logo

Adilabad: మాజీ ఎంపీ కుటుంబ సభ్యులకు పరామర్శ

అదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కుటుంబాన్ని భాజపా ఎమ్మెల్యే పాయల శంకర్ మంగళవారం ఉట్నూరులో పరామర్శించారు.

Updated : 02 Jul 2024 17:51 IST

ఉట్నూరు గ్రామీణం: అదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కుటుంబాన్ని భాజపా ఎమ్మెల్యే పాయల శంకర్ మంగళవారం ఉట్నూరులో పరామర్శించారు. ముందుగా రమేష్ చిత్రపటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రాథోడ్ రమేష్ తనయులు రితీష్ రాథోడ్, రాహుల్ రాథోడ్‌లను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాథోడ్ భాజపా పార్టీ కోసం ప్రజల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి ప్రజలకు, భాజపాకు తీరని లోటని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని