logo

తిరుగులేని కూటమి.. తిరగలేని ఫ్యాన్‌..!

ఉత్కంఠకు తెర పడింది. 20 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జిల్లా ఓటర్ల తీర్పుతో వైకాపా నాయకులు నైరాశ్యంలో మునిగిపోయారు

Published : 05 Jun 2024 06:38 IST

జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు

మీసం మెలేస్తున్న అచ్చెన్నాయుడు
ఉత్కంఠకు తెర పడింది. 20 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జిల్లా ఓటర్ల తీర్పుతో వైకాపా నాయకులు నైరాశ్యంలో మునిగిపోయారు. కూటమి శ్రేణుల సంబరాల మాత్రం అంబరాన్నంటాయి. 8 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తల ఆనందం అంబరాన్నంటింది. ఎక్కడికక్కడ కేకులు కోశారు. శ్రీకాకుళం నగరంలో ఎంపీ కార్యాలయానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నృత్యాలతో సందడి చేశారు. రామ్మోహన్‌నాయుడిని సత్కరించి అభినందనలు తెలిపారు. 

​​​​​​​

నరసన్నపేట తెదేపా కార్యాలయం వద్ద కార్యకర్తల ఉత్సాహం

- న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం), బృందం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని