జహీరాబాద్లో జయమెవరిదో..
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికల ఫలితాలు నేడు (మంగళవారం) వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాకేంద్రం సమీపంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఉదయం 8 గంటలకు జహీరాబాద్ లోక్సభ ఓట్లు లెక్కించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది
నేడు లోక్సభ ఎన్నికల ఫలితాలు
ఓట్ల లెక్కింపునకు సిద్ధం చేసిన టేబుళ్లు
ఈనాడు, కామారెడ్డి: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికల ఫలితాలు నేడు (మంగళవారం) వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాకేంద్రం సమీపంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఉదయం 8 గంటలకు జహీరాబాద్ లోక్సభ ఓట్లు లెక్కించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డారు. మొదట త్రిముఖ పోరు నెలకొన్నా పోలింగ్ నాటికి ద్విముఖ పోరుగా మారిందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో విజయం ఎవరిని వరిస్తుందోనని దానిపై నెలకొన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది.
14 టేబుళ్లు..
నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను మొత్తం 145 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో అసెంబ్లీకి 14 టేబుళ్లు ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపడుతున్నారు. జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాల ఫలితాలు 19 రౌండ్లలో తేలనుండగా.. ఎల్లారెడ్డి 20, నారాయణఖేడ్ 22, అందోల్, జహీరాబాద్ ఫలితాలు 23 రౌండ్లలో వెల్లడికానున్నాయి.
క్షుణ్ణంగా తనిఖీ చేశాకే..
కౌంటింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల అనుచరులు భారీగా గుమిగూడే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్నికల సంఘం జారీచేసిన పాస్లు ఉన్నవారినే మాత్రమే అనుమతించనున్నారు. ఒక్కో టేబుల్కు ఒక ఏజెంట్ చొప్పున రాజకీయ పార్టీల ఏజెంట్లకు పాస్లు జారీచేశారు. వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపించనున్నారు.
ఏజెంట్ పాస్లకు డిమాండ్
లెక్కింపు సందర్భంగా స్వతంత్ర, ఇతర పార్టీల చెందిన అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల పాస్లకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన పార్టీల వారు ఏజెంట్ ఫారాలను కొనుగోలు చేసి స్వతంత్ర, ఇతర పార్టీల అభ్యర్థుల స్థానంలో తమకు చెందిన వారిని పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
కామారెడ్డిపై అందరి దృష్టి..
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఆధిక్యం వస్తుందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారాస అధినేత కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డిలను ఓడించి భాజపా అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. అయితే ఇక్కడ పట్టుసాధించేందుకు కాంగ్రెస్ చేరికలను ప్రోత్సహించింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రచారం చేపట్టారు. భాజపా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సైతం తన పట్టు సడలకుండా ఉండేందుకు పార్టీశ్రేణులను సమాయత్తం చేస్తూ ప్రచారవ్యూహాలను అమలుచేశారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఆధిక్యం వస్తుందోననే చర్చ సాగుతోంది.
సర్వం సిద్ధం
కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్టుడే: జహీరాబాద్ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఎన్నికల సిబ్బందికి, ఏఆర్వోలకు కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు గోపాల్ జి తివారి, ప్రదీప్సింగ్ సంగ్వాత్లు పాల్గొన్నారు.
ఎవరి ధీమా వారిదే..
2014, 2019 ఎన్నికల్లో భారాస నుంచి గెలుపొందిన బీబీపాటిల్ సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపాలో చేరి బరిలోకి దిగారు. హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించారు. లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కామారెడ్డిలో మాత్రమే భాజపా ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన చోట్ల ద్వితీయ శ్రేణి నేతలపైనే ఆధారపడి ప్రచారం చేపట్టారు. మోదీ ఇమేజ్తో పాటు రెండుసార్లు ఎంపీగా చేసిన పనులే తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన సురేష్ షెట్కార్ మరోసారి గెలిచేందుకు ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్, నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండడం తనకు కలిసివస్తుందనే భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై వ్యతిరేకత తనకు అనుకూలిస్తుందనే ఆశాభావంతో భారాస అభ్యర్థి గాలి అనిల్కుమార్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
[ 06-07-2024]
భారత స్టార్ మహిళా బాక్సర్, ఇందూరు క్రీడాకారిణి నిఖత్ జరీన్ మరో కీర్తి కిరీటాన్ని సాధించింది. ఈనెల 26 నుంచి పారిస్లో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించడానికి ఆమె అర్హత సాధించింది. -
అసంపూర్తి పనులు.. విద్యార్థుల అవస్థలు
[ 06-07-2024]
గత ప్రభుత్వం పాఠశాలల్లో అత్యున్నత వసతులు కల్పిస్తామని ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమాలు తీసుకొచ్చింది. నిధుల లేమితో గుర్తించిన పనుల్లో 30 శాతానికి మించి పూర్తికాలేదు. -
ఆషాఢం.. గ్రామదేవతలకు బోనం
[ 06-07-2024]
ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభం.. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశం.. వర్షాలు కురుస్తూ.. పచ్చదనం కనువిందు చేసే అరుదైన సందర్భం ఆషాఢం.. విశేషంగా గ్రామదేవతలను పూజించే మాసం.. మహిళలు గోరింటాకుతో మెహందీ వేడుకలు జరుపుకొనే కార్యక్రమాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయి. -
అట్టహాసంగా వన మహోత్సవం
[ 06-07-2024]
మాచారెడ్డి మండలంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం అట్టహాసంగా చేపట్టారు. రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సీసీఎఫ్ (బాసర సర్కిల్) శ్రావనన్, కామారెడ్డి డీఎఫ్వో నికిత తదితరులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. -
గుంతలు పూడ్చారు
[ 06-07-2024]
బీబీపేట ప్రయాణ ప్రాంగణ ఆవరణలో మట్టి రోడ్డు గుంతలుగా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఈనాడులో ఈ నెల 5న ‘బస్టాండు చెంత...గుంతలే అంతా’ శీర్షికన ఫొటోతో సమస్య ప్రచురితమైంది. -
కలెక్టరేట్ ముట్టడికి యత్నం
[ 06-07-2024]
జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నాయకులు శుక్రవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. -
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కోటగిరి వాసి ఓటమి
[ 06-07-2024]
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కోటగిరి వాసి కన్నెగంటి చంద్రమోహన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఫలితాల్లో మూడో స్థానానికి పరిమితమయ్యారు. -
ఆషాఢ బోనం.. అమ్మకు ప్రీతికరం
[ 06-07-2024]
శివాయిపల్లిలో గ్రామదేవతలకు సామూహికంగా నిర్మించిన ఆలయాలుకొండ, న్యూస్టుడే: ఆషాఢమాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ప్రకృతిశక్తికి ప్రతిరూపంగా భావించే జగజ్జననికి నెలపాటు నివేదన, బోనం, సమర్పణ చేసే పుణ్య మాసం ఇది. పల్లె, పట్నం తేడా లేకుండా అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. -
పర్యాటక శోభ ఒనగూరేనా..?
[ 06-07-2024]
రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు, జలాశయాలను ఎకో-టూరిజం(పర్యావరణ పర్యాటక) ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం జలాశయంతో పాటు సమీపంలోని అభయారణ్యాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు అటవీ అభివృద్ధిశాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. -
నియంత్రికల ధ్వంసం.. నియంత్రణ శూన్యం
[ 06-07-2024]
ఇలా.. తరచూ ఎక్కడో ఓ చోట నియంత్రికల్ని ధ్వంసం చేసి సామగ్రి ఎత్తుకెళ్లిన ఘటనలు జరుగుతున్నాయి. ఈ చోరీలు విద్యుత్తుశాఖ, రైతులు, పోలీసులకు సవాలుగా మారుతుండటంతో పాటు ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. -
ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం
[ 06-07-2024]
కుటుంబ కలహాలతో ఓ మహిళ (38) తన ఇద్దరు పిల్లలతో బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
-
గుంతకల్లు రైల్వే DRM ఆఫీస్లో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది