చారిత్రక కోట.. బోథ్ అడ్డా!
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఇప్పటి వరకు 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మొదట్లో జనరల్గా ఉన్న ఈ స్థానాన్ని 1967 నుంచి గిరిజనులకు(ఎస్టీ) రిజర్వ్ చేశారు.
న్యూస్టుడే, ఇచ్చోడ : బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఇప్పటి వరకు 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మొదట్లో జనరల్గా ఉన్న ఈ స్థానాన్ని 1967 నుంచి గిరిజనులకు(ఎస్టీ) రిజర్వ్ చేశారు. నియోజకవర్గంలో బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, తలమడుగు, సిరికొండ, భీంపూర్ మండలాలు ఉన్నాయి. ఇటీవల సొనాలను నూతన మండలంగా ఏర్పాటు చేశారు. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన నిర్వహించగా ఆదిలాబాద్ నియోజకవర్గంలోని తాంసి, తలమడుగు మండలాలను బోథ్లో కలిపారు. అంతకు ముందు బోథ్ నియోజకవర్గంలో నార్నూర్, ఇంద్రవెల్లి మండలాలు ఉండగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నార్నూర్ను, ఖానాపూర్ నియోజకవర్గంలో ఇంద్రవెల్లి మండలాన్ని కలిపారు. నియోజకవర్గంలో గిరిజనులకు రిజర్వ్డ్ అయినా గిరిజనేతర ఓట్లే ఇక్కడ కీలకం.
బోథ్ నియోజకవర్గంలో వ్యవసాయమే ఆధారం. ఇక్కడ జలవనరులు ఉన్నా ప్రాజెక్టుల నిర్మాణం లేక రైతులు వర్షాధారిత పంటలపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న చిన్న తరహా ప్రాజెక్టులు తాంసి మండలం మత్తడివాగు, సిరికొండ మండలం చిక్మాన్ ప్రాజెక్ట్, బోథ్ మండలం కరత్వాడ ప్రాజెక్ట్లే దిక్కు. నేరడిగొండలో కుప్టి వంతెన నిర్మాణం చేపడతామని ప్రభుత్వం చెప్పినా ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. పత్తి, సోయా, టమాట పంటలు సాగు చేస్తారు.
నాటి ఆనవాళ్లు..
బోథ్ నియోజకవర్గంలో చారిత్రక ఆనవాళ్లకు కొదువలేదు. కాకతీయులు, ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని పాలించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇచ్చోడ మండలం సిరిచెల్మ మల్లికార్జున ఆలయం, నేరడిగొండ మండలం వడూర్, ఇచ్చోడ మండలం కామగిరిలో ఇక్ష్వాకుల కాలం నాటి శిలాశాసనాలు, గుడిహత్నూర్ మండలం రామాలయం, బజార్హత్నూర్ మండలం కనకాయి, నేరడిగొండ మండలం కుంటాల జలపాతంలో సోమేశ్వర స్వామి, సిరికొండ, సొనాల, దర్బా గ్రామాలు ప్రాచీన చరిత్రకు నిలయాలు.
పర్యాటక ప్రదేశాలు
బోథ్ నియోజకవర్గం పర్యాటక కేంద్రాలకు నెలవు. రాష్ట్రంలో ఎత్తయిన జలపాతం కుంటాల ఈ నియోజకవర్గంలోనే ఉంది. బోథ్ మండలం పొచ్చెర, ఇచ్చోడ మండలం గాయత్రి జలపాతాలు ఆకట్టుకుంటాయి.
పరిశ్రమల జాడ లేదు
ఇప్పటి వరకు పరిశ్రమల స్థాపన జరగలేదు. పత్తి, సోయాతో పాటు టమాట సాగు ఎక్కువగా ఉంటుంది. గతంలో కాంగ్రెస్ హయాంలో టమాట జ్యూస్ పరిశ్రమ ఏర్పాటుకు హామీ ఇచ్చిన నేటికీ నెరవేరలేదు. నిరుద్యోగ యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
ఆ మూడు పార్టీలే
- ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్, తెదేపా, తెరాస పార్టీ గెలుపొందాయి. 1962లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాధవరెడ్డి గెలుపొందారు. 1967, 1972, 1978, 1983లో వరుసగా హస్తం పార్టీ పాగా వేసింది.
- 1985లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న గోడం రామారావు తెదేపా నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1989లోనూ ఆయనే విజయం సాధించారు. 1994లో ఆయన తనయుడు నగేశ్ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయ రంగంలోకి రాగా, తెదేపా నుంచి గెలుపొందారు. 1999లోనూ విజయం సాధించారు.
- ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సోయం బాపురావు 2004లో తెరాస నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
- 2009లో గోడం నగేశ్ తెదేపా నుంచి పోటీ చేసి గెలుపొందారు.
- ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెరాస నుంచి పోటీ చేసిన రాఠోడ్ బాపురావు 2014, 2018లో గెలుపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
9న జిల్లాస్థాయి ఈత ఎంపిక పోటీలు
[ 08-07-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఉన్న ఈత కొలనులో ఈ నెల 9న ఉదయం 10 గంటలకు జిల్లాస్థాయి ఈత ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఈత సంఘం కార్యదర్శి మహేందర్ జిత్, స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణ తెలిపారు. -
గంగపుత్ర శివాలయం మహా అన్నదానం
[ 08-07-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శాంతినగర్ కాలనీకి చెందిన దాత సొంజికే శ్రీరామ-సులోచన దంపతులు స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు. -
పదోన్నతి.. ఓ కొత్త అనుభూతి
[ 08-07-2024]
బాల్యం ఎవరి జీవితంలోనైనా తిరిగిరాని ఓ మధురానుభూతి. పెరిగి పెద్దయ్యాక ఎప్పుడైనా, ఎక్కడైనా బాల్యస్నేహితులు కలిస్తే ఆ ఆనందమే వేరు. ఉద్యోగ, ఉపాధి మార్గాల్లో ఉన్నతస్థానాలకు వెళ్లాక మళ్లీ బాల్యస్మృతులు ప్రత్యేకంగా నెమరేసుకుంటే తప్ప అంతగా గుర్తుకురావు. -
ప్రాణహిత పనులకు ప్రాణం పోసేదెప్పుడో?
[ 08-07-2024]
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ప్రభుత్వాల చేతిలో పావుగా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరిట వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టు పనుల నిర్వహణ స్వరాష్ట్రమైన తెలంగాణలో ఆగిపోయింది. -
గిరిజన దైవం.. ప్రకృతి రమణీయం
[ 08-07-2024]
దట్టమైన అడవి.. చుట్టూ ఎత్తైన గుట్టలు.. పక్షుల కిలకిలరావాలు.. నిరంతరం కొండల నుంచి జాలువారే నీరు.. ద్రౌపది స్నానం చేసిందనడానికి ఆనవాలుగా రాతికుండలు.. -
రంగంలోకి బడా నేతలు
[ 08-07-2024]
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో ఆయా పార్టీల బడానేతలు రంగంలోకి దిగడంతో ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. -
బ్లీచింగ్ పౌడర్ సరఫరా ఏది?
[ 08-07-2024]
కౌటాల మండలంలోని గుడ్లబోరి గ్రామంలో పదిరోజులుగా పలువురు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. 50 మందికి పైగా జ్వరం, ఒళ్లు నొప్పులతో మంచంపట్టారు. -
కార్మిక లోకం.. అవగాహన లోపం
[ 08-07-2024]
ఆదిలాబాద్ నేతాజీ కూడలి, పంజాబ్చౌక్, శివాజీ కూడలి, దస్నాపూర్లోని పెట్రోల్ బంక్ ప్రాంతం అడ్డా కూలీలకు పేరొందాయి. -
ఐటీడీఏ బోధనేతర ఉద్యోగులకు స్థానచలనం
[ 08-07-2024]
ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖల్లో పని చేస్తున్న బోధనేతర ఉద్యోగులు అయిదేళ్ల నుంచి బదిలీలకు నోచుకోకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రిమ్స్ డైరెక్టర్కు అరుదైన అవకాశం
[ 08-07-2024]
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల డైరెక్టర్ డా.జైసింగ్కు అరుదైన అవకాశం లభించింది. తాజాగా ఆయనను సెనేటర్గా ఎంపిక చేస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం నియమించింది. -
మీ సేవ.. మరింత చేరువ!
[ 08-07-2024]
మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాల పోషణకు పరోక్షంగా సహాయ పడుతోంది. -
‘మత్తు’లో మట్టుబెట్టారు..!
[ 08-07-2024]
శ్రీ ముగ్గురూ మైనర్లే. పైగా మద్యం తాగిఉన్నారు. ఆ సమయంలో మరో యువకుడు మద్యం మత్తులో వారిని లిఫ్ట్ అడిగాడు. దుర్భాషలాడాడు. -
గుర్తించలేకే...
[ 08-07-2024]
ఆరోగ్య మహిళ.. అతివలకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతీ మంగళవారం నిర్వహిస్తోంది. -
చిటపట చినుకు.. ప్రయాణికులకు వణుకు
[ 08-07-2024]
రైల్వే క్రాసింగ్ల వద్ద ప్రమాదాల నివారణకు, రైళ్ల రాకపోకలతో తలెత్తే ట్రాఫిక్ తదితర సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో గేట్మెన్ రహిత రైల్వేగేట్ల కోసం అండర్బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు. -
రాయితీ బియ్యం.. అక్రమార్కుల పరం
[ 08-07-2024]
రేషన్ బియ్యం అక్రమార్కులపరం అవుతోంది. దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. జిల్లాలో బియ్యం రవాణా యథేచ్ఛగా సాగుతోంది. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్
-
స్కైడాన్స్ చేతికి హాలీవుడ్ ఐకాన్ పారామౌంట్ గ్లోబల్..!
-
ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయొద్దు: ఈసీకి ఏపీ హైకోర్టు ఆదేశం
-
డబ్బులిస్తామని కిడ్నీ మాయం చేసిన వైనం.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
-
కజిరంగ పార్క్ను ముంచెత్తిన వరదలు.. వన్యప్రాణులు మృత్యువాత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM