logo

బస్సు ప్రమాదంలోనే గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం

ఆదిలాబాద్ ఆర్టీసి బస్ స్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి ఘటనను పోలీసులు ఛేదించారు.

Published : 30 Jun 2024 12:46 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ ఆర్టీసి బస్ స్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి ఘటనను పోలీసులు ఛేదించారు. సీసీ పుటేజి ఆధారంగా నిర్మల్ ఆర్టీసి డిపోకు చెందిన బస్సు రాత్రి 8 గంటల ప్రాంతంలో బయలుదేరి వెళ్ళేప్పుడు ఆ వ్యక్తి పై నుంచి వెళ్లటంతోనే దుర్మరణం చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు బస్ డ్రైవర్‌పై ఆదివారం కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. కాగా మృతి చెందిన వ్యక్తి వివరాలు మాత్రం తెలియరాలేదు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని