కాలుష్యాన్ని పసిగడతారు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల పరిమితి 40(పీఎం 10) ఉండాలి కానీ ఉమ్మడి జిల్లాలో అంతకంటే ఎక్కువే నమోదు అవుతోంది. ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితమైన వాయు కాలుష్యం ఇప్పుడు జిల్లాలకు పాకుతోంది. వాహనాల సంఖ్య పెరగడం, పరిశ్రమలు ఏర్పడటంతో వేగంగా విస్తరిస్తోంది.
ఆదిలాబాద్లో మూడు గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు
ఆదిలాబాద్ వ్యవసాయం, న్యూస్టుడే
మందమర్రిలోని కాలుష్య పరిశీలన కేంద్రం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల పరిమితి 40(పీఎం 10) ఉండాలి కానీ ఉమ్మడి జిల్లాలో అంతకంటే ఎక్కువే నమోదు అవుతోంది. ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితమైన వాయు కాలుష్యం ఇప్పుడు జిల్లాలకు పాకుతోంది. వాహనాల సంఖ్య పెరగడం, పరిశ్రమలు ఏర్పడటంతో వేగంగా విస్తరిస్తోంది.
గాలిలో సూక్ష్మధూళి కణాలు(పీఎం 10) నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) గణాంకాల ప్రకారం గతంతో పోలిస్తే ప్రతి నెలా పెరుగుతోంది. అయితే మరింత కచ్చితత్వం కోసం ఆదిలాబాద్లో మరో మూడు గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆమోదం తెలపడంతో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నివాస ప్రాంతాలకు సంబంధించి రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో, వాణిజ్య సముదాయాలకు సంబంధించి ఆదిలాబాద్ పురపాలక సంఘ భవనంపై ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసుకున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గాలి నాణ్యత స్టేషన్ మార్కెట్ ఆవరణలో ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త స్టేషన్ల ద్వారా నాలుగు రకాల ప్రమాదకర ఉద్గారాలను లెక్కించనున్నారు. ఎస్వో 2, ఎన్వో 2, సూక్ష్మధూళి కణాలు ఉండే పీఎం 10, అతి సూక్ష్మధూళి కణాలు ఉండే పీఎం 2.5ని లెక్కించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు మందమర్రిలో మాత్రమే గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ ఉంది. ఇక్కడ గుర్తించిన వివరాలను ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా సగటుకు లెక్కలోకి తీసుకున్నారు. తాజాగా కేంద్రం ప్రాంతాలవారీగా గాలి నాణ్యతను లెక్కించేందుకు రాష్ట్రంలో 40 స్టేషన్లు ఏర్పాటు చేయగా అందులో ఆదిలాబాద్ జిల్లాలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పక్కాగా లెక్కించడానికి దోహదం
- లక్ష్మణ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి
గాలి నాణ్యతపై ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా ఈ స్టేషన్లు ఉపయోగపడుతాయి. ప్రాంతాలవారీగా గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు జిల్లాకు మూడు కేంద్రాల ఏర్పాటుకు అనుమతి వచ్చింది. ఈ కేంద్రాల ఏర్పాటుతో ఎక్కడ ఏ రకమైన కాలుష్య ఉద్గారాలు పరిమితికి మించి ఉన్నాయి. ఏ సమయంలో కాలుష్య తీవ్రత ఎక్కువ ఉంటుంది అనే సమాచారాన్ని పక్కాగా తెలుసుకోవచ్చు. పరిమితికి మించి ఉంటే కాలుష్య నియంత్రణ కట్టడి దిశగా చర్యలకు ఈ స్టేషన్లు ఇచ్చే సమాచారం ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది.
ఉమ్మడి జిల్లాలో సగటు సూక్ష్మధూళి కణాల విలువ ఇలా..
జనవరి 78
ఫిబ్రవరి 83
మార్చి 80
ఏప్రిల్ 84
- నెల
- సూక్ష్మధూళికణాలు (పీఎం 10)
సూక్ష్మ ధూళికణాల పరిమితి(ఘనపు మీటరుకు మైక్రో గ్రాముల్లో)
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం 60
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 40
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గుట్టుగా దుకాణాల వేలం’పై అభ్యంతరం
[ 30-06-2024]
బల్దియాలో పారదర్శకతకు పాతరేసి గుట్టుగా సాగిన అద్దె దుకాణాల వేలంపాటపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’లో ‘గుట్టుగా అద్దె దుకాణాల వేలం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది. -
రమేష్ రాఠోడ్ మృతితో విషాదం
[ 30-06-2024]
మెండైన గుండె ధైర్యం. ఆప్యాయంగా పలకరించే నైజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యే తాపత్రయం. అవసరాన్ని బట్టి తోచిన సాయం చేయాలనే మానవత్వం. భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ (57) సొంతం. -
వేలిముద్ర వేయకున్నా.. రూ.1.40 లక్షలు మాయం!
[ 30-06-2024]
మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళా రైతు నిరక్షరాస్యురాలు. సీఎస్సీ (కస్టమర్ సర్వీస్ సెంటర్)లలో వేలిముద్ర వేసి తన ఖాతా నుంచి అవసరమైన డబ్బులు తీసుకునేవారు. -
సంప్రదాయ ఆటలో మెరికలు
[ 30-06-2024]
కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. -
అవినీతిలో ఘనుడు
[ 30-06-2024]
పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్లు, ఢైరీఫామ్లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య. -
పట్టాలున్నా.. రుణం రావట్లే!
[ 30-06-2024]
అటవీ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు ప్రభుత్వం హక్కు పత్రాలిచ్చినా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పంటల సీజన్ మొదలై నెల కావాస్తోంది. ఇటు పెట్టుబడి సాయం అందక అటు బ్యాంకులు అప్పులు ఇవ్వక పోడుదారులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు.. కలగాలి కనువిప్పు!
[ 30-06-2024]
కాగజ్నగర్ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. -
వెన్నుపూసలు కదులుతున్నాయ్!
[ 30-06-2024]
జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. -
బడిబాట @ 2819 ప్రవేశాలు
[ 30-06-2024]
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రసాదాలపై పర్యవేక్షణ శూన్యం
[ 30-06-2024]
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇంకా పోని వైకాపా వాసనలు.. కుర్చీ వదలని ఉపకులపతి..!
-
విశ్వవిజేత.. భారత్కు దక్కిన ప్రైజ్మనీ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం.. సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రం
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
-
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?