logo

మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

మాజీ ఎంపీ  రమేష్  రాథోడ్ ఇటీవల మృతి చెందారు. కామారెడ్డి  ఎమ్మెల్యే  వెంకట్రామ రెడ్డి  ఉట్నూర్‌లోని  మాజీ ఎంపీ రమేష్ కుటుంబసభ్యులను పరామర్శించారు.

Updated : 03 Jul 2024 15:00 IST

ఉట్నూర్‌ గ్రామీణం: మాజీ ఎంపీ  రమేష్  రాథోడ్ ఇటీవల మృతి చెందారు. బుధవారం  కామారెడ్డి  ఎమ్మెల్యే  వెంకట్రామ రెడ్డి  ఉట్నూర్‌లోని  మాజీ ఎంపీ రమేష్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ముందుగా  రమేష్ చిత్రపటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన తనయులు రితీష్ రాథోడ్, రాహుల్ రాథోడ్‌లతోపాటు మాజీ ఎంపీ రాథోడ్ సతీమణి మాజీ ఎమ్మెల్యే సుమన్ బాయి, కుటుంబ సభ్యులను పరామర్శించి  ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాథోడ్ చేసిన సేవలను  గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి ప్రజలు, భాజపా పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని