భిన్నత్వంలో ఏకత్వం.. ఆదిలాబాద్ ప్రత్యేకం
గుజరాతీల దాండియా ఆటలు.. మార్వాడీల పండగలు.. ఆదివాసీల గుస్సాడీ నృత్యాలు.. లంబాడీల తీజ్ ఉత్సవాలు.. తెలుగింటి బతుకమ్మ సంబరాలు ఆదిలాబాద్లో కనిపిస్తాయి.
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
గుజరాతీల దాండియా ఆటలు.. మార్వాడీల పండగలు.. ఆదివాసీల గుస్సాడీ నృత్యాలు.. లంబాడీల తీజ్ ఉత్సవాలు.. తెలుగింటి బతుకమ్మ సంబరాలు ఆదిలాబాద్లో కనిపిస్తాయి. బిహార్, అసోం, ఒడిశా రాష్ట్రాలవాసులు ఇక్కడి వారితో కలిసిపోయి పని చేసుకుంటారు. మొత్తానికి మినీ భారత్గా ఆదిలాబాద్ ప్రసిద్ధికెక్కింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోంది. నియోజకవర్గం ఆదిలాబాద్, బేల, జైనథ్, మావల మండలాలు, ఆదిలాబాద్ పట్టణ ప్రాంతంతో కలిసి ఉంటుంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం నిజాం ప్రభుత్వం నుంచి విముక్తి పొందాక ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. తొలుత జైనథ్, బేల, ఆదిలాబాద్ గ్రామీణం, తలమడుగు, తాంసి తదితర అయిదు మండలాలు, ఆదిలాబాద్ మున్సిపాల్టీతో ఏర్పడిన ఈ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా కొన్ని మండలాలను కుదించారు. తలమడుగు, తాంసి మండలాలను బోథ్ నియోజకవర్గంలో కలపడంతో 2009లో మూడు మండలాలు, ఒక పట్టణంతో నియోజకవర్గ స్వరూపం మారింది. తెలంగాణ వచ్చాక ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని కొన్ని గ్రామాలతో మావల మండలం కొత్తగా రూపుదిద్దుకుంది. తాజాగా సాత్నాల, భోరజ్ల పేరుతో మరో రెండు మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భారీగా సున్నపురాయి నిక్షేపాలు
ఇక్కడ సున్నపురాయి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కేంద్రం 1982లో ఆదిలాబాద్లో సుమారు 2 వేల ఎకరాలను లీజుకు తీసుకొని సిమెంటు పరిశ్రమను స్థాపించింది. ఈ పరిశ్రమ 1998లో మూతపడింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం రామాయి సమీపంలో ప్రైవేటు సిమెంటు పరిశ్రమ ఏర్పాటుకు సైతం సున్నపురాయి నిల్వలు ఉన్న భూములను గుర్తించారు. ఆదిలాబాద్ మండలం జందాపూర్ ప్రాంతంలో మాంగనీసు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వివిధ కంపెనీలు రైతుల భూములను లీజుకు తీసుకొని మాంగనీసును ఇతర రాష్ట్రాలకు తరలించగా ప్రస్తుతానికి దేశంలో డిమాండ్ తగ్గడంతో ఈ వ్యాపారం తగ్గుముఖం పట్టింది.
ప్రాచీన ఆలయాలు
జైనథ్ మండల కేంద్రంలో 1200 ఏళ్ల కిందట జైనులు నిర్మించినట్లు చెబుతున్న శ్రీ లక్ష్మీనారాయస్వామి ఆలయం ఉంది. బేల మండలంలో సదల్పూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆదివాసీల ఆరాధ్య దైవం భైరాందేవ్, మహాదేవ్ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు.
తెల్ల బంగారంలో నెంబరు 1
ఆదిలాబాద్ చుట్టు పక్కల గ్రామాల్లో పండించిన పత్తిపంటకు ఆసియా ఖండంలో మంచి పేరుంది. వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. పత్తి తర్వాత అధికంగా సోయాను పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్గంగా నీటిని ఒడిసిపట్టేందుకు రూ.1500 కోట్ల వ్యయంతో చనాఖా-కోర్ట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఇటీవలే ట్రయల్ రన్ ప్రారంభించి జైనథ్, బేల మండలాల్లోని గ్రామాలకు నిర్మించిన కాలువలోకి నీళ్లు వదిలారు. ఇది పూర్తిగా వినియోగంలోకి రాలేదు.
తొలినాళ్లలో ఎర్రజెండాకు పట్టం
రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులపై నిషేధం ఉండటంతో తొలినాళ్లలో పీడీఎఫ్ గుర్తుమీద పోటీ చేశారు. వరుసగా రెండుమార్లు ప్రజలు వారికి పట్టం కట్టారు. నిషేధం ఎత్తివేశాక ఒకసారి సీపీఐని గెలిపించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా అందులో ఒకసారి మాత్రమే ఉప ఎన్నికలు వచ్చాయి. 2009లో తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జోగు రామన్న 2012లో తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో తెరాస తరఫున పోటీచేసి విజయం సాధించారు. స్వతంత్రులకు నాలుగు మార్లు పట్టం కట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
9న జిల్లాస్థాయి ఈత ఎంపిక పోటీలు
[ 08-07-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఉన్న ఈత కొలనులో ఈ నెల 9న ఉదయం 10 గంటలకు జిల్లాస్థాయి ఈత ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఈత సంఘం కార్యదర్శి మహేందర్ జిత్, స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణ తెలిపారు. -
గంగపుత్ర శివాలయం మహా అన్నదానం
[ 08-07-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శాంతినగర్ కాలనీకి చెందిన దాత సొంజికే శ్రీరామ-సులోచన దంపతులు స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు. -
పదోన్నతి.. ఓ కొత్త అనుభూతి
[ 08-07-2024]
బాల్యం ఎవరి జీవితంలోనైనా తిరిగిరాని ఓ మధురానుభూతి. పెరిగి పెద్దయ్యాక ఎప్పుడైనా, ఎక్కడైనా బాల్యస్నేహితులు కలిస్తే ఆ ఆనందమే వేరు. ఉద్యోగ, ఉపాధి మార్గాల్లో ఉన్నతస్థానాలకు వెళ్లాక మళ్లీ బాల్యస్మృతులు ప్రత్యేకంగా నెమరేసుకుంటే తప్ప అంతగా గుర్తుకురావు. -
ప్రాణహిత పనులకు ప్రాణం పోసేదెప్పుడో?
[ 08-07-2024]
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ప్రభుత్వాల చేతిలో పావుగా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరిట వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టు పనుల నిర్వహణ స్వరాష్ట్రమైన తెలంగాణలో ఆగిపోయింది. -
గిరిజన దైవం.. ప్రకృతి రమణీయం
[ 08-07-2024]
దట్టమైన అడవి.. చుట్టూ ఎత్తైన గుట్టలు.. పక్షుల కిలకిలరావాలు.. నిరంతరం కొండల నుంచి జాలువారే నీరు.. ద్రౌపది స్నానం చేసిందనడానికి ఆనవాలుగా రాతికుండలు.. -
రంగంలోకి బడా నేతలు
[ 08-07-2024]
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో ఆయా పార్టీల బడానేతలు రంగంలోకి దిగడంతో ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. -
బ్లీచింగ్ పౌడర్ సరఫరా ఏది?
[ 08-07-2024]
కౌటాల మండలంలోని గుడ్లబోరి గ్రామంలో పదిరోజులుగా పలువురు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. 50 మందికి పైగా జ్వరం, ఒళ్లు నొప్పులతో మంచంపట్టారు. -
కార్మిక లోకం.. అవగాహన లోపం
[ 08-07-2024]
ఆదిలాబాద్ నేతాజీ కూడలి, పంజాబ్చౌక్, శివాజీ కూడలి, దస్నాపూర్లోని పెట్రోల్ బంక్ ప్రాంతం అడ్డా కూలీలకు పేరొందాయి. -
ఐటీడీఏ బోధనేతర ఉద్యోగులకు స్థానచలనం
[ 08-07-2024]
ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖల్లో పని చేస్తున్న బోధనేతర ఉద్యోగులు అయిదేళ్ల నుంచి బదిలీలకు నోచుకోకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రిమ్స్ డైరెక్టర్కు అరుదైన అవకాశం
[ 08-07-2024]
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల డైరెక్టర్ డా.జైసింగ్కు అరుదైన అవకాశం లభించింది. తాజాగా ఆయనను సెనేటర్గా ఎంపిక చేస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం నియమించింది. -
మీ సేవ.. మరింత చేరువ!
[ 08-07-2024]
మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాల పోషణకు పరోక్షంగా సహాయ పడుతోంది. -
‘మత్తు’లో మట్టుబెట్టారు..!
[ 08-07-2024]
శ్రీ ముగ్గురూ మైనర్లే. పైగా మద్యం తాగిఉన్నారు. ఆ సమయంలో మరో యువకుడు మద్యం మత్తులో వారిని లిఫ్ట్ అడిగాడు. దుర్భాషలాడాడు. -
గుర్తించలేకే...
[ 08-07-2024]
ఆరోగ్య మహిళ.. అతివలకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతీ మంగళవారం నిర్వహిస్తోంది. -
చిటపట చినుకు.. ప్రయాణికులకు వణుకు
[ 08-07-2024]
రైల్వే క్రాసింగ్ల వద్ద ప్రమాదాల నివారణకు, రైళ్ల రాకపోకలతో తలెత్తే ట్రాఫిక్ తదితర సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో గేట్మెన్ రహిత రైల్వేగేట్ల కోసం అండర్బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు. -
రాయితీ బియ్యం.. అక్రమార్కుల పరం
[ 08-07-2024]
రేషన్ బియ్యం అక్రమార్కులపరం అవుతోంది. దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. జిల్లాలో బియ్యం రవాణా యథేచ్ఛగా సాగుతోంది. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతిపాదిత షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
-
ఈనెల 16 వరకు అఫిడవిట్లు దాఖలు చేయండి: ఇంజినీర్లకు కాళేశ్వరం కమిటీ ఆదేశాలు
-
కుమార్తె పేరు ప్రకటించిన మంచు మనోజ్.. దీవెనలు కావాలంటూ పోస్ట్
-
ఏపీలో ఇసుక సరఫరాకు మార్గదర్శకాలు జారీ
-
వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్కు ప్రజలు ఓటు వేశారు: పురందేశ్వరి