రెక్కలు ఊడిపోయాయి!
సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైకాపాకు ఘోర పరాభవం తప్పలేదు. 11 ఎమ్మెల్యే స్థానాల్లోనూ చిత్తుగా ఓడిపోయింది. విజయనగరం ఎంపీ నియోజకవర్గాన్ని సైతం కోల్పోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన ఆ పార్టీ.. ఈ సారి వచ్చిన ఫలితాల్లో బోల్తా కొట్టింది.
ఎన్నికల్లో వైకాపాకు ఘోరపరాభవం
11 స్థానాల్లోనూ అభ్యర్థుల ఓటమి
కూటమికి ఏకపక్షంగా ఓటర్ల మద్దతు
విజయనగరంలో ఆర్అండ్బీ బంగ్లా రహదారిలో ఫ్యానుకు తాడు కట్టి ఈడ్చుకెళ్తున్న యువకులు
ఈనాడు, పార్వతీపురం మన్యం, న్యూస్టుడే, విజయనగరం పట్టణం, సాలూరు, గరివిడి: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైకాపాకు ఘోర పరాభవం తప్పలేదు. 11 ఎమ్మెల్యే స్థానాల్లోనూ చిత్తుగా ఓడిపోయింది. విజయనగరం ఎంపీ నియోజకవర్గాన్ని సైతం కోల్పోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన ఆ పార్టీ.. ఈ సారి వచ్చిన ఫలితాల్లో బోల్తా కొట్టింది. ప్రభుత్వ విధానాలు నచ్చక ఓటర్లు మూకుమ్మడిగా పంకా రెక్కలు విరిచేశారు. కూటమి అభ్యర్థులకు ఏకపక్షంగా మద్దతు తెలిపారు.
ఇక్కడ కూడా..
కడుబండి శ్రీనివాసరావును శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలు నమ్మి గత ఎన్నికల్లో గెలిపించారు. ఈయనతో పాటు ప్రగతిని గాలికొదిలేశారని గజపతినగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, పాలకొండ ఎమ్మెల్యే కళావతిని ప్రజలు ఇంటికి పంపించారు. బొబ్బిలిలో శంబంగి వెంకట చిన అప్పలనాయుడును కాదని కూటమి అభ్యర్థి బేబినాయనను గెలిపించి మార్పు కోరుకున్నారు. కనీసం రాజాంలో ప్రధాన రోడ్డు విస్తరణ పూర్తి చేయలేకపోయారని వైకాపా ఎమ్మెల్యే కంబాల జోగులును పాయకరావుపేటకు బదిలీ చేశారు. ఈయనతో పాటు ఇక్కడ బరిలో ఉన్న రాజేశ్ను తిరస్కరించారు.
ఉప సభాపతికి షాక్
విజయనగరం నియోజకవర్గ ప్రజలు పూసపాటి అదితి గజపతిరాజునే అందలం ఎక్కించారు. ఆమె చేతిలో ఉప సభాపతి, వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి చిత్తుగా ఓడిపోయారు. మొదటి రౌండ్ నుంచి ఆయన పతనం ప్రారంభమైంది. గెలుపు తనదేనని ధీమాతో ఉన్న ఆయన ఊహించని ఫలితంతో కంగుతిన్నారు.
రాజన్నకు చుక్కెదురు
కోర్టు తీర్పుతో 2006లో సాలూరు ఎమ్మెల్యే పదవిని పీడిక రాజన్నదొర దక్కించుకున్నారు. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. తాజాగా ప్రజా తీర్పుతో ఓటమి పాలయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణిపై పరాజయం చెందారు. అయిదో రౌండు ఫలితాలు ప్రకటించిన తర్వాత కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈయన 13,733 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
సాగనంపారు..
రాజన్నదొరకు ముందు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ స్థానం నుంచి రెండు సార్లు ప్రజలు గెలిపించగా, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపలేదని ప్రజలు ఆగ్రహించారు. దీంతో ఆమెను ఓడించి తెదేపా నుంచి బరిలో దిగిన గిరిజన బిడ్డ అయిన జగదీశ్వరిని గెలిపించారు.
మంత్రులైతే ఓటమే
పార్వతీపురం డివిజన్లో కలిసిరాని పదవులు
పార్వతీపురం, న్యూస్టుడే: పూర్వ విజయనగరం జిల్లాలోని పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో మంత్రులుగా చేసిన పలువురు తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందడం ఆనవాయితీగా మారింది. రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన వారంతా అమాత్యులు అయ్యాక వారి ప్రభ మసకబారింది. తాజాగా ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఉప ముఖ్యమంత్రి పి.పుష్పశ్రీవాణి ఓటమి తర్వాత ఈ సెంటిమెంట్ మరింత బలపడింది.
పార్వతీపురం డివిజన్ పరిధిలో నాగూరు (కురుపాం), పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాలు ఉండేవి.
- సాలూరు నియోజకవర్గం నుంచి బోయిన రాజయ్య ఒకసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు.
- బొబ్బిలి నియోజకవర్గం నుంచి పి.జగన్మోహన్రావు, సుజయ్ కృష్ణ రంగా రావు మంత్రులుగా కొలువుదీరారు.
- పార్వతీపురం నుంచి చీకటి పరశురాంనాయుడు మంత్రిగా పనిచేశారు.
- ఇదే నియోజకవర్గం నుంచి శత్రుచర్ల విజయరామరాజు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవిని అధిరోహించారు. ఒకసారి పనిచేసిన తర్వాత ఈయన జిల్లా రాజకీయాల నుంచే నిష్క్రమించారు.
- ఇక పార్లమెంటు సభ్యుల్లో అరకు ఎంపీగా పనిచేసిన కిశోర్ చంద్రదేవ్ యూపీఏ పాలనలో కేంద్రమంత్రి అయ్యారు. తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయంగా చోటుచేసుకున్న మార్పులతో రాజకీయాలకు దూరమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మా.. నేనేం పాపం చేశా..
[ 06-07-2024]
భీమసింగిలో తినుబండారాల దుకాణం నిర్వహిస్తున్న ఓ మహిళ శుక్రవారం ఉదయం స్థానిక ప్రధాన రహదారిపై వెళ్తుండగా రోడ్డు పక్కనున్న తుప్పల్లో నుంచి ఓ పసికందు ఏడుపు వినిపించింది. -
వసతులు మృగ్యం.. విద్యార్థులకు శాపం..
[ 06-07-2024]
సాలూరు మండలంలోని మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి పది వరకు తరగతులు ఉన్నా గదులు సరిపోవడం లేదు. ఇక నాలుగు తరగతులు వరండాల్లో నిర్వహిస్తున్నారు. -
విధుల్లోకి తీసుకోరూ..
[ 06-07-2024]
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులను ఈ ఏడాది విధుల్లోకి తీసుకోవాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ డిమాండు చేశారు. -
ఇది అపోహల వరుస
[ 06-07-2024]
ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈకేవైసీ లేకపోతే ఇబ్బందులు పడతామేమోననే అపోహలతో మహిళలు -
ఖరీఫ్తో కొత్త వంగడాలు
[ 06-07-2024]
ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఆర్జీఎల్ రకం విత్తనాలను రైతులు పండిస్తున్నారు. వీటిని కూడా రాగోలు కేంద్రంలో రూపొందించారు. ఇవి తినేందుకు బాగున్నప్పటికీ కొంచెం ముతకగా ఉంటాయనే భావన ప్రజల్లో ఉంది. -
సిఫార్సు బదిలీలకు చెల్లుచీటీ
[ 06-07-2024]
గత ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల్లో సిఫార్సులకే పెద్దపీట వేసింది. దీనికి సంబంధించి ఎన్నికల ముందు ఓ మాజీ మంత్రి రూ.కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. -
అడుగడుగునా అవాంతరాలు
[ 06-07-2024]
చీపురుపల్లిలో పూర్తికాని ఆర్వోబీ వాహనదారులకు ముప్పు తిప్పలు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాకు వెళ్లేందుకు చీపురుపల్లిలోని విజయనగరం- పాలకొండ ప్రధాన రహదారి కీలకం. -
మృత్యుపాశాలకు చిక్కిన బంధం
[ 06-07-2024]
ఎన్నో ఇబ్బందులు పడి కుమార్తెకు వివాహం చేశారు.. అష్టకష్టాలకోర్చి కుమారుడ్ని చదివిస్తున్నారు.. ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకున్న తరుణంలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకున్నారు.. -
రైలు ఢీకొని వ్యవసాయ కూలీ మృత్యువాత
[ 06-07-2024]
గుర్తు తెలియని రైలు ఢీకొని ఓ వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన బాడంగి మండలంలో చోటుచేసుకుంది. రైల్వే హెచ్సీ ఈశ్వరరావు వివరాల మేరకు గొల్లాది గ్రామానికి చెందిన ఎం.పోలీసు(48) శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో పొలం పనులకు వెళ్లేందుకు బయలుదేరారు. -
కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
[ 06-07-2024]
అనారోగ్యం కారణంగా ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పాలకొండలో చోటుచేసుకుంది. గారమ్మకాలనీకి చెందిన జి.మాధవి(34) కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది.