logo

Adilabad: ఆర్‌ఎంపీ క్లినిక్‌లకు జరిమానా

అర్హతకు మించి చికిత్సలు అందిస్తున్న ఆర్ఎంపీల దవాఖానాలకు వైద్యశాఖ తనిఖీ బృందం జరిమానాలు విధించింది.

Published : 02 Jul 2024 20:13 IST

ఎదులాపురం: అర్హతకు మించి చికిత్సలు అందిస్తున్న ఆర్ఎంపీల దవాఖానాలకు వైద్యశాఖ తనిఖీ బృందం జరిమానాలు విధించింది. స్థానిక శివాజీ కూడలిలో ఆర్‌ఎంపీ వైద్యులు సంజయ్‌ క్లినిక్‌, బాలాజీ క్లినిక్‌ ఏర్పాటు చేసి పెద్దపెద్ద బోర్డులు వేశారు. ఆ బోర్డులపై ఆర్‌ఎంపీ వైద్యులు అని కూడా రాయకుండానే ఆస్పత్రుల్లో బెడ్‌లు కూడా ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైద్యశాఖ తనిఖీ బృందం సభ్యులు పి.వెంకటరెడ్డి, రాంప్రసాద్ ఆ ఆసుపత్రులను తనిఖీ చేసి ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున జరిమానాలు విధించారు. అంతే కాకుండా తఖీదులు కూడా జారీ చేశారు. నిబంధనలు పాటించకపోతే సీజ్ చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు