వీధి కుక్కలు ప్రాణాలు తీస్తున్నాయ్!
పల్లె, పట్టణం తేడాలేకుండా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారు.
తొర్రూరు, న్యూస్టుడే: పల్లె, పట్టణం తేడాలేకుండా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారు. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో సోమవారం జరిగిన ఘటనలో ముక్కుపచ్చలారని 42 రోజుల పసికందును పిచ్చికుక్క తీవ్రంగా గాయపరిచి ప్రాణాలు తీసింది. ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదోఒక ప్రదేశంలో జరుగుతూనే ఉన్నాయి. మనుషులతోపాటు మూగజీవాలపై దాడులకు పాల్పడుతూ ప్రాణాలను హరిస్తున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో కరిస్తే రేబీస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. శునకాల నియంత్రణకు సరైన ప్రణాళిక కూడా కరవైంది. శివారు కాలనీల్లో చనిపోయిన జంతువుల కళేబరాలను తింటూ మాంసానికి అలవాటు పడి, బాటసారులపై దాడి చేస్తున్నాయి.
గతంలో జరిగిన ఘటనలు..
డివిజన్ కేంద్రంలోని పాతకోర్టు సమీపంలోని పద్మశాలి కాలనీలో గతంలో అంకిత అనే విద్యార్థిని తీవ్రంగా గాయపరిచాయి. మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఓ వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచాయి. చింతలపల్లి, అమ్మాపురం, తొర్రూరులో దాడులకు పాల్పడ్డాయి. డివిజన్ కేంద్రంలోని అంబేడ్కర్ నగర్లో మంగళంపల్లి వెంకటేష్కు చెందిన గొర్రెను ఇంట్లో కట్టివేయగా శునకాలు ఇంట్లోకి చొరబడి దాడిచేసి చంపేశాయి. నిత్యం ఏదో ఒక గ్రామంలో సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
ఏబీసీ కేంద్రం ఆరంభ శూరత్వమేనా..
తొర్రూరు డివిజన్ కేంద్రంలోని సంత ఆవరణలో ఎబీసీ(ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్)ను ఏర్పాటు చేశారు. పట్టణంలో శునకాలను పట్టుకొని వాటికి కు.ని చికిత్స చేసి తిరిగి వదిలివేయాలి. దీంతో సంతతి తగ్గడంతో పాటు కరిచేగుణం మందగిస్తోంది. ప్రస్తుతం ఏబీసీ కేంద్రం మూతపడి ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. మున్సిపాలిటీ అధికారులు కూడా ఏబీసీపై శ్రద్ధచూపకపోవడంతో నిర్వీర్యమవుతున్నాయి.
శునకాల నియంత్రణకు చర్యలు..
- సిలార్సాహెబ్, ఎంపీడీవో, తొర్రూరు.
శునకాల నియంత్రణకు తగిన చర్యలు చేపడుతాం. వాటిని చంపవద్దనే నిబంధన ఉంది. పట్టుకొనే టీంలను పిలిపించి, తగిన చర్యలు తీసుకొంటాం. పట్టుబడిన కుక్కలను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి వదిలిపెట్టేలా చర్యలు తీసుకుంటాం. మడిపల్లిలో జరిగిన ఘటన విచారకరం. మళ్లీ జరగకుండా చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్యను కడతేర్చిన భర్త
[ 26-06-2024]
కట్టుకున్నవాడే కాలయముడు అయ్యాడు.. జీవితాంతం ప్రేమతో చూసుకోవాల్సిన భార్యను దారుణంగా కడతేర్చాడు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి హత్య చేశాడు.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని, ఓ గొర్రె పిల్లను సైతం చంపేసి.. ఆపై ఎవరో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చిత్రీకరించాడు. -
పునఃసృష్టి శిల్పం.. జీవకళ పదిలం..
[ 26-06-2024]
రామప్ప.. కాకతీయుల కాలం నాటి అత్యద్భుత ఆలయం.. ఎన్నో ప్రత్యేకతలకు నిలయం.. ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతిబింబం. చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు సాధించిన ఏకైక అద్భుతం.. కళాత్మక శిల్పాలతో అలనాటి వైభవాన్ని సగర్వంగా చాటుతోంది. -
ప్రజాభవన్ వైపు.. అర్జీదారుల చూపు
[ 26-06-2024]
సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజానీకానికి భరోసా ఇవ్వడం లేదు. జిల్లా పరిధిలో ఇప్పటివరకు 654 అర్జీలు పరిష్కారానికి నోచుకోక.. పెండింగ్లో ఉన్నాయి. -
జై భద్రకాళి.. జై తుల్జా భవానీ..
[ 26-06-2024]
ఉమ్మడి వరంగల్కు చెందిన ఇద్దరు ఎంపీలు మంగళవారం పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేశారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య తన ప్రమాణ స్వీకారం ప్రక్రియ పూర్తయ్యాక ‘జై భద్రకాళి’ అంటూ ఓరుగల్లు అమ్మవారిని స్మరించుకున్నారు. -
ఉత్తమ సేవ.. పతకాల పంట!
[ 26-06-2024]
పోలీస్ విధులు సాహసంతో కూడుకున్నవి.. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు.. ప్రజా సేవకు పాటుపడాలి.. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లు ఎదుర్కోవాలి. నేరస్థులను పట్టుకోవడంలో ధైర్య సాహసాలు, చాకచక్యం ప్రదర్శించాలి. -
ఆమ్యామ్యాలు ఇచ్చుకో.. తొలి జీతం పుచ్చుకో!
[ 26-06-2024]
రూ.8 లక్షల వరకు వసూలు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,100 మంది నర్సింగ్ ఆఫీసర్లు విధుల్లో చేరారు. వీరిలో దాదాపు 900 మందికి జీతాలు అందాయి. మిగిలిన వారికి త్వరలో రానున్నాయి. జీతం ఇవ్వడానికి ఇప్పటివరకు దాదాపు 400 మంది నుంచి సగటున రూ.2 వేల చొప్పున రూ.8 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. -
నెరవేరని పేదల సొంతింటి కల
[ 26-06-2024]
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత భారాస ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. లక్ష్యం బాగున్నా.. క్షేత్రస్థాయిలో వాటి నిర్మాణం, ఎంపిక మాత్రం ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. -
గుప్త నిధుల పేరుతో భారీ మోసం
[ 26-06-2024]
ఇంట్లో వరుసగా కుటుంబ సభ్యులు చనిపోతుండటంతో గుప్త నిధులు వెలికితీస్తే మరణాలు ఆగిపోతాయని ఓ ఘరానా మోసానికి పాల్పడిన నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న సంఘటన మంగళవారం జనగామ జిల్లా కొడకండ్ల మండల శివారులో చోటుచేసుకుంది. -
లింగ నిర్ధారణ పరీక్షలు.. ముఠా అరెస్టు
[ 26-06-2024]
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి స్కానింగ్ యంత్రం, ద్విచక్ర వాహనం, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. -
ప్రజా భవన్కు బారులు
[ 26-06-2024]
ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళ, శుక్రవారాల్లో హైదరాబాద్లోని ప్రజా భవన్లో చేపడుతున్న ప్రజావాణికి జిల్లా నుంచి బారులుదీరుతున్నారు. -
స్పందన సరే.. పరిష్కారమేది..?
[ 26-06-2024]
సమస్యలపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో హైదరాబాద్లోని జ్యోతిబాఫులే ప్రజాభవన్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో జిల్లా నుంచి అనేక మంది దరఖాస్తులను సమర్పిస్తున్నారు. -
మామను హతమార్చిన అల్లుడికి జీవిత ఖైదు
[ 26-06-2024]
మామను గొడ్డలితో నరికి చెరువులో పడేసి ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్లు చిత్రీకరించేందుకు యత్నించిన అల్లుడికి జీవితఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి మంగళవారం తీర్పుచెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
మీ చిరునవ్వుతో సభలో ఆనందం: ఓం బిర్లాపై మోదీ ప్రశంసలు
-
ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి బుజ్జగింపులు.. దిల్లీ నుంచి పిలుపు
-
కుప్పంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు
-
ముఖంపై కొట్టి.. అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య
-
దిల్లీ మద్యం కుంభకోణం.. సీబీఐ కస్టడీకి సీఎం కేజ్రీవాల్
-
వ్రజ్ ఐరన్ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి సహా పూర్తి వివరాలివే..