నేడు తేలనున్న భవితవ్యం
ఎన్నికల సంగ్రామంలో విజయం ఎవరిని వరించనుందో కొన్ని గంటల్లో తేలనుంది.
సోంపేట, న్యూస్టుడే: ఎన్నికల సంగ్రామంలో విజయం ఎవరిని వరించనుందో కొన్ని గంటల్లో తేలనుంది. 2014, 2019లలో విజయం సాధించిన తెదేపా అభ్యర్థి బెందాళం అశోక్.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కృషి చేయగా, తొలిసారి విజయం సాధించాలని వైకాపా అభ్యర్థి పిరియా విజయ ప్రచారం చేశారు. కాంగ్రెస్తో పాటు మొత్తం 9 మంది రంగంలో ఉన్నప్పటికీ తెదేపా, వైకాపాల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇద్దరు అభ్యర్థులు కవిటి మండలానికి చెందినవారు కావడం విశేషం. జనసేన, భాజపా కలిసి రావడంతో మంచి మెజారిటీతో మూడోసారి విజయకేతనం ఎగురవేయడం ఖాయమని తెదేపా వర్గీయులు.. ఇచ్ఛాపురంలో వైకాపా జెండా ఈ సారి ఎగురవేస్తామని వైకాపా శ్రేణులు ధీమాతో ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం పురపాలకసంఘంతో పాటు సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాలున్నాయి. ఇక్కడ 2,68,202 మంది ఓటర్లుండగా అందులో 1,30,751 మంది పురుషులు, 1,37,434 మంది మహిళలు 17మంది ఇతరులున్నారు. 299 పోలింగ్స్టేషన్లుండగా 14 టేబుళ్ల ద్వారా 22 రౌండ్లు లెక్కింపు జరగనుంది.
మహిళల ఓట్లే కీలకం ..
పలాస, న్యూస్టుడే: పలాస నియోజవర్గంలో కూటమి అభ్యర్థిగా గౌతు శిరీష, వైకాపా అభ్యర్థిగా సీదిరి అప్పల రాజు బరిలో ఉండగా మరి కొంత మంది పోటీ చేశారు. పలాస నియోజకవర్గంలో పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలంలో 1,07,278 మంది పురుషులు, 1,12,049 మహిళలు ఇతరులు 21 మంది కలిపి 2,19,248 ఓటర్లు ఉండగా 1,65,257 ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 76,839, మహిళలు 88,416 ఉన్నారు. ఈ లెక్కన మహిళలు11,577మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకోవటంతో పలాస అసెంబ్లీ అభ్యర్థి గెలుపులో మహిళల ఓట్లు కీలకం కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎత్తిపోతలకు ఊపిరి...
[ 06-07-2024]
అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ప్రతి ఎకరాకు సాగునీరందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళుతోంది. -
యథేచ్ఛగా తరలిపోతోంది..
[ 06-07-2024]
రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది. నూతన ఇసుక విధానం అమలుకు ఆదేశాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇసుకకు గిరాకీ ఉంది. -
చేయాల్సింది 960 చేసింది 184..!
[ 06-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. పలు చోట్ల సాధారణ ప్రసవాలు చేయదగినవాటిని సైతం రిఫరల్ కేసులుగా మార్చేస్తున్నారు. -
అదృశ్య కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
[ 06-07-2024]
చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ జి.ఆర్.రాధిక అధికారులను ఆదేశించారు. -
అమరావతి అభివృద్ధికి రూ.లక్ష విరాళం
[ 06-07-2024]
మంగళగిరి ఎయిమ్స్లో వైద్యుడిగా పనిచేస్తున్న గౌరీశంకర్ నాయుడు అమరావతి అభివృద్ధి కోసం తనవంతుగా రూ.లక్ష విరాళాన్ని అందించారు. -
జంతు ప్రేమికులారా.. జరభద్రం..!
[ 06-07-2024]
పెంపుడు జంతువులపై ప్రేమ, ఆప్యాయతను పెంచుకోవడం ఎంత అవసరమో అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇంకా తప్పనిసరి. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. -
ఆటోమొబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం
[ 06-07-2024]
ఎచ్చెర్ల మండలం కుశాలపురం బైపాస్ కూడలి వద్ద ఉన్న రాజరాజేశ్వరి ఆటో స్పేర్ పార్ట్స్ దుకాణంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. -
విద్యుత్తు సమస్యలుంటే 1912ను సంప్రదించండి
[ 06-07-2024]
వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఫోరం సేవలను వినియోగించుకోవాలని విద్యుత్తు వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) ఛైర్మన్ బి.సత్యనారాయణ కోరారు. -
ప్రత్యేక అవసరాల పిల్లలపై శ్రద్ధ
[ 06-07-2024]
ప్రత్యేక అవసరాలు గల చిన్నారులపై మరింత శ్రద్ధ కనబరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సహిత విద్య రాష్ట్ర సమన్వయకర్త ఎన్.అమ్మినాయుడు అన్నారు. గార మండలం కుమ్మరిపేట గ్రామంలోని భవిత కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. -
జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం
[ 06-07-2024]
జిల్లా వ్యాప్తంగా జగన్నాథస్వామి దేవాలయాల్లో రథయాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
-
గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది అధికారులు
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
-
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?