అక్రమ నిర్మాణాలు.. అడ్డుకోని అధికారులు
టీచర్స్ కాలనీ వద్ద ఉన్న ఈ రోడ్డు పక్కన ఓ అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతోంది. పురపాలిక ఆధ్వర్యంలో నిర్మాణానికి ఓ వైపు సీసీరోడ్డు, ఇరువైపులా కాలువ నిర్మాణం చేపట్టారు. అధికారులు ఈ రోడ్డు వెడల్పు 25 ఫీట్లు అని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు.
రామకృష్ణాపూర్, న్యూస్టుడే
టీచర్స్ కాలనీ వద్ద ఉన్న ఈ రోడ్డు పక్కన ఓ అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతోంది. పురపాలిక ఆధ్వర్యంలో నిర్మాణానికి ఓ వైపు సీసీరోడ్డు, ఇరువైపులా కాలువ నిర్మాణం చేపట్టారు. అధికారులు ఈ రోడ్డు వెడల్పు 25 ఫీట్లు అని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు.
ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ భవనం సెల్లార్ నిర్మాణానికి సంబంధించి అనుమతులు లేవని అధికారులే చెబుతున్నప్పటికీ జీ ప్లస్ 2 వరకు భవన నిర్మాణం చేపట్టారు.
పట్టణంలోని గద్దెరాగడి ప్రధాన రహదారికి సమీపంలో ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఎలాంటి అనుమతులు లేకుండా జీ ప్లస్ 2 భవన నిర్మాణం చేపట్టారు. స్లాబ్ నిర్మాణ పనులు జరుగుతున్నంత వరకూ అధికారులు అటువైపు కన్నెత్తి సైతం చూడలేదు. అనంతరం పనులు నిలిపివేయించారు.
అమ్మా గార్డెన్ చౌరస్తాలో ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి సెల్లార్ నిర్మాణానికి అనుమతులు లేకున్నా చకచకా పనులు చేపడుతున్నారు. అయినా అధికారులకు అటువైపు చూడటం లేదు.
క్యాతనపల్లి పుర పరిధిలో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇళ్లు, దుకాణాల భవనాల నిర్మాణంలో యజమానులు నిబంధనలు పాటించడం లేదు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.
మేజర్ గ్రామ పంచాయతీ అయిన క్యాతనపల్లిని 2018లో పురపాలికగా ఉన్నతీకరించారు. సమీపంలో ఉన్న తిమ్మాపూర్ గ్రామాన్ని ఇందులో విలీనం చేశారు. పురపాలిక కావడంతో క్యాతనపల్లి, గద్దెరాగడి, తిమ్మాపూర్, అమ్మా గార్డెన్స్ ఏరియాల్లోని భూములకు డిమాండ్ పెరిగి కొత్త ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు ఇక్కడ కేవలం జీ ప్లస్ 2కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అయిదు అంతస్తుల భవనం నిర్మించాలంటే వరంగల్లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ అనుమతులు ఒక రకంగా తీసుకుని మరో రకంగా నిర్మాణాలు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఒకరిద్దరు మామూళ్లు తీసుకుంటూ ఇలా అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కనిపించని సెట్బ్యాక్
కొన్ని నిర్మాణాలకు సెట్బ్యాక్ ఉండడం లేదు. రోడ్లపైనే ర్యాంపులు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు అడపాదడపా చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. దీంతో వెడల్పుగా ఉండాల్సిన రోడ్లు కాస్త ఇరుకుదారులుగా మారుతున్నాయి. 30 అడుగులమేర రహదారులు ఉన్న ఫ్లాట్లకే అనుమతులివ్వాలి. కానీ రికార్డుల్లో 30 అడుగులుగా చూపిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో 15 నుంచి 20 అడుగుల వరకే రోడ్లు ఉంటున్నాయి.
చర్యలు తీసుకుంటాం
- రాజ్కుమార్, టీపీఓ, క్యాతనపల్లి పురపాలిక
క్యాతనపల్లి పుర పరిధిలో అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు అందజేస్తున్నాం. 6 గుంటల స్థలంలో జరిపే నిర్మాణాలకు మాత్రమే సెల్లార్ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గుట్టుగా దుకాణాల వేలం’పై అభ్యంతరం
[ 30-06-2024]
బల్దియాలో పారదర్శకతకు పాతరేసి గుట్టుగా సాగిన అద్దె దుకాణాల వేలంపాటపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’లో ‘గుట్టుగా అద్దె దుకాణాల వేలం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది. -
రమేష్ రాఠోడ్ మృతితో విషాదం
[ 30-06-2024]
మెండైన గుండె ధైర్యం. ఆప్యాయంగా పలకరించే నైజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యే తాపత్రయం. అవసరాన్ని బట్టి తోచిన సాయం చేయాలనే మానవత్వం. భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ (57) సొంతం. -
వేలిముద్ర వేయకున్నా.. రూ.1.40 లక్షలు మాయం!
[ 30-06-2024]
మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళా రైతు నిరక్షరాస్యురాలు. సీఎస్సీ (కస్టమర్ సర్వీస్ సెంటర్)లలో వేలిముద్ర వేసి తన ఖాతా నుంచి అవసరమైన డబ్బులు తీసుకునేవారు. -
సంప్రదాయ ఆటలో మెరికలు
[ 30-06-2024]
కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. -
అవినీతిలో ఘనుడు
[ 30-06-2024]
పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్లు, ఢైరీఫామ్లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య. -
పట్టాలున్నా.. రుణం రావట్లే!
[ 30-06-2024]
అటవీ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు ప్రభుత్వం హక్కు పత్రాలిచ్చినా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పంటల సీజన్ మొదలై నెల కావాస్తోంది. ఇటు పెట్టుబడి సాయం అందక అటు బ్యాంకులు అప్పులు ఇవ్వక పోడుదారులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు.. కలగాలి కనువిప్పు!
[ 30-06-2024]
కాగజ్నగర్ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. -
వెన్నుపూసలు కదులుతున్నాయ్!
[ 30-06-2024]
జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. -
బడిబాట @ 2819 ప్రవేశాలు
[ 30-06-2024]
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రసాదాలపై పర్యవేక్షణ శూన్యం
[ 30-06-2024]
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు.