logo

Adilabad: ధర్నాను విజయవంతం చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కల్లేపల్లి ప్రేమ్ రాజ్ డిమాండ్ చేశారు.

Published : 02 Jul 2024 16:07 IST

ఎదులాపురం: కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కల్లేపల్లి ప్రేమ్ రాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆదిలాబాద్ లోని ప్రెస్ క్లబ్లో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల రూ.6వేల పెన్షన్‌ను అందజేయాలన్నారు. దివ్యాంగుల సమస్యలపై ఈనెల 5న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని