ప్రసాదాలపై పర్యవేక్షణ శూన్యం
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు.
ముథోల్(బాసర), న్యూస్టుడే: బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు. దీన్ని కొందరు సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ రోజుల్లోనే ఇలా అవినీతికి పాల్పడితే దసరా, వసంతపంచమి, గురుపౌర్ణమి, మూల నక్షత్రం రోజుల్లో అమ్మవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆ సమయంలో చేతివాటం ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. ఈ రోజుల్లో ప్రసాదాలు వేల సంఖ్యలో తయారు చేసి విక్రయిస్తారు. భక్తులకు ఏర్పాట్లు, సౌకర్యాలపై అధికారులు సందడిగా ఉంటారు. ఈ సమయంలో ప్రసాదాలపై ఎవరూ దృష్టి సారించలేరు. శుక్రవారం బాసర గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. దీనికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని భావించి అందుకు అనుగుణంగా ప్రసాదాలు తయారుచేయించారు. ప్రసాదాల తయారీ కేంద్రం నుంచి రికార్డుల పరంగా కాకుండా ఎక్కువగా తీసుకొచ్చారు. ఎవరు గమనించకుంటే ఈ బాగోతం కొనసాగేదే.. గ్రామస్థులు పట్టుకున్న 294 పులిహోర ప్యాకెట్ల విలువ సుమారు రూ.6 వేల వరకు ఉంటుంది. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తయారీ కేంద్రం నుంచి ఐదు సార్లు అంటే ఒక్కోసారి 200 అంటే సుమారు ఒక రోజే వేయి ప్రసాదాలను ఎక్కువగా తీసుకువచ్చి విక్రయించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఉత్సవాల సమయంలో ఒక్క రోజే దాదాపు రూ.50 వేల వరకు ఇలా విక్రయించి వాటాలు పంచుకుంటారని తెలుస్తోంది.
విభేదాలు రావడంతోనే..
తయారీ కేంద్రం నుంచి ప్రసాదాన్ని కౌంటర్లకు పంపేటప్పుడు అక్కడి ఉద్యోగి రిజిస్టర్లో వాటి సంఖ్య నమోదు చేస్తారు. ఈ విషయం అక్కడి ఉద్యోగి, ఆటోలో తీసుకొచ్చే సిబ్బందికి మాత్రమే తెలుస్తుంది. కానీ వాటాలలో తేడాలు రావడంతోనే ఈ బాగోతం బయట పడిందని స్థానికులు అంటున్నారు. ఇటీవల ఆలయ ఉద్యోగుల విధుల మార్పు జరిగింది. వాటాలకు అలవాటు పడిన వారు తాము అక్రమ ఆదాయం కోల్పోతున్నామని బయటకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఆలయ ఉన్నతాధికారులు ఈ బాగోతాన్ని ఒక్కరోజు కూడా గుర్తించిన దాఖలాలు లేవు. అక్రమ ఆదాయంలో అందరికీ వాటాలు ఉండటం వల్లనే తనిఖీలు చేయడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ విజయరామారావును చరవాణిలో సంప్రదించగా ప్రసాదాల్లో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీగా ఎస్జీటీల స్థానచలనం
[ 02-07-2024]
జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు భారీగా జరిగాయి. సోమవారం మొత్తం 812 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
విపత్తుల నివారణదళం.. సన్నద్ధం
[ 02-07-2024]
జిల్లాలో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు ఏర్పడితే సహాయక చర్యల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ బాధలు ఎక్కువ. భారీ వర్షాల్లో ఎవరైనా చిక్కుకుంటే అంతే సంగతులు. కేంద్ర రక్షణ బృందాలు రావాలంటే ఆలస్యమౌతుంది. -
రైతు నేస్తం.. సాంకేతిక ఫలం
[ 02-07-2024]
జిల్లాల్లో నిర్మించిన రైతు వేదికల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు వీలుగా దృశ్యశ్రవణ పరికరాలను బిగించి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
హరితవనంలో గంజాయి మొక్క
[ 02-07-2024]
పట్టణ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా ఎదిగాయి. హరితవనాన్ని తలపిస్తున్న చెట్ల మధ్య ఓ గంజాయి మొక్క కూడా ఏపుగా 10 అడుగుల ఎత్తు పెరిగింది. -
అమ్మకు కానుక.. అవనికి వేడుక
[ 02-07-2024]
పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ విసీˆ్తర్ణం పెంపుపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నా మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటడం ఆనందంగా ఉంది. -
బదిలీలకు హేతుబద్ధీకరణ ముడి!
[ 02-07-2024]
బదిలీ ఆర్డర్లు చేతికి అందినా పాత స్థానం నుంచి విడుదలై కొత్త చోటికి వెళ్లలేని పరిస్థితి. ఎంతో కాలం తర్వాత కోరుకున్న చోటికి బదిలీ జరిగిందన్న సంతోషం లేకుండా పోయింది. -
ఇంటి నంబర్లు రావు.. రిజిస్ట్రేషన్లు కావు
[ 02-07-2024]
పంచాయతీ నుంచి పురపాలికగా ప్రకటించిన అనంతరం దస్త్రాల బదలాయింపు, డిజిటల్ కీ రాకపోవడంతో.. ఆసిఫాబాద్ పట్టణంలో పురపాలన నిలిచిపోయింది. -
తాగుడికి బానిసైన భర్త..
[ 02-07-2024]
రోజూ తాగొచ్చి గొడవ చేసే భర్తతో.. ఆ ఇల్లాలు, సంతానం అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో అతను హత్యాయత్నం చేసిన ఘటనలో నమోదైన కేసులో జైలుకు వెళ్లాడు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 02-07-2024]
జిల్లాలో నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎ.భాస్కర్ పేర్కొన్నారు. -
వందేభారత్ నిలపాలని రైల్వేబోర్డు ఛైర్పర్సన్కు వినతి
[ 02-07-2024]
హైదరాబాద్ నుంచి నాగ్పూర్కు వెళ్లే వందేభారత్ సూపర్ఫాస్ట్ రైలును మంచిర్యాలలో నిలపాలని కోరుతూ రైల్వే బోర్డు ఛైర్పర్సన్ జయవర్మసిన్హాకు భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు. -
పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు
[ 02-07-2024]
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జీఎస్టీలో ఉత్తమ పురస్కారం
[ 02-07-2024]
జీఎస్టీ దినోత్సవం పురస్కరించుకుని ఆలిండియా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 28 మంది జీఎస్టీ ఇన్స్పెక్టర్లను ఎంపిక చేశారు. -
అమల్లోకి కొత్త చట్టాలు
[ 02-07-2024]
భారత ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నేర, న్యాయ చట్టాలు-2023 సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. -
నకిలీ విత్తనాల కేసులో ముగిసిన పోలీసు కస్టడీ
[ 02-07-2024]
నకిలీ పత్తి విత్తనాల కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు నాలుగు రోజుల కిందట విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి తీసుకోగా గడువు పూర్తవ్వటంతో సోమవారం తిరిగి కోర్టులో ప్రవేశ పెట్టారు. -
ఏసీ గదులు వీడి గ్రామాల్లో తిరగండి
[ 02-07-2024]
‘అధికారులు కార్యాలయాల్లో ఏసీ గదుల్లో కూర్చునే బదులు గ్రామాలు తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రజాప్రతినిధులం మేం అయిదేళ్లు మాత్రమే ఉంటే.. మీరు జీవితకాలం వివిధ హోదాల్లో ప్రజల మధ్యనే ఉండి విధులు నిర్వహిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. అందుకే పిచ్పై ఉన్న మట్టిని తిన్నా: రోహిత్ శర్మ
-
‘రాహుల్ గాంధీలా ప్రవర్తించకండి’.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
-
హైదరాబాద్లో లైఫ్ ట్యాక్స్ సమస్యను పరిష్కరించండి.. లోకేశ్కు క్యాబ్ డ్రైవర్ల వినతి
-
అదానీ హిండెన్బర్గ్ వివాదంలో కొత్త మలుపు.. మధ్యలో కోటక్ బ్యాంకు ప్రస్తావన!
-
జిగాన గన్స్.. రూ.25 లక్షల కాంట్రాక్ట్..: కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
-
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్