షాట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం.. రూ.1.13 లక్షల నష్టం
మండలంలోని గోలేటిలో బుధవారం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి ఓ ఇంటితోపాటు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. వివరాలు ఇలా.. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి క్వార్టర్ల సమీపంలో నివాసముంటున్న సిరికొండ తిరుపతి ఇంట్లో కూలర్తో విద్యుత్తు షాట్ సర్క్యూట్ జరిగి మంటలు లేచాయి.
పూర్తిగా కాలిపోయిన ఇంట్లోని సామగ్రి
గోలేటి టౌన్షిప్, న్యూస్టుడే: మండలంలోని గోలేటిలో బుధవారం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి ఓ ఇంటితోపాటు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. వివరాలు ఇలా.. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి క్వార్టర్ల సమీపంలో నివాసముంటున్న సిరికొండ తిరుపతి ఇంట్లో కూలర్తో విద్యుత్తు షాట్ సర్క్యూట్ జరిగి మంటలు లేచాయి. పక్కనే ఉన్న మంచాలు, దుస్తులకు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు ఇళ్లంతా వ్యాపించాయి. స్థానికులు వచ్చి మంటలు ఆర్పేశారు. అప్పటికే రెండు మంచాలు, బీరువా, కూలర్, ఫ్యాన్లు, నిత్యావసర సరకులు, విద్యార్థుల ధ్రువపత్రాలు పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. బీరువాలో భద్రపరిచిన రూ.30 వేల నగదు, అర తులం బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా బుగ్గిపాలయ్యాయి. విషయం తెలుసుకున్న రెబ్బెన ఆర్ఐ ప్రేమ్కిరణ్ ఘటన స్థలానికి చేరుకొని ఇంటిని పరిశీలించి పంచనామా నిర్వహించారు. రూ.1,13,500 నష్టం వాటిల్లినట్లు ఆర్ఐ తెలిపారు.
తప్పిన ప్రమాదం
షాట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలతో పెనుప్రమాదం తప్పింది. ఇంట్లో సిరికొండ తిరుపతి, లక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. అనారోగ్యంతో తిరుపతి ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయన భార్య ఉదయమే మంచిర్యాలకు వెళ్లింది. నడవలేని స్థితిలో ఉన్న ఆయన మెళ్లగా వచ్చి ఇంటి ముందు కూర్చున్నారు. ఆయన బయటకు వెళ్లిన పది నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఒక వేళ ఇంట్లోనే ఉంటే ప్రాణం పోయేదని తిరుపతి వాపోయారు. అంతేకాకుండా అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. విషయం తెలుసుకున్న ఆయన భార్య ఇంటికి వచ్చి పూర్తిగా కాలిపోయిన ఇంటిని చూసి కన్నీరుమున్నీరైంది. తమకు కట్టుబట్టలు మిగిలాయని రోదించారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుట్కా విక్రయదారులపై కేసు
[ 30-06-2024]
నిషేధించిన గుట్కాను తరలిస్తున్న ముగ్గురిని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
[ 30-06-2024]
ఆదిలాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి లభించిన గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్ధానిక రిమ్స్ మార్చురీలో భద్రపరిచినట్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ తెలిపారు. -
సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు
[ 30-06-2024]
సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. -
బస్సు ప్రమాదంలోనే గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
[ 30-06-2024]
ఆదిలాబాద్ ఆర్టీసి బస్ స్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి ఘటనను పోలీసులు ఛేదించారు. -
‘గుట్టుగా దుకాణాల వేలం’పై అభ్యంతరం
[ 30-06-2024]
బల్దియాలో పారదర్శకతకు పాతరేసి గుట్టుగా సాగిన అద్దె దుకాణాల వేలంపాటపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’లో ‘గుట్టుగా అద్దె దుకాణాల వేలం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది. -
రమేష్ రాఠోడ్ మృతితో విషాదం
[ 30-06-2024]
మెండైన గుండె ధైర్యం. ఆప్యాయంగా పలకరించే నైజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యే తాపత్రయం. అవసరాన్ని బట్టి తోచిన సాయం చేయాలనే మానవత్వం. భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ (57) సొంతం. -
వేలిముద్ర వేయకున్నా.. రూ.1.40 లక్షలు మాయం!
[ 30-06-2024]
మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళా రైతు నిరక్షరాస్యురాలు. సీఎస్సీ (కస్టమర్ సర్వీస్ సెంటర్)లలో వేలిముద్ర వేసి తన ఖాతా నుంచి అవసరమైన డబ్బులు తీసుకునేవారు. -
సంప్రదాయ ఆటలో మెరికలు
[ 30-06-2024]
కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. -
అవినీతిలో ఘనుడు
[ 30-06-2024]
పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్లు, ఢైరీఫామ్లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య. -
పట్టాలున్నా.. రుణం రావట్లే!
[ 30-06-2024]
అటవీ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు ప్రభుత్వం హక్కు పత్రాలిచ్చినా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పంటల సీజన్ మొదలై నెల కావాస్తోంది. ఇటు పెట్టుబడి సాయం అందక అటు బ్యాంకులు అప్పులు ఇవ్వక పోడుదారులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు.. కలగాలి కనువిప్పు!
[ 30-06-2024]
కాగజ్నగర్ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. -
వెన్నుపూసలు కదులుతున్నాయ్!
[ 30-06-2024]
జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. -
బడిబాట @ 2819 ప్రవేశాలు
[ 30-06-2024]
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రసాదాలపై పర్యవేక్షణ శూన్యం
[ 30-06-2024]
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జాగిలాల సాయంతో పబ్బుల్లో పోలీసుల తనిఖీలు
-
స్టాక్స్.. టీ20 కప్ విజయం మధ్య సారూప్యతేంటి?.. వివరించిన సెహ్వాగ్!
-
ప్రధాని మోదీతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నా: చంద్రబాబు
-
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా..! వారంలోనే 800 బాంబులతో విధ్వంసం
-
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
-
వరలక్ష్మీ శరత్కుమార్ పెళ్లి సందడి మొదలైంది.. ఫొటో చూశారా!