logo

పుస్తకాల ఆవిష్కరణ

ఒకటి, రెండు తరగతుల కోసం “రూం టూ రీడ్ ఇండియా ట్రస్ట్” రూపొందించిన డీకోడబుల్ టెక్ట్స్ బుక్స్‌ను జిల్లా పాలనాధికారి రాజర్షి షా క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

Published : 02 Jul 2024 13:04 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: ఒకటి, రెండు తరగతుల కోసం “రూం టూ రీడ్ ఇండియా ట్రస్ట్” రూపొందించిన డీకోడబుల్ టెక్ట్స్ బుక్స్‌ను జిల్లా పాలనాధికారి రాజర్షి షా క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. రూం టూ రీడ్ ఇండియా రాష్ట్ర మేనేజర్ నరసింహా చారి గత సంవత్సరంలో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో చేయబోయే కార్యక్రమాల నివేదికను అందజేశారు. వచ్చే నెలలో రూం టూ రీడ్ సంస్థ రూపొందించిన మాడల్ లైబ్రరీల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.  విద్యాశాఖ ఎ.ఎమ్.ఒ శ్రీకాంత్ గౌడ్, రూం టు రీడ్ రాష్ట్ర ప్రతినిధి ఎస్. ప్రవీణ్, ప్రాజెక్టు అధికారి టి.నితిన్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని