logo

Adilabad: మాజీ మంత్రి జన్మదిన వేడుకలు

భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలు ఆదిలాబాద్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు.

Published : 04 Jul 2024 15:52 IST

ఆదిలాబాద్ పట్టణం: భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలు ఆదిలాబాద్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్టీయూ భవనంలో వేలాది కార్యకర్తలు ఆయన్ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వందకు పైగా కార్యకర్తలు రక్త దానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అజయ్, మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని