logo

Adilabad: రాయితీ బియ్యం పట్టివేత

ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపెల్లి పాత జాతీయ రహదారి వద్ద టూటౌన్ సీఐ అశోక్ కుమార్, ఐడీ పార్టీ నరేష్, క్రాంతి గురువారం వాహనాల తనిఖీ నిర్వహించారు.

Published : 04 Jul 2024 19:43 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపెల్లి పాత జాతీయ రహదారి వద్ద టూటౌన్ సీఐ అశోక్ కుమార్, ఐడీ పార్టీ నరేష్, క్రాంతి గురువారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చిలుకూరి లక్ష్మీ నగర్‌కు చెందిన ఎస్.కె. అద్నాన్ తన ఆటోలో మూడు క్వింటల్లా 80 కిలోలు పీడీఎస్ రైస్‌ను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగించి ఆటోను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని