లెక్క తేలుతున్న చిక్కులు
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటా శుద్ధనీరు అందించడానికి చేపట్టిన పైప్లైన్ పనులు, కుళాయి కనెక్షన్లు అధ్వానంగా ఉన్నాయి. చాలా గ్రామాల్లోని ఇళ్లల్లో కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు.
కొనసాగుతున్న మిషన్ భగీరథ పథకం సర్వే
నిర్మల్, న్యూస్టుడే
వివరాల నమోదును పరిశీలిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటా శుద్ధనీరు అందించడానికి చేపట్టిన పైప్లైన్ పనులు, కుళాయి కనెక్షన్లు అధ్వానంగా ఉన్నాయి. చాలా గ్రామాల్లోని ఇళ్లల్లో కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. పైప్లైన్ల మరమ్మతులు, లింకేజీ, తదితర పనులు అసంపూర్తిగానే ఉన్నట్లు అధికారులు చేపడుతున్న సర్వేలో వెల్లడవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపించడంతోపాటు తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించడం, పైప్లైన్ మరమ్మతులు, ఇతరత్రా పనులు చేపట్టడానికి కేంద్ర జలశక్తి శాఖ ద్వారా నిధులు సమీకరించడానికి ఇంటింటా సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు జిల్లాలోని 18 గ్రామీణ మండలాల్లోని 396 పంచాయతీల్లో 90 శాతం సర్వే పూర్తిచేశారు.
పెరగనున్న కుళాయి కనెక్షన్లు
జిల్లాలో 396 పంచాయతీల్లోని 701 ఆవాసాల్లో 1,48,605 ఇళ్లకు మిషన్ భగీరథ పథకం కింద శుద్ధనీరు సరఫరా అవుతున్నట్లు అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి వ్యక్తికి రోజుకు వంద లీటర్ల చొప్పున శుద్ధనీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో పథకం అమలు తీరు సరిగా లేదని, సరిపడా నీరు రావడం లేదని, లీకేజీలతో మురుగు నీరు వస్తోందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు ఇచ్చిన కనెక్షన్ల వివరాలకు, క్షేత్రస్థాయిలో సర్వేలో వెలుగుచూస్తున్న కనెక్షన్ల సంఖ్యకు పొంతన లేదని అధికారులు గుర్తించారు. ఉదాహరణకు జిల్లాలోని పెంబి మండలంలో మిషన్ భగీరథ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం 3,876 ఇళ్లల్లో కుళాయి కనెక్షన్లు ఉండగా.. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న సిబ్బంది 4,199 కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ సర్వే పూర్తికావడంతో 108 శాతం ఇళ్లలో కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు వెల్లడైంది. అంతటా సర్వే పూర్తయితే అన్ని మండలాల్లోనూ కుళాయి సంఖ్య పెరిగే అవకాశం ఉందని జిల్లా పంచాయతీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఎలా చేస్తున్నారంటే..
జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు, ఐకేపీ సీసీలు, ఇతరశాఖల అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ఎప్పటికప్పుడు జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో ఇంటికి వెళ్లి మిషన్ భగీరథ నీరు అందుతుందా..? నల్లా కనెక్షన్ ఉందా..? అది పనిచేస్తుందా..? పైపుల ద్వారా నీరు వస్తోందా..? ఎన్ని రోజులకోసారి వస్తోంది..? లబ్ధిదారు పేరు, చిరునామా, భార్య/భర్త, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, చరవాణి నెంబరు, ఆధార్కార్డు సంఖ్య, ఇంటి నెంబరు, కులం, ఇతర వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుతో కలిపి ఇంటి ఫొటో, నల్లా ఫొటోను తీసుకొని అప్లోడ్ చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీరు వస్తోందా లేక స్థానికంగా ఉన్న బోర్లు, చెరువులు, తదితర వనరుల ద్వారా వస్తుందా అనే వివరాలు తెలుసుకుని నమోదు చేస్తున్నారు. గ్రామాల వారీగా సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రోడీకరించి మండల కేంద్రాలకు, అక్కడి నుంచి మండలాల వారీగా పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తున్నారు.
నాలుగైదు రోజుల్లో పూర్తి చేయిస్తాం
-శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి, నిర్మల్
జిల్లాలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే 90 శాతం పూర్తి చేయించాం. మిషన్ భగీరథ అధికారులు ఇచ్చిన సర్వేలో కొత్తగా ఇళ్లు నిర్మించుకుని కుళాయి కనెక్షన్లు తీసుకున్న వారి సంఖ్య నమోదు చేయలేదు. ఇప్పుడు అవన్నీ సర్వే చేస్తుండటంతో అదనంగా మరో 30 వేల కుళాయి కనెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఈ పథకానికి సంబంధించి సర్వే నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తిచేయించి సమగ్ర వివరాల నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుట్కా విక్రయదారులపై కేసు
[ 30-06-2024]
నిషేధించిన గుట్కాను తరలిస్తున్న ముగ్గురిని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
[ 30-06-2024]
ఆదిలాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి లభించిన గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్ధానిక రిమ్స్ మార్చురీలో భద్రపరిచినట్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ తెలిపారు. -
సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు
[ 30-06-2024]
సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. -
బస్సు ప్రమాదంలోనే గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
[ 30-06-2024]
ఆదిలాబాద్ ఆర్టీసి బస్ స్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి ఘటనను పోలీసులు ఛేదించారు. -
‘గుట్టుగా దుకాణాల వేలం’పై అభ్యంతరం
[ 30-06-2024]
బల్దియాలో పారదర్శకతకు పాతరేసి గుట్టుగా సాగిన అద్దె దుకాణాల వేలంపాటపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’లో ‘గుట్టుగా అద్దె దుకాణాల వేలం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది. -
రమేష్ రాఠోడ్ మృతితో విషాదం
[ 30-06-2024]
మెండైన గుండె ధైర్యం. ఆప్యాయంగా పలకరించే నైజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యే తాపత్రయం. అవసరాన్ని బట్టి తోచిన సాయం చేయాలనే మానవత్వం. భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ (57) సొంతం. -
వేలిముద్ర వేయకున్నా.. రూ.1.40 లక్షలు మాయం!
[ 30-06-2024]
మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళా రైతు నిరక్షరాస్యురాలు. సీఎస్సీ (కస్టమర్ సర్వీస్ సెంటర్)లలో వేలిముద్ర వేసి తన ఖాతా నుంచి అవసరమైన డబ్బులు తీసుకునేవారు. -
సంప్రదాయ ఆటలో మెరికలు
[ 30-06-2024]
కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. -
అవినీతిలో ఘనుడు
[ 30-06-2024]
పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్లు, ఢైరీఫామ్లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య. -
పట్టాలున్నా.. రుణం రావట్లే!
[ 30-06-2024]
అటవీ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు ప్రభుత్వం హక్కు పత్రాలిచ్చినా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పంటల సీజన్ మొదలై నెల కావాస్తోంది. ఇటు పెట్టుబడి సాయం అందక అటు బ్యాంకులు అప్పులు ఇవ్వక పోడుదారులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు.. కలగాలి కనువిప్పు!
[ 30-06-2024]
కాగజ్నగర్ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. -
వెన్నుపూసలు కదులుతున్నాయ్!
[ 30-06-2024]
జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. -
బడిబాట @ 2819 ప్రవేశాలు
[ 30-06-2024]
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రసాదాలపై పర్యవేక్షణ శూన్యం
[ 30-06-2024]
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నా: చంద్రబాబు
-
స్టాక్స్.. టీ20 కప్ విజయం మధ్య సారూప్యతేంటి?.. వివరించిన సెహ్వాగ్!
-
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా..! వారంలోనే 800 బాంబులతో విధ్వంసం
-
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
-
వరలక్ష్మీ శరత్కుమార్ పెళ్లి సందడి మొదలైంది.. ఫొటో చూశారా!
-
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు.. ‘హిందూ’ ఓట్లపై పార్టీల కన్ను!