logo

Adilabad: ఘనంగా వైద్యుల దినోత్సవం

ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Updated : 01 Jul 2024 16:41 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దస్నాపూర్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని బాల కేంద్రం నృత్య బృందం నృత్యాలతో ప్రారంభించింది. అనంతరం పలువురు వైద్యులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ సంచాలకుడు డాక్టర్ రాథోడ్ జైసింగ్, ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ అశోక్ ఇతర వైద్యులను శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అశోక్, శ్యాం ప్రసాద్, సుమలత, ఇద్రిస్ అక్బాని, రమ, న్యాయవాది భావన, బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ప్రతినిధులు బ్రహ్మ సతీష్, విజయ్, నాహెద్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని