గతుకుల గండం తీరేనా?
కోటపల్లి మండలంలో గతేడాది కురిసిన వర్షాలకు పారుపెల్లి-వెంచపల్లి గ్రామాలమధ్య ఆర్అండ్బీ రహదారి వరద నీటితో కోతకు గురైంది. అప్పుడు దాదాపు 100 మీటర్ల పొడవునా బీటీ కొట్టుకుపోవడంతో అధికారులు తాత్కాలికంగా మట్టి పోసి రాకపోకలు పునరుద్ధరించారు.
రహదారుల మరమ్మతులకు అధికారుల ప్రణాళిక
మంచిర్యాల పట్టణం, న్యూస్టుడే
కోటపల్లి మండలంలో గతేడాది కురిసిన వర్షాలకు పారుపెల్లి-వెంచపల్లి గ్రామాలమధ్య ఆర్అండ్బీ రహదారి వరద నీటితో కోతకు గురైంది. అప్పుడు దాదాపు 100 మీటర్ల పొడవునా బీటీ కొట్టుకుపోవడంతో అధికారులు తాత్కాలికంగా మట్టి పోసి రాకపోకలు పునరుద్ధరించారు. ఇప్పుడు మళ్లీ వర్షం పడితే ఆ రహదారి కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. అక్కడ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.
చెన్నూరు నుంచి వేమనపల్లి మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిలోని మల్లంపేట-నీల్వాయి మధ్యలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పొడవునా ఆర్అండ్బీ రహదారి గుంతలు పడి ప్రమాదకరంగా ఉంది. అక్కడ వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ రహదారి నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు లేవని మరమ్మతులు చేయనివ్వడం లేదు. ప్రమాదకరంగా ఉన్న ఆ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
మందమర్రి మార్కెట్ నుంచి పాలచెట్టు వరకు రహదారిపై గుంతలు పడి ప్రమాదకరంగా ఉంది. ఆ రహదారి పక్కన గతంలో మిషన్ భగీరథ, సింగరేణి పైప్లైన్ల కోసం తవ్వకాలు చేయడంతో గుంతలు మరింత పెరిగాయి. రహదారిపై వాహనదారులు రాత్రి సమయంలో అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. అక్కడ కిలోమీటరు పొడవునా మధ్య మధ్యలో రహదారికి మరమ్మతులు చేయాల్సి ఉంది.
వర్షాలు ముమ్మరం అయ్యేలోగా గుంతలు పడిన రహదారులకు మరమ్మతులు చేయడానికి రోడ్లు భవనాలశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి నిధుల మంజూరుకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రహదారులు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పడిన రహదారులకు శాశ్వత మరమ్మతులు చేయడానికి సర్వే చేసి అంచనాలు తయారు చేయించారు.
మంచిర్యాల జిల్లా సర్కిల్ పరిధిలో 635 కిలోమీటర్ల పొడవునా ఆర్అండ్బీ రహదారులు ఉండగా అందులో 210 కిలోమీటర్లు గుంతలు పడిన రహదారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటికి శాశ్వత మరమ్మతులు చేయడానికి రూ.85 కోట్ల నిధుల మంజూరుకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆ నిధులు మంజూరు చేయగానే ప్రమాదకరంగా ఉన్న ఆర్అండ్బీ రహదారులు బాగు చేయనున్నారు. మరో 80 కిలోమీటర్ల పొడవునా రహదారులు అటవీశాఖ అనుమతులు లేక ఆగిపోయాయి. అవి కూడా గుంతలు పడి ప్రమాదకరంగా ఉన్నాయి.
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లోని ప్రధాన, అంతర్గత ఆర్అండ్బీ రహదారులపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు శాపంగా మారాయి. ఆ గుంతల రహదారులపై నుంచి వాహనాలు వెళ్లినప్పుడు అదుపుతప్పి అనేక మంది ప్రమాదాలకు గురయ్యారు. జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, భీమారం, జైపూర్ మందమర్రి మండలాల్లో గుంతలు పడిన రహదారులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడక్కడా వంతెనలపై కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. మళ్లీ వర్షాలు ముమ్మరం అయితే ఆ రహదారులపై గుంతలు పెద్దగా అయి ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నివేదిక పంపించాం
నర్సింహచారి, ఆర్అండ్బీ, ఈఈ, మంచిర్యాల సర్కిల్
ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశం ప్రకారం జిల్లాలో రహదారుల మరమ్మతుల కోసం సర్వే చేసి ఆర్అండ్బీ శాఖకు నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకాగానే రహదారులకు శాశ్వత మరమ్మతులు చేయిస్తాం. మరికొన్ని గ్రామాల్లో అటవీశాఖ అనుమతులు లేవని రహదారులపై మరమ్మతులు కూడా చేయనివ్వడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గుట్టుగా దుకాణాల వేలం’పై అభ్యంతరం
[ 30-06-2024]
బల్దియాలో పారదర్శకతకు పాతరేసి గుట్టుగా సాగిన అద్దె దుకాణాల వేలంపాటపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’లో ‘గుట్టుగా అద్దె దుకాణాల వేలం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది. -
రమేష్ రాఠోడ్ మృతితో విషాదం
[ 30-06-2024]
మెండైన గుండె ధైర్యం. ఆప్యాయంగా పలకరించే నైజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యే తాపత్రయం. అవసరాన్ని బట్టి తోచిన సాయం చేయాలనే మానవత్వం. భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ (57) సొంతం. -
వేలిముద్ర వేయకున్నా.. రూ.1.40 లక్షలు మాయం!
[ 30-06-2024]
మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళా రైతు నిరక్షరాస్యురాలు. సీఎస్సీ (కస్టమర్ సర్వీస్ సెంటర్)లలో వేలిముద్ర వేసి తన ఖాతా నుంచి అవసరమైన డబ్బులు తీసుకునేవారు. -
సంప్రదాయ ఆటలో మెరికలు
[ 30-06-2024]
కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. -
అవినీతిలో ఘనుడు
[ 30-06-2024]
పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్లు, ఢైరీఫామ్లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య. -
పట్టాలున్నా.. రుణం రావట్లే!
[ 30-06-2024]
అటవీ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు ప్రభుత్వం హక్కు పత్రాలిచ్చినా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పంటల సీజన్ మొదలై నెల కావాస్తోంది. ఇటు పెట్టుబడి సాయం అందక అటు బ్యాంకులు అప్పులు ఇవ్వక పోడుదారులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు.. కలగాలి కనువిప్పు!
[ 30-06-2024]
కాగజ్నగర్ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. -
వెన్నుపూసలు కదులుతున్నాయ్!
[ 30-06-2024]
జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. -
బడిబాట @ 2819 ప్రవేశాలు
[ 30-06-2024]
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రసాదాలపై పర్యవేక్షణ శూన్యం
[ 30-06-2024]
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు.