బిల్లులు రాక.. అవస్థలు
జిల్లాలో గత ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి ప్రారంభించింది. ఏళ్లు గడుస్తున్నా అవి పూర్తి కాలేదు. పలు చోట్ల ప్రారంభించి మధ్యలోనే వదిలేయగా, కొన్ని చోట్ల ప్రారంభించలేదు.
న్యూస్టుడే, బోథ్, తలమడుగు
జిల్లాలో గత ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి ప్రారంభించింది. ఏళ్లు గడుస్తున్నా అవి పూర్తి కాలేదు. పలు చోట్ల ప్రారంభించి మధ్యలోనే వదిలేయగా, కొన్ని చోట్ల ప్రారంభించలేదు. కొన్ని చోట్ల చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగక గుత్తేదారులు మధ్యలోనే ఆపివేయటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వానాకాలంలో సేవలు గగనమే..
బోథ్ మండల కేంద్రంలోని సీహెచ్సీ బోథ్తో పాటు బజార్హత్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ మండలాల ప్రజలకు సేవలందిస్తుంది. సీహెచ్సీకి గత ప్రభుత్వం రూ.10.50 కోట్లు మంజూరు చేసి 100 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సంబంధిత శాఖ టెండరు ప్రక్రియ నిర్వహించి, పనులను ప్రారంభించింది. దాదాపు రూ.3.30 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. సదరు గుత్తేదారు ఆరు నెలల కిందట పనులను మధ్యలోనే ఆపివేశారు. సీహెచ్సీ నూతన భవనం కేవలం పిల్లర్లు, స్లాబు దశలోనే నిలిచిపోయింది. పాత భవనాన్ని పాక్షికంగా కూల్చేసి, కొన్ని గదుల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. రోగులకు వైద్య సేవలు అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రతి రోజు దాదాపుగా 300 మంది రోగులు ఈ ఆసుపత్రికి వస్తుంటారు.
కలగానే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం
కౌఠలో మధ్యలో ఆగిపోయిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు
బోథ్ మండలం కౌఠలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల సముదాయమిది. 2019లో ప్రభుత్వం గ్రామానికి చెందిన 18మంది లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేసింది. గుత్తేదారు పనులను ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తికాని పరిస్థితి నెలకొంది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో సంబంధిత గుత్తేదారు పనులను మధ్యలోనే ఆపేశాడు. పనులు మంజూరైన కొన్ని సంవత్సరాలకు ప్రారంభించగా, తొలుత పిల్లర్లను వేసి ఉంచారు. మళ్లీ కొన్ని సంవత్సరాలకు స్లాబు వేసి విడిచిపెట్టారు. అనంతరం గోడలను నిర్మించి విడిచిపెట్టాడు. ఇదే మండలంలోని బాబెర తండా గ్రామంలో కేవలం పిల్లర్ల దశలోనే పనులను ఆపివేశారు.
ప్రయాణం నరకం..
తలమడుగు మండలం డోర్లి నుంచి కప్పర్దేవి గ్రామం వరకు భారాస ప్రభుత్వ హయాంలో 3.75 కిలోమీటర్ల దూరానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించినా అడుగు ముందుకు పడటం లేదు. కొంత మేర పనులు చేపట్టినా బిల్లులు రాక గుత్తేదారు పనులను అర్ధాంతరంగా ఆపేశాడు. పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై కంకర తేలి రాత్రి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నిధులు మంజూరు చేసి పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గుట్టుగా దుకాణాల వేలం’పై అభ్యంతరం
[ 30-06-2024]
బల్దియాలో పారదర్శకతకు పాతరేసి గుట్టుగా సాగిన అద్దె దుకాణాల వేలంపాటపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’లో ‘గుట్టుగా అద్దె దుకాణాల వేలం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది. -
రమేష్ రాఠోడ్ మృతితో విషాదం
[ 30-06-2024]
మెండైన గుండె ధైర్యం. ఆప్యాయంగా పలకరించే నైజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యే తాపత్రయం. అవసరాన్ని బట్టి తోచిన సాయం చేయాలనే మానవత్వం. భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ (57) సొంతం. -
వేలిముద్ర వేయకున్నా.. రూ.1.40 లక్షలు మాయం!
[ 30-06-2024]
మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళా రైతు నిరక్షరాస్యురాలు. సీఎస్సీ (కస్టమర్ సర్వీస్ సెంటర్)లలో వేలిముద్ర వేసి తన ఖాతా నుంచి అవసరమైన డబ్బులు తీసుకునేవారు. -
సంప్రదాయ ఆటలో మెరికలు
[ 30-06-2024]
కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. -
అవినీతిలో ఘనుడు
[ 30-06-2024]
పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్లు, ఢైరీఫామ్లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య. -
పట్టాలున్నా.. రుణం రావట్లే!
[ 30-06-2024]
అటవీ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు ప్రభుత్వం హక్కు పత్రాలిచ్చినా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పంటల సీజన్ మొదలై నెల కావాస్తోంది. ఇటు పెట్టుబడి సాయం అందక అటు బ్యాంకులు అప్పులు ఇవ్వక పోడుదారులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు.. కలగాలి కనువిప్పు!
[ 30-06-2024]
కాగజ్నగర్ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. -
వెన్నుపూసలు కదులుతున్నాయ్!
[ 30-06-2024]
జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. -
బడిబాట @ 2819 ప్రవేశాలు
[ 30-06-2024]
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రసాదాలపై పర్యవేక్షణ శూన్యం
[ 30-06-2024]
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు.