ఆరోగ్యానికి మేలు.. అతివలకు ఆదాయ వనరు!
గిరిజనులు పూజించే ఇప్పచెట్టు.. నేడు వారికి ఎన్నోరకాలుగా ఉపాధి చూపుతోంది. ఇప్పనూనె, లడ్డూలు, హల్వా, కేక్లను సైతం ఇప్పపూలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల సభ్యులు తయారు చేస్తున్నారు.
ఇప్పపరక నూనె తయారీలో మహిళలు..
ఈనాడు, ఆసిఫాబాద్
కానుగ యంత్రాలతో నూనె తయారీ
గిరిజనులు పూజించే ఇప్పచెట్టు.. నేడు వారికి ఎన్నోరకాలుగా ఉపాధి చూపుతోంది. ఇప్పనూనె, లడ్డూలు, హల్వా, కేక్లను సైతం ఇప్పపూలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల సభ్యులు తయారు చేస్తున్నారు. సిర్పూర్(యు) మండల కేంద్రంలోని అతివలు ఇప్పపరకతో నూనె తీసి, సీసాల్లో ప్యాక్ చేసి, ఫ్లిప్కార్ట్(ఆన్లైన్ ప్లాట్ఫాం)తోపాటు, బయట దుకాణాల్లో విరివిగా విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. బయట లభించే నూనెలతో పోలిస్తే ఇప్పపరకతో చేసిన నూనె ఎన్నో పోషక విలువలు కలిగి ఉండడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. పూజకు వినియోగించే నూనెను సైతం వీరు తయారు చేస్తున్నారు.
కుమురంభీం జిల్లా సిర్పూర్(యు) మండలంలోని నెట్నూర్ పంచాయతీ పరిధి చల్కగూడ గ్రామానికి చెందిన అయిదుగురు మహిళలు.. మడావి తులసీబాయి, అర్క పూర్ణిమ, ఆడ లక్ష్మి, అర్క సమతాబాయి, జంగుబాయి బృందంగా ఏర్పడ్డారు. వీరికి మండల సమాఖ్య అధ్యక్షురాలు మడావి విజయ పూర్తి సహకారం అందించారు. ఇప్పపరకతో నూనె తయారు చేస్తామనే వీరి సూచనలతో అప్పటి ఐటీడీఏ పీఓ చాహత్ బాజ్పాయ్ రూ.18 లక్షలు మంజూరు చేయగా.. స్థానిక బ్యాంకు రూ.12 లక్షలు రుణంగా ఇచ్చింది. రూ.30 లక్షలతో ఏడాది కిందట కట్టెగానుక యంత్రాలను సిర్పూర్(యు) మండలంలోని ఐకేపీ ప్రత్యేక గదుల్లో ఏర్పాటు చేశారు.
ఇప్పపరక
‘గిరి’ జీవితాలతో ముడిపడిన ఇప్పపరక
ఆదివాసీలు చేసే ప్రతి పండగలో ఇప్పపరకతో చేసిన నూనెలనే వాడుతారు. ఈ పరిశ్రమ స్థాపించక ముందు గిరిజనులు ఇళ్లల్లో తయారు చేసుకునే వారు. విత్తనాలు పెట్టడం, పంట తీయడం, దీపావళి, ఇతర శుభ కార్యాలయాలకు, వారి పవిత్ర దేవతలు కొలువైన చోట చేసే పండగలకు తప్పనిసరిగా ఈ నూనె వాడుతారు. ఇప్పపరకను వేసవిలో సేకరించి, నిల్వ చేసి ఉంచుకుంటారు.
గిరిజనులు ఏటా ఇప్పపువ్వులతోపాటు వీటి తర్వాత కాసే కాయను సేకరిస్తారు. కాయలను ఎండబెట్టి గింజలను వేరుచేస్తారు. నూనె తయారీదారులు వివిధ ప్రాంతాల నుంచి గిరిజనుల నుంచి కిలోకు రూ.30 చెల్లించి తీసుకుంటున్నారు. ఇప్పపరకను కానుగ (యంత్రం)లో వేసి నూనె తీస్తున్నారు. భీమ్ నేచురల్స్ పేరుతో లేబుల్ తయారు చేసి, పావు, అరకిలో, కిలో చొప్పున సీసాల్లో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. కిలో నూనెను సంఘ సభ్యులకు రూ.120 అందుబాటులో ఉంచుతున్నారు. పది కిలోల ఇప్పపరక నుంచి నాలుగు కిలోల నూనె తయారు చేస్తున్నారు. ఇదే నూనెను ఫ్లిప్కార్టులో సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఇతర ఆన్లైన్ కేంద్రాల్లో 200 ఎం.ఎల్ ఇప్పపరక నూనె ధర రూ.500 ఉండగా, మహిళా సమాఖ్య తయారు చేసిన నూనె రూ.250లకే 200 ఎం.ఎల్ నూనె ఇస్తున్నారు.
తయారు చేసిన నూనె
ఇతర నూనెలు సైతం..
మడావి వనజ (మండల సమాఖ్య అధ్యక్షురాలు)
ఇప్పపరకనే కాకుండా, నువ్వులు, కుడకలు, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలతో నూనెలను తీస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరైనా వీటిని తీసుకుని వచ్చినా కిలోకు రూ.30 తీసుకుంటూ పట్టిస్తున్నారు. పండగల సమయంలో వీరికి ఎక్కువగా గిట్టుబాటు అవుతోంది. సాధారణ సమయాల్లో సైతం ప్రతి అయిదుగురు సభ్యులకు ఖర్చులన్నీ పోను రూ.15 వేల వరకు నెలకు ఆదాయం సమకూరుతుందని సమాఖ్య అధ్యక్షురాలు మడావి వనజ, ఏపీఎం వెంకట్రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గుట్టుగా దుకాణాల వేలం’పై అభ్యంతరం
[ 30-06-2024]
బల్దియాలో పారదర్శకతకు పాతరేసి గుట్టుగా సాగిన అద్దె దుకాణాల వేలంపాటపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’లో ‘గుట్టుగా అద్దె దుకాణాల వేలం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది. -
రమేష్ రాఠోడ్ మృతితో విషాదం
[ 30-06-2024]
మెండైన గుండె ధైర్యం. ఆప్యాయంగా పలకరించే నైజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యే తాపత్రయం. అవసరాన్ని బట్టి తోచిన సాయం చేయాలనే మానవత్వం. భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ (57) సొంతం. -
వేలిముద్ర వేయకున్నా.. రూ.1.40 లక్షలు మాయం!
[ 30-06-2024]
మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళా రైతు నిరక్షరాస్యురాలు. సీఎస్సీ (కస్టమర్ సర్వీస్ సెంటర్)లలో వేలిముద్ర వేసి తన ఖాతా నుంచి అవసరమైన డబ్బులు తీసుకునేవారు. -
సంప్రదాయ ఆటలో మెరికలు
[ 30-06-2024]
కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. -
అవినీతిలో ఘనుడు
[ 30-06-2024]
పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్లు, ఢైరీఫామ్లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య. -
పట్టాలున్నా.. రుణం రావట్లే!
[ 30-06-2024]
అటవీ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు ప్రభుత్వం హక్కు పత్రాలిచ్చినా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పంటల సీజన్ మొదలై నెల కావాస్తోంది. ఇటు పెట్టుబడి సాయం అందక అటు బ్యాంకులు అప్పులు ఇవ్వక పోడుదారులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు.. కలగాలి కనువిప్పు!
[ 30-06-2024]
కాగజ్నగర్ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. -
వెన్నుపూసలు కదులుతున్నాయ్!
[ 30-06-2024]
జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. -
బడిబాట @ 2819 ప్రవేశాలు
[ 30-06-2024]
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రసాదాలపై పర్యవేక్షణ శూన్యం
[ 30-06-2024]
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు.