AP Election Results: ఏపీ చూపు.. ఉమ్మడి పశ్చిమగోదావరి వైపు.. ఇక్కడ అత్యధిక స్థానాలొచ్చిన పార్టీకే పట్టం
రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉద్దండుల నుంచి..సాధారణ స్థాయి కార్యకర్తల వరకు ఇప్పుడు అందరి చూపు గోదావరి జిల్లాల వైపే ఉంది. అందులోనూ ఉమ్మడి పశ్చిమ ఫలితాలపై ఆసక్తి ఎక్కువే.
ఈనాడు, ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉద్దండుల నుంచి..సాధారణ స్థాయి కార్యకర్తల వరకు ఇప్పుడు అందరి చూపు గోదావరి జిల్లాల వైపే ఉంది. అందులోనూ ఉమ్మడి పశ్చిమ ఫలితాలపై ఆసక్తి ఎక్కువే. ఇక్కడ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీకే అధికార పగ్గాలు దక్కడం ఆనవాయితీగా మారడం ఇందుకు కారణం. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడ నున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
దశాబ్దాల ఆనవాయితీ.. ఉమ్మడి పశ్చిమలో 2004 నుంచి ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఇక్కడ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతోంది. 2004లో 16 స్థానాలకు కాంగ్రెస్ 12 చోట్ల విజయం సాధించగా తెదేపా 4 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ అధికారం చేపట్టింది. 2009లో మొత్తం 15 స్థానాలకు 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా 5 చోట్ల తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. ఒక స్థానంలో ప్రజారాజ్యం గెలుపొందింది. మళ్లీ కాంగ్రెస్కే అధికార పగ్గాలు దక్కాయి. 2014 ఎన్నికల్లో 15 స్థానాల్లోనూ తెదేపా అభ్యర్థులు విజయం సాధించగా.. ఆ పార్టీకే అధికారం వరించింది. 2019లో 15 స్థానాలకు 13 వైకాపా..2 చోట్ల తెదేపా విజయం సాధించగా వైకాపా అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలా గత నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆనవాయితీగా మారింది.
ఉమ్మడి పశ్చిమ ఫలితమే కీలకం.. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఉమ్మడి పశ్చిమ ఎన్నికల ఫలితమే కీలకంగా భావిస్తున్నారు. మంగళవారం వెలువడే ఫలితాల్లోనూ ఇదే ఆనవాయితీ కొనసాగుతుందని నమ్ముతున్నారు. మా పార్టీకే ఎక్కువ సీట్లు అంటూ రెండు పార్టీల నాయకులు మొదలు కార్యకర్తల వరకు సవాళ్లు విసురుకుంటున్నారు. ఇదే అంశంపై రూ.కోట్లలో పందేలు పెట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ జిల్లాలుగా విడిపోయాక జిల్లాకు 7 చొప్పున మొత్తం 14 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో మరికొద్ది గంటల్లో తేలనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు గొప్పలు.. నేడు తిప్పలు!
[ 06-07-2024]
మొగల్తూరులో పెన్మత్స రంగరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇలా అసంపూర్తిగా మిగిలింది. ఇక్కడ సుమారు 600 మంది విద్యార్థులున్నారు. -
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం
[ 06-07-2024]
గత నెల 30న చేబ్రోల్-పూళ్ల స్టేషన్ల మధ్య 45 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది -
రేపటి నుంచి జగన్నాథస్వామి రథోత్సవాలు
[ 06-07-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వర సంతాన గోపాల జగన్నాథస్వామి ఆలయంలో కొలువైన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని రథోత్సవాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి -
అక్రమ కేసులపై తేల్చండి!
[ 06-07-2024]
గత వైకాపా పాలనలో తెదేపా, జనసేన శ్రేణులపై అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్ల మేరకు నమోదు చేసిన కేసులపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది -
రహదారుల వ్యవస్థ మెరుగుకు చర్యలు: కలెక్టర్
[ 06-07-2024]
జిల్లాలో రహదారుల వ్యవస్థను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు -
పింఛను సొమ్ముతో పరారైన కార్యదర్శికి రిమాండ్
[ 06-07-2024]
అతనో సచివాలయ కార్యదర్శి. అత్యాశతో ఆన్లైన్ గేమ్లతో అధికంగా సొమ్ము సంపాదించాలనుకున్నాడు ఇందుకు బాధ్యతలు మరిచి పేదలకు పంపిణీ చేసే పింఛను సొమ్మును సైతం అందులో పెట్టడానికి వెనుకాడలేదు. -
ఉరేసుకుంటున్నానంటూ ప్రియుడికి వీడియో కాల్
[ 06-07-2024]
ప్రియుడితో పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో శుక్రవారం చోటు చేసుకొంది. -
చెలరేగుతున్న మందుల మాఫియా
[ 06-07-2024]
ఉమ్మడి పశ్చిమలో అనధికారిక మందుల విక్రయం, వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. వైద్యుల సలహా లేకుండా గర్భ విచ్ఛిత్తి, మత్తు, లైంగిక సామర్థ్యం పెంచే మాత్రలు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. -
అందని చేయూత
[ 06-07-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారులకు చేయూత పథకం సాయం అందించేందుకు బటన్ నొక్కినా నేటికీ చాలా మంది బ్యాంకు ఖాతాలకు నగదు జమకాలేదు. -
సమగ్రంగా నివేదికల సమర్పణ: కలెక్టర్
[ 06-07-2024]
ప్రధానమంత్రి పురస్కారాలు-2023కు సంబంధించి కేంద్ర బృందానికి సమగ్ర నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. -
నేడు ఉద్యోగ మేళా
[ 06-07-2024]
ఏలూరు కలెక్టరేట్ ఆవరణలోని సెట్వెల్ కార్యాలయంలో జిల్లా ఉపాధి కల్పన, యువజన సేవల శాఖల ఆధ్వర్యాన శనివారం ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు తెలిపారు -
అక్రమ కేసులపై తేల్చండి!
[ 06-07-2024]
గత వైకాపా పాలనలో తెదేపా, జనసేన శ్రేణులపై అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్ల మేరకు నమోదు చేసిన కేసులపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది.