Andhra News: సినీఫక్కీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అపహరణ
తెర్లాం మండలం కునాయవలసకు చెందిన తెర్లి ఈశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈయన శుక్రవారం ఉదయపు నడక కోసం గ్రామ శివారులోని రాయిపల్లివారి చెరువు వద్దకు వచ్చారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు
పోలీసులకు వివరాలు చెబుతున్న బాధితుడు ఈశ్వరరావు
‘మీ ఇంటికి ఫోన్ చేసి రూ.50 లక్షలు తెమ్మని చెప్పాలంటూ తీవ్రంగా కొట్టారు. సొమ్ము తేకుంటే మా పెద్ద సారుకు అప్పగిస్తామని, ఆయన నీ శరీర అవయవాలు అమ్మేస్తాడని భయపెట్టారు.’ ఇంతలో ఉద్యోగి కేకలు వేయడంతో స్థానికులు విని దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎస్.కోటలో చోటుచేసుకుంది.
శృంగవరపుకోట, తెర్లాం, న్యూస్టుడే తెర్లాం మండలం కునాయవలసకు చెందిన తెర్లి ఈశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈయన శుక్రవారం ఉదయపు నడక కోసం గ్రామ శివారులోని రాయిపల్లివారి చెరువు వద్దకు వచ్చారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి కారు ఆగిపోయింది, సహకరించాలని కోరగా వెనుక నుంచి కారు నెడుతున్న ఈశ్వరరావుపై కర్రతో దాడి చేసి, కాళ్లు, చేతులు కట్టేశారు. నలుగురిలో ఒకరు అక్కడ ఉండిపోయి ముగ్గురు వ్యక్తులు అదే కారులో ఎస్.కోట మండలం ధర్మవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణం పక్కన ఉన్న వాటర్ ప్లాంటు వద్దకు తీసుకొచ్చారు. లోపలికి ఈశ్వరరావును తీసుకెళ్తుండగా రక్షించండంటూ కేకలు వేశాడు. స్థానికులు చేరుకుని ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఒకరు పరారయ్యాడు. పారిపోయిన వ్యక్తి వాటర్ ప్లాంటు నిర్వహిస్తున్న ఎస్.కోట మండలం రేవళ్లపాలేనికి చెందిన రాజశేఖర్గా, పట్టుబడిన వారు ఇతని వద్ద వాహన చోదకులు రేవళ్లపాలేనికి చెందిన గేదెల సత్యనారాయణ, ఎస్.కోటకు చెందిన అంబటి మోహనరావుగా గుర్తించామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.
అపహరణకు వినియోగించిన కారు
డబ్బుల కోసమే...
కునాయవలసలో తన ఇంటికి సమీపంలో ఉంటున్న కరుణాకర్ స్నేహితులతో కలసి డబ్బుల కోసమే ఈ పథకం పన్నాడని బాధితుడు చెప్పినట్లు ఎస్సై తెలిపారు. తీవ్ర గాయాలైన ఈశ్వరరావును ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స చేయించగా వైద్యులు విజయనగరం రిఫర్ చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఘటన తెర్లాం పోలీసు స్టేషను పరిధిలో జరగడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడికి కేసు బదిలీ చేయాలా, లేక ఇక్కడే దర్యాప్తు చేయాలా అన్నది నిర్ణయిస్తామని ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
[ 26-06-2024]
ప్రస్తుత వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ శాఖలు నిరంతరం అప్రమత్తంగా వుంటూ జిల్లాలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా అధికారులను ఆదేశించారు. -
ఘనంగా మాజీ మంత్రి జన్మదిన వేడుకలు
[ 26-06-2024]
విజయనగరంలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని..కిడ్నాప్ చేసి మూత్రం తాగించారు!
[ 26-06-2024]
మహిళలకు అసభ్యకరమైన సందేశాలు ఫోన్ ద్వారా పంపుతున్నాడని కోపంతో నగరానికి చెందిన వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి అతడికి మూత్రం తాగించి.. -
29 కిలోల గంజాయి స్వాధీనం
[ 26-06-2024]
విజయనగరం రైల్వే స్టేషన్లో జీఆర్పీˆ పోలీసులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
రాజుల కోటా వైకాపా కార్యాలయమా!
[ 26-06-2024]
అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికకు ఏ అనుమతులు లేవంటూ సీఎంగా అధికారం చేపట్టిన క్షణాల్లో కూల్చివేయించాడు జగన్. అలాంటి వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లాకో రాజదర్బార్ లాంటి వైకాపా కార్యాలయాలను నిర్మించాడు. -
జిల్లా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ
[ 26-06-2024]
జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతానని కొత్త కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. -
మంత్రికి నియోజకవర్గ సమస్యలపై వినతి
[ 26-06-2024]
వైకాపా హయాంలో వెనుకబాటుకు గురైన నెల్లిమర్ల నియోజకవర్గంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే లోకం మాధవి విన్నవించారు. -
గాల్లో తేలాలా.. నదిలో మునగాలా
[ 26-06-2024]
బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై కుంగిన వంతెన స్థానంలో కొత్త నిర్మాణానికి ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
నిధులివ్వకుండా .. ఆడిట్టా?
[ 26-06-2024]
గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు శాఖావర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆర్భాటమే మిగులు.. ఆచరణ కానరాలేదు
[ 26-06-2024]
వ్యవసాయంలో యాంత్రీకరణ విధానాన్ని తీసుకువచ్చి సాగు ఖర్చులు తగ్గిస్తామని, డ్రోన్ల విధానంతో రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని గత వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. -
చాలని భోజనం.. ఆకలితో అలమటించిన విద్యార్థులు
[ 26-06-2024]
బొబ్బిలి మండలంలోని పిరిడి ఉన్నత పాఠశాలలో చాలీచాలని భోజనంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. -
ఆస్తి తగాదా నుంచి ఆత్మహత్యాయత్నం దాకా..
[ 26-06-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ జంట మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీ వేణుగోపాల్తో భేటీ.. మనసు మార్చుకున్న జీవన్రెడ్డి
-
ఓవర్సీస్ ఛైర్మన్గా శామ్ పిట్రోడా పునర్నియామకం
-
టీచర్లపై అనవసర యాప్ల భారాన్ని తగ్గించాలి: మంత్రి లోకేశ్
-
రోహిత్ సేనకు ప్రపంచకప్ గెలిచే అర్హత ఉంది : పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
-
ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారికైనా శిక్షతప్పదు: ఈసీ
-
సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్.. మండిపడిన ఆప్