గడువు ముగుస్తోంది.. పనులు ఇవ్వండి
జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘంనిధుల పనుల మంజూరు ఉత్తర్వులపై పంచాయితీ నెలకొంది.
అధికారులపై జడ్పీ, మండల పాలకవర్గాల ఒత్తిళ్లు
15వ ఆర్థిక సంఘం నిధులపై పంచాయితీ
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘంనిధుల పనుల మంజూరు ఉత్తర్వులపై పంచాయితీ నెలకొంది. ఈ పథకానికి సంబంధించి ఎంపిక చేసిన కొత్త పనుల మంజూరు ఉత్తర్వులు విడుదల చేయాలని సభ్యులు అధికారులపై ఒత్తిడి తెస్తుండటం, మరోపక్క ఇంతకుముందు చేపట్టిన పనులకే నిధుల విడుదల కాకపోవడంతో కొత్త ఉత్తర్వుల జారీకి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరో ఏడెనిమిది రోజుల్లో పదవీకాలం ముగుస్తుండటంతో ఇదేం పేచీ అంటూ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఏటా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. మురుగు కాలువలు, మరుగుదొడ్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ, పాఠశాలల్లో వసతుల కల్పన, ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు, పారిశుద్ధ్య పనులకు వీటిని కేటాయించాలనే మార్గదర్శకాలున్నాయి. జిల్లా పరిషత్కు వేరుగా, మండల పరిషత్లకు మండలాల వారీగా ఈ నిధులు కేటాయిస్తారు. జడ్పీకి కేటాయించే నిధులతో చేపట్టే పనులకు సంబంధించి జడ్పీ పాలకవర్గం నిర్ణయిస్తుంది. మండలాల్లో మండల పరిషత్ పాలకవర్గం పనులను మంజూరు చేస్తుంది.
కేటాయింపులతో సరి.. విడుదలలో జాప్యం
ఈ నిధులను రెండు విడతలుగా విడుదల చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల్లో ఒక విడతే విడుదల చేయడం సమస్యకు కారణంగా మారింది. ఈ పనులన్నీ రూ.5 లక్షల లోపే ఉండటంతో నామినేషన్ మీదనే చేపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనులు పూర్తయినా ఇంకా సగం నిధులు రాలేదు. వీటికోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిధుల కేటాయింపులు వచ్చాయి. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు తమ పదవీకాలం ముగుస్తుండటంతో హడావుడిగా కొత్తగా మళ్లీ పనులను ఎంపిక చేశారు. గ్రామాల్లో తామే పనులు చేశామని చెప్పుకోవచ్చని సంబరపడ్డారు. జడ్పీలో జడ్పీపాలకవర్గం, మండలాల్లో మండల పాలకవర్గాలు పనుల జాబితాను అందించినా వీటిని చేపట్టేందుకు ఉత్తర్వుల జారీ(వర్క్ శాంక్షన్ ప్రొసీడింగ్ ఆర్డర్) ఇచ్చేందుకు అధికారులు అభ్యంతరం తెలుపుతూ ససేమిరా అంటుండటంతో ప్రజాప్రతినిధుల్లో అయోమయం నెలకొంది.
చిక్కులు వస్తాయని అధికారుల వెనుకంజ
ఈ ఆర్థిక సంవత్సరం ఇచ్చిన కేటాయింపుల్లో కనీసం సగం నిధులు విడుదలైనా ప్రొసీడింగ్ జారీ చేసేవారమని, గత ఆర్థిక సంవత్సర కేటాయింపుల్లోనే సగం నిధులు రావాల్సి ఉండటంతో కొత్తవాటికి ఎలా వర్క్ ఆర్డర్ ఇస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ వర్క్ ఆర్డర్ ఇస్తే పని పూర్తి చేసిన వ్యక్తులు బిల్లు ఆలస్యమైతే న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉందని, ఇది తమ మెడకే చుట్టుకుంటుందని అధికారులు వాపోతున్నారు. రెండు మూడు మండలాల్లో మాత్రం ఈ కొత్త పనులు ప్రొసీడింగ్ జారీ కావడంతో ఇతర మండలాల్లో, జడ్పీలో సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. జులై 3న ఎంపీటీసీలు, 4న జడ్పీటీసీల పదవీకాలం ముగియనుండటంతో అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాప్రతినిధులు యత్నిస్తున్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు అధికారులు బలవంతపు సెలవుపై వెళ్లేందుకు యత్నిస్తుండటం గమనార్హం.
పాత నిధులు రాలేదు..
రత్నమాల, జడ్పీ సీఈఓ
ఈ ఆర్థిక సంవత్సర కేటాయింపులకు సంబంధించి జడ్పీ పాలకవర్గం పనులను ఎంపిక చేసింది. గత ఆర్థిక సంవత్సరం పనులు పూర్తయినా సగం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. అందుకే చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కొత్త పనుల మంజూరు ఉత్తర్వులు విడుదల చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు
[ 30-06-2024]
సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. -
బస్సు ప్రమాదంలోనే గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
[ 30-06-2024]
ఆదిలాబాద్ ఆర్టీసి బస్ స్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి ఘటనను పోలీసులు ఛేదించారు. -
‘గుట్టుగా దుకాణాల వేలం’పై అభ్యంతరం
[ 30-06-2024]
బల్దియాలో పారదర్శకతకు పాతరేసి గుట్టుగా సాగిన అద్దె దుకాణాల వేలంపాటపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’లో ‘గుట్టుగా అద్దె దుకాణాల వేలం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది. -
రమేష్ రాఠోడ్ మృతితో విషాదం
[ 30-06-2024]
మెండైన గుండె ధైర్యం. ఆప్యాయంగా పలకరించే నైజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యే తాపత్రయం. అవసరాన్ని బట్టి తోచిన సాయం చేయాలనే మానవత్వం. భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ (57) సొంతం. -
వేలిముద్ర వేయకున్నా.. రూ.1.40 లక్షలు మాయం!
[ 30-06-2024]
మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళా రైతు నిరక్షరాస్యురాలు. సీఎస్సీ (కస్టమర్ సర్వీస్ సెంటర్)లలో వేలిముద్ర వేసి తన ఖాతా నుంచి అవసరమైన డబ్బులు తీసుకునేవారు. -
సంప్రదాయ ఆటలో మెరికలు
[ 30-06-2024]
కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. -
అవినీతిలో ఘనుడు
[ 30-06-2024]
పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్లు, ఢైరీఫామ్లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య. -
పట్టాలున్నా.. రుణం రావట్లే!
[ 30-06-2024]
అటవీ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు ప్రభుత్వం హక్కు పత్రాలిచ్చినా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పంటల సీజన్ మొదలై నెల కావాస్తోంది. ఇటు పెట్టుబడి సాయం అందక అటు బ్యాంకులు అప్పులు ఇవ్వక పోడుదారులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు.. కలగాలి కనువిప్పు!
[ 30-06-2024]
కాగజ్నగర్ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. -
వెన్నుపూసలు కదులుతున్నాయ్!
[ 30-06-2024]
జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. -
బడిబాట @ 2819 ప్రవేశాలు
[ 30-06-2024]
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రసాదాలపై పర్యవేక్షణ శూన్యం
[ 30-06-2024]
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇది కదా అసలైన గురుదక్షిణ’.. టీమ్ఇండియా విజయంపై ఆనంద్ మహీంద్రా
-
చనిపోయాక ‘గేట్స్’కు విరాళాలు ఉండవు - వారెన్ బఫెట్
-
స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించిన కేంద్రం
-
వినతుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా
-
ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్లో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే..
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు