logo

Adilabad: వన మహోత్సవాన్ని విజయవంతం చేయండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ అబ్ధుల్ సమద్ అధికారులను ఆదేశించారు.

Published : 02 Jul 2024 18:56 IST

తానూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ అబ్ధుల్ సమద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామీణులకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ మోహన్ సింగ్, ఏపీఓ గంగాధర్ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు