దిల్లీకి వెళ్లేదెవరు?
లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసి 21 రోజులైంది. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఏ వర్గాలు ఎవరికి ఓట్లు వేశాయి? దిల్లీలో చట్టసభకు వెళ్లే అవకాశం ఎవరికిచ్చారో? ఈ రోజుతో తేలిపోనుంది.
నిజామాబాద్ లోక్సభ ప్రజాతీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
ఈనాడు, నిజామాబాద్: లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసి 21 రోజులైంది. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఏ వర్గాలు ఎవరికి ఓట్లు వేశాయి? దిల్లీలో చట్టసభకు వెళ్లే అవకాశం ఎవరికిచ్చారో? ఈ రోజుతో తేలిపోనుంది. గత నెల 13న పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. పోటాపోటీని తలపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా రెండు పార్టీలకు ఎక్కువగా ఓట్లు పడ్డాయనే అంచనాలు వేస్తున్నారు. కానీ, మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం గెలుపుపై ధీమాతో ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయంటూ ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
విలక్షణ తీర్పులే..
నిజామాబాద్ స్థానం విలక్షణ తీర్పులకు పెట్టింది పేరు. ప్రతి ఎన్నికలోనూ ఫలితంపై ఇక్కడ ఉత్కంఠ ఉంటుంది. దీని పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో నవంబరులో ఎన్నికల ఫలితాల సరళిని చూసినా ఇదే అవగతమవుతుంది. ఏడు సెగ్మెంట్లలో మూడు భారాస, రెండేసి స్థానాల్లో భాజపా, కాంగ్రెస్లకు దక్కాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే రాజకీయ పరిణామాలు, పరిస్థితులు భిన్నంగా ఉంటాయనేది విశ్లేషకుల వాదన. అసెంబ్లీ ఫలితాలకు, లోక్సభ ఎన్నికలకు సంబంధం లేకున్నా.. విలక్షణ తీర్పునిచ్చే ఆలోచన ఓటర్లలో స్పష్టంగా కనిపించింది. 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా..ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉండనుంది. అయితే జాతీయ పార్టీల మధ్య మరింత పోటాపోటీగా ఉండే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
ఈ సారి పోటాపోటే
రౌండ్ల వారీగా వచ్చే మెజారిటీలూ తక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. పోలింగ్ సరళి ఆధారంగా వేస్తున్న అంచనాలతో ఒక అసెంబ్లీ స్థానంలో ఒక పార్టీకి ఆధిక్యం వస్తే..మరో అసెంబ్లీ స్థానంలో వేరే పార్టీ సత్తాచాటే అవకాశం ఉందంటున్నారు. మిగతా లోక్సభ స్థానాల్లో భారీ మెజారిటీలు ఉండొచ్చు. కానీ, హోరాహోరీ పోరు సాగిన ఇందూరులో భిన్నంగా ఉండనుందని చెప్పుకొంటున్నారు. చివరి రెండు రౌండ్ల వరకు ఫలితం కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు.
ఎవరి అంచనాలు వారివి..
ఫలితంపై మూడు ప్రధాన పార్టీలు ధీమాతో ఉన్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని భాజపా నేతలు చెబుతున్నారు. నిజామాబాద్ గ్రామీణం, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్లలో మంచి మెజారిటీ వస్తుందని విశ్లేషిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్లోనూ స్వల్ప ఆధిక్యం ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మోదీ పాలన, రామమందిర సమస్య పరిష్కార అంశాలు అజెండాగా ఎన్నికలు జరిగాయని.. తమదే గెలుపు ఖాయమంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సైతం స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెబుతోంది. జగిత్యాల, బోధన్, నిజామాబాద్ అర్బన్లో ఆధిక్యత వస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. బాల్కొండ, కోరుట్లలో గట్టి పోటీ ఉందని, మూడుచోట్ల వచ్చే ఆధిక్యతతో విజయం వరిస్తుందన్నారు. కేంద్రంలో భాజపా పాలన, కాంగ్రెస్ తొలి ఐదు నెలల్లో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంతో పాటు సంక్షేమ పథకాలు అందించిన తమను ఆదరిస్తారని భారాస నేతలు ధీమాతో ఉన్నారు. ఎవరి విశ్లేషణలు ఎలాగున్నా.. మరి కొన్ని గంటల్లో ఇందూరు నుంచి దిల్లీకి వెళ్లేదెవరో? తేలనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
[ 06-07-2024]
భారత స్టార్ మహిళా బాక్సర్, ఇందూరు క్రీడాకారిణి నిఖత్ జరీన్ మరో కీర్తి కిరీటాన్ని సాధించింది. ఈనెల 26 నుంచి పారిస్లో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించడానికి ఆమె అర్హత సాధించింది. -
అసంపూర్తి పనులు.. విద్యార్థుల అవస్థలు
[ 06-07-2024]
గత ప్రభుత్వం పాఠశాలల్లో అత్యున్నత వసతులు కల్పిస్తామని ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమాలు తీసుకొచ్చింది. నిధుల లేమితో గుర్తించిన పనుల్లో 30 శాతానికి మించి పూర్తికాలేదు. -
ఆషాఢం.. గ్రామదేవతలకు బోనం
[ 06-07-2024]
ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభం.. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశం.. వర్షాలు కురుస్తూ.. పచ్చదనం కనువిందు చేసే అరుదైన సందర్భం ఆషాఢం.. విశేషంగా గ్రామదేవతలను పూజించే మాసం.. మహిళలు గోరింటాకుతో మెహందీ వేడుకలు జరుపుకొనే కార్యక్రమాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయి. -
అట్టహాసంగా వన మహోత్సవం
[ 06-07-2024]
మాచారెడ్డి మండలంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం అట్టహాసంగా చేపట్టారు. రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సీసీఎఫ్ (బాసర సర్కిల్) శ్రావనన్, కామారెడ్డి డీఎఫ్వో నికిత తదితరులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. -
గుంతలు పూడ్చారు
[ 06-07-2024]
బీబీపేట ప్రయాణ ప్రాంగణ ఆవరణలో మట్టి రోడ్డు గుంతలుగా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఈనాడులో ఈ నెల 5న ‘బస్టాండు చెంత...గుంతలే అంతా’ శీర్షికన ఫొటోతో సమస్య ప్రచురితమైంది. -
కలెక్టరేట్ ముట్టడికి యత్నం
[ 06-07-2024]
జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నాయకులు శుక్రవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. -
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కోటగిరి వాసి ఓటమి
[ 06-07-2024]
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కోటగిరి వాసి కన్నెగంటి చంద్రమోహన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఫలితాల్లో మూడో స్థానానికి పరిమితమయ్యారు. -
ఆషాఢ బోనం.. అమ్మకు ప్రీతికరం
[ 06-07-2024]
శివాయిపల్లిలో గ్రామదేవతలకు సామూహికంగా నిర్మించిన ఆలయాలుకొండ, న్యూస్టుడే: ఆషాఢమాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ప్రకృతిశక్తికి ప్రతిరూపంగా భావించే జగజ్జననికి నెలపాటు నివేదన, బోనం, సమర్పణ చేసే పుణ్య మాసం ఇది. పల్లె, పట్నం తేడా లేకుండా అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. -
పర్యాటక శోభ ఒనగూరేనా..?
[ 06-07-2024]
రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు, జలాశయాలను ఎకో-టూరిజం(పర్యావరణ పర్యాటక) ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం జలాశయంతో పాటు సమీపంలోని అభయారణ్యాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు అటవీ అభివృద్ధిశాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. -
నియంత్రికల ధ్వంసం.. నియంత్రణ శూన్యం
[ 06-07-2024]
ఇలా.. తరచూ ఎక్కడో ఓ చోట నియంత్రికల్ని ధ్వంసం చేసి సామగ్రి ఎత్తుకెళ్లిన ఘటనలు జరుగుతున్నాయి. ఈ చోరీలు విద్యుత్తుశాఖ, రైతులు, పోలీసులకు సవాలుగా మారుతుండటంతో పాటు ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. -
ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం
[ 06-07-2024]
కుటుంబ కలహాలతో ఓ మహిళ (38) తన ఇద్దరు పిల్లలతో బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్