చరిత్ర తిరగరాసిన పంచకర్ల
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండున్నర నెలల ఉత్కంఠకు మంగళవారం తెరపడింది. ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు.
81,870 ఓట్ల మెజారిటీతో గెలుపు
పెందుర్తిలో కూటమికే పట్టం కట్టిన ఓటర్లు
పెందుర్తి, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండున్నర నెలల ఉత్కంఠకు మంగళవారం తెరపడింది. ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. అయిదు దశాబ్దాల పెందుర్తి నియోజకవర్గం చరిత్రలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు కొత్త చరిత్రను లిఖించారు. నియోజకవర్గం నుంచి రెండో సారి గెలిచిన అభ్యర్థిగా నిలిచారు. గతంలో ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి రెండో సారి గెలిచిన దాఖలాలు లేవు. ఆ సెంటిమెంటుకు పంచకర్ల ముగింపు పలికారు. జనసేన పార్టీ తరఫున బరిలో నిలిచిన పంచకర్ల రమేశ్బాబు భారీ స్థాయి మెజారిటీతో సమీప ప్రత్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజ్పై రికార్డు స్థాయిలో 81,870 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. పంచకర్ల అద్వితీయ విజయంతో కూటమి నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పెందుర్తిలోని తెదేపా కార్యాలయంలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు తినిపించుకుని వేడుక చేసుకున్నారు. ఎల్ఈడీ తెరపై ఫలితాల సరళిని తిలకించారు. లెక్కింపు ప్రారంభం నుంచి కూటమి అభ్యర్థుల మెజారిటీ పెరుగుతూ పోవడంతో కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
నగరంలోని నివాసం వద్ద అభిమానుల మధ్య విజయ చిహ్నం చూపుతున్న పంచకర్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాగ్రత్తలు పాటిస్తే జూలీతో జాలీయే..!
[ 06-07-2024]
జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సోకే వ్యాధులను జునొసిస్ వ్యాధులు అంటారు. ఈ వ్యాధులు సుమారు 280కి పైగా ఉన్నట్లు గుర్తించారు. -
వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం
[ 06-07-2024]
ఆంగ్లేయుల కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలతో వ్యవస్థీకృత (ఆర్గనైజడ్) నేరాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపడానికి అవకాశం ఉందని అనకాపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
పాఠశాలల్లో వసతులకు పెద్దపీట
[ 06-07-2024]
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం పాయకరావుపేటలోని పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. -
విశాఖ వ్యాలీలో బుజ్జి సందడి
[ 06-07-2024]
కల్కి సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన రోబోట్ కారు (బుజ్జి) శుక్రవారం విశాఖ వ్యాలీ పాఠశాలకు వచ్చి క్రీడా మైదానంలో చక్కర్లు కొట్టింది. దీంతో విద్యార్థులు కేరింతలతో సందడి చేశారు. -
గంజాయి కేసుల్లో నిందితులకు జైలు.. జరిమానా
[ 06-07-2024]
గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు, రూ. లక్ష జరిమానా విధిస్తూ పదో అదనపు జిల్లా జడ్జి నందనవనం శ్రీవిద్య శుక్రవారం తీర్పు ఇచ్చారని ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. -
‘ కిడ్నీ’ కేసు విచారణలో.. ప్రత్యేక బృందం
[ 06-07-2024]
సీతమ్మధారలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన కిడ్నీ మోసం కేసుపై సీపీ శంఖబ్రత బాగ్చీ ప్రత్యేక దృష్టి సారించారు. -
ఉక్కు సొసైటీకి రూ. 53 కోట్లు చెల్లించేదెప్పుడో..?
[ 06-07-2024]
ఉక్కు యాజమాన్యం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఉద్యోగులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే క్వార్టర్స్లో ఉండే వారికి విద్యుత్తు ఛార్జీలు యూనిట్కు రూ.0.50పైసల నుంచి రూ.8.14కి పెరిగాయి. -
జీవీఎంసీలో సిబ్బంది తగ్గిపోతున్నారు..
[ 06-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే నిధులు సర్దుబాటు చేయలేక సర్వీసును రెండేళ్లు పొడిగించారు. -
పోలీసు శాఖలో ఆర్ముడ్ రిజర్వ్ కీలకం
[ 06-07-2024]
ప్రతీ జిల్లాకు ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ చాలా ముఖ్యమైందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు బందోబస్తులో ఒక ఆయుధంగా పని చేస్తుందని నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. -
7న ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర
[ 06-07-2024]
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో ఈనెల 7న జగన్నాథుని రథయాత్ర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ విశాఖపట్నం అధ్యక్షులు సాంబాదాస్ తెలిపారు. -
అదివో జగన్నాథుడు.. అల్లదివో రథోత్సవం..
[ 06-07-2024]
పూరీ జగన్నాథస్వామి రథయాత్ర గురించి తెలియనివారు ఉండరు. విశాఖలో కూడా ఏటా ఆ తరహాలో జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. -
జగన్ ఐదేళ్ల మొక్కు‘బడి’ పాలన శాపమిది!
[ 06-07-2024]
వైకాపా పాలనలో పాఠశాలలను ఉద్ధరించినట్లు చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో మాత్రం అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. జగన్ అస్తవ్యస్త పాలనకు అద్దంపడుతున్నాయి. -
నూతన చట్టాల అమలులో గందరగోళం
[ 06-07-2024]
జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన నూతన నేర చట్టాలు గందరగోళానికి గురి చేసే ప్రమాదం ఉందని కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అభిప్రాయపడ్డారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్