logo

Adilabad: ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈ నెల 6న నిర్వహించనున్న ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు.

Published : 03 Jul 2024 19:15 IST

ఎదులాపురం: పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈ నెల 6న నిర్వహించనున్న ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు.  బుధవారం స్థానిక కుమురభీం భవన్‌లో  ఆయన మాట్లాడుతూ.. పాలస్తీనాపై ఇజ్రాయిల్ మారణకాండను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు చొరవ చూపాలని కోరారు. ఇజ్రాయిల్ పాశవిక దాడులను మేధావులు, విద్యార్థి సంఘాలు ఖండించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొడప సురేష్, సిడాం సాయికుమార్, ఆత్రం శీను, కుమ్ర వనిత, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని