logo

Adilabad: జడ్పీ పాలక వర్గానికి సన్మానం

జిల్లా పరిషత్ పాలక వర్గ సభ్యుల పదవీ కాలం ముగియడంతో శుక్రవారం జడ్పీ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Updated : 05 Jul 2024 15:42 IST

ఆదిలాబాద్ పట్టణం: జిల్లా పరిషత్ పాలక వర్గ సభ్యుల పదవీ కాలం ముగియడంతో శుక్రవారం జడ్పీ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్శి షా వారిని శాలువతో సత్కరించి మెమోంటో అందజేశారు. ప్రజా క్షేత్రంలో తిరిగే రాజకీయ నాయకులకు పదవీ విరమణ ఉండదని తాము నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాడుతూనే ఉంటామని పలువురు సభ్యులు పేర్కొన్నారు. జడ్పీ సీఈఓ రత్నమాల, మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్థన్ రాథోడ్, డీసీసీబీ ఛైర్మన్ భోజారెడ్డి, మిషన్ భగీరథ ఈఈ సురేష్ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని