logo

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు.

Updated : 29 Jun 2024 15:01 IST

హైదరాబాద్‌: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి  విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా.. మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ద తుది శ్వాస  విడిచారు. ఆయన భౌతికకాయాన్ని ఉట్నూర్‌కు తరలించారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

తెదేపా తరఫున 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. 2009లో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెదేపా నుంచి భారాసలో చేరారు. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత భాజపాలోకి వెళ్లారు. ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని