మరమ్మతులకు వెచ్చించి ఆర్థికంగా నష్టపోతున్నాం.
భయపడుతూ రాకపోకలు..
గౌరోజు కృష్ణమూర్తి, ద్విచక్ర వాహన చోదకుడు, చెన్నూరు
అవసరం నిమిత్తం చెన్నూరు-మంచిర్యాలకు రాకపోకలు సాగించేందుకు జోడువాగుల ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. భయపడుతూ వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. భారీ వాహనాలు ఎదురుపడితే దుమ్ముతో నానా తంటాలు పడుతున్నాం. రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ఇబ్బందులను దూరం చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీగా ఎస్జీటీల స్థానచలనం
[ 02-07-2024]
జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు భారీగా జరిగాయి. సోమవారం మొత్తం 812 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
విపత్తుల నివారణదళం.. సన్నద్ధం
[ 02-07-2024]
జిల్లాలో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు ఏర్పడితే సహాయక చర్యల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ బాధలు ఎక్కువ. భారీ వర్షాల్లో ఎవరైనా చిక్కుకుంటే అంతే సంగతులు. కేంద్ర రక్షణ బృందాలు రావాలంటే ఆలస్యమౌతుంది. -
రైతు నేస్తం.. సాంకేతిక ఫలం
[ 02-07-2024]
జిల్లాల్లో నిర్మించిన రైతు వేదికల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు వీలుగా దృశ్యశ్రవణ పరికరాలను బిగించి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
హరితవనంలో గంజాయి మొక్క
[ 02-07-2024]
పట్టణ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా ఎదిగాయి. హరితవనాన్ని తలపిస్తున్న చెట్ల మధ్య ఓ గంజాయి మొక్క కూడా ఏపుగా 10 అడుగుల ఎత్తు పెరిగింది. -
అమ్మకు కానుక.. అవనికి వేడుక
[ 02-07-2024]
పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ విసీˆ్తర్ణం పెంపుపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నా మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటడం ఆనందంగా ఉంది. -
బదిలీలకు హేతుబద్ధీకరణ ముడి!
[ 02-07-2024]
బదిలీ ఆర్డర్లు చేతికి అందినా పాత స్థానం నుంచి విడుదలై కొత్త చోటికి వెళ్లలేని పరిస్థితి. ఎంతో కాలం తర్వాత కోరుకున్న చోటికి బదిలీ జరిగిందన్న సంతోషం లేకుండా పోయింది. -
ఇంటి నంబర్లు రావు.. రిజిస్ట్రేషన్లు కావు
[ 02-07-2024]
పంచాయతీ నుంచి పురపాలికగా ప్రకటించిన అనంతరం దస్త్రాల బదలాయింపు, డిజిటల్ కీ రాకపోవడంతో.. ఆసిఫాబాద్ పట్టణంలో పురపాలన నిలిచిపోయింది. -
తాగుడికి బానిసైన భర్త..
[ 02-07-2024]
రోజూ తాగొచ్చి గొడవ చేసే భర్తతో.. ఆ ఇల్లాలు, సంతానం అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో అతను హత్యాయత్నం చేసిన ఘటనలో నమోదైన కేసులో జైలుకు వెళ్లాడు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 02-07-2024]
జిల్లాలో నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎ.భాస్కర్ పేర్కొన్నారు. -
వందేభారత్ నిలపాలని రైల్వేబోర్డు ఛైర్పర్సన్కు వినతి
[ 02-07-2024]
హైదరాబాద్ నుంచి నాగ్పూర్కు వెళ్లే వందేభారత్ సూపర్ఫాస్ట్ రైలును మంచిర్యాలలో నిలపాలని కోరుతూ రైల్వే బోర్డు ఛైర్పర్సన్ జయవర్మసిన్హాకు భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు. -
పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు
[ 02-07-2024]
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జీఎస్టీలో ఉత్తమ పురస్కారం
[ 02-07-2024]
జీఎస్టీ దినోత్సవం పురస్కరించుకుని ఆలిండియా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 28 మంది జీఎస్టీ ఇన్స్పెక్టర్లను ఎంపిక చేశారు. -
అమల్లోకి కొత్త చట్టాలు
[ 02-07-2024]
భారత ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నేర, న్యాయ చట్టాలు-2023 సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. -
నకిలీ విత్తనాల కేసులో ముగిసిన పోలీసు కస్టడీ
[ 02-07-2024]
నకిలీ పత్తి విత్తనాల కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు నాలుగు రోజుల కిందట విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి తీసుకోగా గడువు పూర్తవ్వటంతో సోమవారం తిరిగి కోర్టులో ప్రవేశ పెట్టారు. -
ఏసీ గదులు వీడి గ్రామాల్లో తిరగండి
[ 02-07-2024]
‘అధికారులు కార్యాలయాల్లో ఏసీ గదుల్లో కూర్చునే బదులు గ్రామాలు తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రజాప్రతినిధులం మేం అయిదేళ్లు మాత్రమే ఉంటే.. మీరు జీవితకాలం వివిధ హోదాల్లో ప్రజల మధ్యనే ఉండి విధులు నిర్వహిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పగ్గాలు చేపట్టినా.. నిద్రాణంలో పాలన
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్