logo

Adilabad: టేకు దుంగలు తరలిస్తున్న ఇద్దరిపై కేసు

అక్రమంగా టేకు దుంగలను తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాబ్సింగ్ తెలిపారు.

Published : 03 Jul 2024 18:01 IST

ఎదులాపురం: అక్రమంగా టేకు దుంగలను తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాబ్సింగ్ తెలిపారు. మూడు టన్నుల టేకు దుంగలను తరలిస్తున్న బొలెరో పికప్ వాహనాన్ని ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ వాహనంలో సుమారు రూ.40 వేల విలువైన టేకు దుంగలు ఉన్నట్లు అంచనా వేసినట్లు ఎఫ్ఆర్ఓ పేర్కొన్నారు. వీటిని రవాణా చేస్తున్న నిందితులు ఆదిలాబాద్ మండలం దహిగూడకు చెందిన సాకటి దస్రు, సిడం గంటులను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని