దోమను తరిమేద్దాం!
వర్షాకాలం వచ్చేసింది.. రహదారులు, మురుగు కాల్వలు, ఖాళీ స్థలాలు, తాగి పడేసిన కొబ్బరి బోండాలు, ఖాళీ టైర్లు.. ఇలా నీరు నిల్వ ఉన్న ప్రతీ చోట దోమలు వృద్ధి చెంది రోగాలవ్యాప్తికి కారణం అవుతుంటాయి. వీటి బారిన పడి రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడటం ఏటా నిత్య కృత్యంగా మారుతోంది.
న్యూస్టుడే, లక్షెట్టిపేట
వ్యాధులకాలంలో సమష్టి పోరాటం అవసరం
వర్షాకాలం వచ్చేసింది.. రహదారులు, మురుగు కాల్వలు, ఖాళీ స్థలాలు, తాగి పడేసిన కొబ్బరి బోండాలు, ఖాళీ టైర్లు.. ఇలా నీరు నిల్వ ఉన్న ప్రతీ చోట దోమలు వృద్ధి చెంది రోగాలవ్యాప్తికి కారణం అవుతుంటాయి. వీటి బారిన పడి రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడటం ఏటా నిత్య కృత్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే వీటి నివారణకు ముందడుగు వేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉంది. పంచాయతీ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి. దీంతోపాటు ప్రతీ ఒక్కరూ తమ ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యంతోపాటు నలుగురిని వ్యాధులబారి నుంచి రక్షించినవారం అవుతాం.
మురుగుమయం..
ఇక్కడ కనిపిస్తుంది లక్షెట్టిపేట 9వ వార్డులోని చిత్రం. అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారు కాసుల కక్కుర్తి వెరసి మురుగు కాల్వల నిర్మాణం అస్తవ్యస్తంగా తయారయింది. రెండు సంవత్సరాలుగా వర్షం చినుకు కురిసిందంటే చాలు మురుగు కాల్వలోని నీరు బయటకు వెళ్లే మార్గం లేక ఇలా రహదారిపై పారి రోజుల తరబడి నిలిచి ఉంటోంది. అక్కడే అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాలు ఉన్నాయి. ఆ కాలనీకి వెళ్లాలంటూ ముక్కు మూసుకుని సర్కస్ ఫీట్లు చేసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు ఇలానే చెత్త, చెదారంతో అధ్వానంగా మారుతున్నాయి. ఒక్క వర్షం కురిసిందంటే చాలు అవి కుంటలుగా మారుతున్నాయి.
లక్షెట్టిపేటలోని అంకతివాడలో మురుగునీటితో నిండిన కాల్వ
ప్రజలు బాధ్యతగా భావించాలి
దోమల నివారణలో యంత్రాంగం తీసుకునే చర్యలు కొంత మేర ఫలితాలు ఇచ్చినా అధికశాతం బాధ్యత ప్రజలే తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో తగిన చర్యలను స్థానిక సంస్థలు చేపట్టినా ఇళ్లలో దోమలు వృద్ధి కాకుండా చూడటంలో ప్రజలదే కీలక పాత్ర. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోతే దోమల సంతతి పెరిగేందుకు కారణం అవుతుంది. ఆ తర్వాత కాయిల్స్, లిక్విడ్లాంటి దోమల నివారణ మందులకు రూ.వేలు ఖర్చు చేయక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
జిల్లా మలేరియా విభాగం సిబ్బంది మలేరియా, డెంగీ, గన్యా, పైలేరియా వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఒక వేళ వ్యాధులువ్యాపిస్తే చికిత్స ద్వారా నయం చేస్తూనే మిగిలిన ప్రజలకు వ్యాప్తి చెందకుండా నిలువరించాల్సి ఉంటుంది. తమ క్లస్టర్ పరిధిలో సబ్ యూనిట్ అధికారులు మూడు నెలలకు ఒకసారి దోమల నివారణకు చర్యలు చేపట్టేలా పర్యవేక్షించాల్సి ఉంటుంది.
వేధించే దోమలు మూడు రకాలు
ఎడిస్ ఈజిప్టీ : డెంగీ, గన్యా వైరస్లను వ్యాప్తికి దోహదం చేస్తాయి
ఆడ ఎనాఫిలస్: ఒకరి నుంచి మరొకరికి మలేరియా సోకేందుకు కారణం అవుతాయి.
క్యూలెక్స్ : పైలేరియా(బోధకాలు) వ్యాప్తికి కారణం
స్థానిక సంస్థల బాధ్యత
స్థానిక సంస్థలు దోమల నివారణకు ముందస్తు ప్రణాళికలు అనుసరించడం లేదు. మలేరియా, డెంగీ జ్వరాలు తరచూ నమోదైతేనే వైద్యారోగ్య శాఖ ప్రోద్బలంతో దోమల సంహారానికి మందు పిచికారీ చేయిస్తున్నారు. వానాకాలంలో వాటి సంతతి వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నివారణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాల్సి ఉంది.
- మున్సిపాలిటీలు వారానికి ఒకసారి మురుగు కాల్వలు శుభ్రం చేయించాలి.
- దోమల నివారణకు మందులు పిచికారీ చేయాలి, ఫాగింగ్ చర్యలు కొనసాగించాలి.
- బహిరంగ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి.
- నీరు నిల్వ ఉంటే ఆయిల్బాల్స్, గంబూషియా చేపలను మురుగునీటిలో వదలాలి.
- యాంటీలార్వా కార్యక్రమాలు అమలు చేయాలి
- ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లించాలి
ఇలా చేస్తే మేలు
వైద్యారోగ్యశాఖ సూచనల మేరకు ప్రతి శుక్రవారం డ్రైడే ఆచరించాలి
వారం రోజులకుపైగా నిల్వ ఉన్న నీటిని ఒలకబోయాలి.
పాత్ర లేదా నీటి తొట్ల అడుగు భాగాన్ని బాగా కడిగి ఆరబెట్టాలి
వినియోగించని కూలర్లలో నీటి నిల్వలను తొలగించాలి
ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం, వ్యర్థ జలాలు నిల్వ కాకుండా చూడాలి
సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి
ఆవరణలో ఉండే టైర్లు, ఖాళీ డబ్బాలు, కొబ్బరి బోండాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా పారబోయాలి.
దోమలు వాలి గుడ్లు పెట్టకుండా నీటి నిల్వ పాత్రలు, ఉపరితల తొట్టిలను మూతలతో కప్పి ఉంచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు
[ 30-06-2024]
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రిమ్స్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అశోక్, డాక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. -
గుట్కా విక్రయదారులపై కేసు
[ 30-06-2024]
నిషేధించిన గుట్కాను తరలిస్తున్న ముగ్గురిని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
[ 30-06-2024]
ఆదిలాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి లభించిన గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్ధానిక రిమ్స్ మార్చురీలో భద్రపరిచినట్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ తెలిపారు. -
సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు
[ 30-06-2024]
సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. -
బస్సు ప్రమాదంలోనే గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
[ 30-06-2024]
ఆదిలాబాద్ ఆర్టీసి బస్ స్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి ఘటనను పోలీసులు ఛేదించారు. -
‘గుట్టుగా దుకాణాల వేలం’పై అభ్యంతరం
[ 30-06-2024]
బల్దియాలో పారదర్శకతకు పాతరేసి గుట్టుగా సాగిన అద్దె దుకాణాల వేలంపాటపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’లో ‘గుట్టుగా అద్దె దుకాణాల వేలం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది. -
రమేష్ రాఠోడ్ మృతితో విషాదం
[ 30-06-2024]
మెండైన గుండె ధైర్యం. ఆప్యాయంగా పలకరించే నైజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యే తాపత్రయం. అవసరాన్ని బట్టి తోచిన సాయం చేయాలనే మానవత్వం. భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ (57) సొంతం. -
వేలిముద్ర వేయకున్నా.. రూ.1.40 లక్షలు మాయం!
[ 30-06-2024]
మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళా రైతు నిరక్షరాస్యురాలు. సీఎస్సీ (కస్టమర్ సర్వీస్ సెంటర్)లలో వేలిముద్ర వేసి తన ఖాతా నుంచి అవసరమైన డబ్బులు తీసుకునేవారు. -
సంప్రదాయ ఆటలో మెరికలు
[ 30-06-2024]
కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. -
అవినీతిలో ఘనుడు
[ 30-06-2024]
పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్లు, ఢైరీఫామ్లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య. -
పట్టాలున్నా.. రుణం రావట్లే!
[ 30-06-2024]
అటవీ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు ప్రభుత్వం హక్కు పత్రాలిచ్చినా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పంటల సీజన్ మొదలై నెల కావాస్తోంది. ఇటు పెట్టుబడి సాయం అందక అటు బ్యాంకులు అప్పులు ఇవ్వక పోడుదారులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు.. కలగాలి కనువిప్పు!
[ 30-06-2024]
కాగజ్నగర్ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. -
వెన్నుపూసలు కదులుతున్నాయ్!
[ 30-06-2024]
జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. -
బడిబాట @ 2819 ప్రవేశాలు
[ 30-06-2024]
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రసాదాలపై పర్యవేక్షణ శూన్యం
[ 30-06-2024]
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
-
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
-
జాగిలాల సాయంతో పబ్బుల్లో పోలీసుల తనిఖీలు
-
స్టాక్స్.. టీ20 కప్ విజయం మధ్య సారూప్యతేంటి?.. వివరించిన సెహ్వాగ్!
-
ప్రధాని మోదీతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నా: చంద్రబాబు
-
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా..! వారంలోనే 800 బాంబులతో విధ్వంసం