logo

Adilabad: గుట్కా విక్రయదారులపై కేసు

నిషేధించిన గుట్కాను తరలిస్తున్న ముగ్గురిని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Published : 30 Jun 2024 16:03 IST

ఎదులాపురం: నిషేధించిన గుట్కాను తరలిస్తున్న ముగ్గురిని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఖుర్షిద్ నగర్‌కు చెందిన షేక్ సమీ, ఇమ్రాన్ ఖాన్, షేక్ మోహిసిన్ లు స్థానిక అస్లం ట్రేడర్స్ నుంచి కొనుగోలు చేసి తరలిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న సీఐ అశోక్ వారిని తనిఖీ చేసి గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,300 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. స్థానిక వైన్ షాపులో విక్రయదారుడిని బెదిరించి నగదు కాజేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. పట్టణానికి చెందిన ఆసిఫ్ ఉద్దీన్ ఖురేషి శనివారం రాత్రి శ్రీనివాస వైన్స్‌లోకి వెళ్లి కౌంటర్లో ఉన్న వ్యక్తిని బెదిరించి రూ.3 వేలు కాజేసి పరారయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని