ఆఖరి ఘట్టం.. ఎవరికో పట్టం!
మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. స్ట్రాంగ్ రూముల్లో 22 రోజులుగా దాగి ఉన్న అభ్యర్థుల భవితవ్యం నేడు వెల్లడికానుంది.
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేకంగా టేబుళ్లు
మధ్యాహ్నం 2 గంటలకు తొలి ఫలితం
ఈనాడు, నెల్లూరు
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద బందోబస్తు
మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. స్ట్రాంగ్ రూముల్లో 22 రోజులుగా దాగి ఉన్న అభ్యర్థుల భవితవ్యం నేడు వెల్లడికానుంది. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి మొదలుకానుంది. మధ్యాహ్నానికి ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపారన్న విషయంపై స్పష్టత రానుంది. అధికారికంగా.. మంగళవారం రాత్రికి ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 115 మందిలో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయనే విషయం వెల్లడవుతుంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో మొత్తం 15,48,183 ఓట్లు పోలవగా- అందులో పురుషులు 7,63,894, స్త్రీలు 7,84,219 ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి సర్వీసు ఓట్లు 24,223, హోం ఓటింగ్లో 870 ఓట్లు, దివ్యాంగుల ఓట్లు 753 ఉన్నాయి. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. నాలుగు రౌండ్లలో వీటి ఫలితం వెల్లడికానున్నాయి.
వీవీ ప్యాట్లనూ లెక్కిస్తారు
ఓట్ల లెక్కింపు కోసం 1110 మంది అధికారులతో పాటు పోలీసులు, సహాయకులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం 3వేల మందిని నియమించారు. 17 హాళ్లలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఏదైనా పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఈవీఎం పనిచేయకపోతే.. వీవీప్యాట్ డబ్బాలోని చీటీలను లెక్కిస్తారు. అన్ని ఈవీఎంలు సవ్యంగా పనిచేస్తే.. మరో రకంగా వీవీప్యాట్ చీటలను లెక్కిస్తారు. ఏవైనా అయిదు పోలింగ్ కేంద్రాల వీవీ ప్యాట్ల డబ్బాలు తీసుకుని.. ఆయా కేంద్రాల్లో ఈవీఎంల ఫలితాన్ని సరిపోల్చుతారు.
ఇలా మొదలు..
నిఘా నీడలో..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిఘా నీడలో జరుగుతుంది. సీసీ కెమెరాల్లోనూ నమోదవుతుంది. టేబుళ్ల వద్ద ఒక రౌండ్ లెక్కింపు పూర్తవగానే.. సూక్ష్మ పరిశీలకులు ఫలితం నివేదికపై ఏజెంట్ల సంతకం తీసుకుని ఆర్వోకు ఇస్తారు. అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల పరిశీలకులు కూడా ఉంటారు. వీరంతా సూక్ష్మ పరిశీలకులు ఇచ్చిన నివేదికను పరిశీలించి.. సవ్యంగా ఉందనుకున్నాక ధ్రువీకరిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫలితాన్ని నివేదిస్తారు. మొదటిసారి పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేశారు.
మొదటి ఫలితం.. నెల్లూరు సిటీదే..
పోలింగ్ కేంద్రాల సంఖ్య నెల్లూరు నగరంలో అత్యల్పం. దీంతో ఇక్కడ లెక్కింపు త్వరగా పూర్తవుతుంది. ఇక్కడ మొత్తం 248 పోలింగ్ కేంద్రాలు ఉండగా- మధ్యాహ్నం 2 గంటలకు ఫలితం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కందుకూరు, ఆత్మకూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈసీ ఆదేశాలను తప్పకుండా పాటించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లకు వివరించాం. ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. చిన్న సందేహమున్నా.. వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ హాళ్లలోకి సెల్ఫోన్లకు అనుమతి లేదు. విధుల్లో ఉండే అధికారులు, సిబ్బందికి ఆహారం, తాగునీరు, స్నాక్స్ అందుబాటులో ఉంచాం. ఈసీఐ నిబంధనలు పాటిస్తూ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అభ్యర్థులు, ఏజెంట్లు అధికారులకు సహకరించాలి.
హరినారాయణన్, కలెక్టర్
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. గొడవలు, విద్వేషాలు, అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుంది. ప్రజలు గుంపులుగా ఉండకూడదు. ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, డీజే మోతలు, బాణసంచా కాల్చడానికి అనుమతి లేదు. వాహనాలను జడ్పీ హైస్కూల్లో నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే ఉంచాలి.
కె.ఆరీఫ్ హఫీజ్, ఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత
[ 05-07-2024]
ఇసుక మాఫియాపై కోవూరు పోలీసులు కొరడా ఝులిపించారు. వరుసగా రెండు రోజులు తనిఖీలు చేసిన ఇసుక ట్రాక్టర్, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. -
గురుకులంపై ఆశ.. సీట్లు లేక నిరాశ
[ 05-07-2024]
జిల్లాలోని గురుకులాల్లో చదువుకోవాలనే ఆసక్తితో పేద విద్యార్థులు వందల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు -
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా దొంగతనాలు
[ 05-07-2024]
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
యువత.. క్రీడల్లో ఘనత
[ 05-07-2024]
పట్టణంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో చదువుతున్న వారు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు. -
ఖాతాదారుల ఆర్డీ నగదు రూ.10 లక్షలు స్వాహా
[ 05-07-2024]
మండలంలోని పుల్లాయపల్లి బ్రాంచి ఫోస్టాఫీసులో ఖాతాదారులు దాచుకున్న సుమారు రూ. 10 లక్షల ఆర్డీ నగదు పోస్టుమాస్టర్ షేక్ నాయబ్ రసూల్ స్వాహా చేసి పరారయ్యారు. ఈవిషయం గురువారం వెలుగులోకి వచ్చింది -
అనుమతి.. మాకెందుకది!
[ 05-07-2024]
కాస్త పెట్టుబడి.. కొంత పరిచయాలు ఉంటే చాలు.. అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తవచ్చనే ఆలోచనతో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. -
ఇదిగో పులి.. కారిడార్ జాడేది?
[ 05-07-2024]
టైగర్ కారిడార్ ప్రతిపాదనలకే పరిమితమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి తిరుమల కొండల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆశించిన మేరకు అడుగులు పడలేదు -
నిర్లక్ష్యానికి.. ఏదీ ‘మాత్ర’?
[ 05-07-2024]
సకాలంలో, సక్రమంగా వినియోగిస్తే రోగుల పాలిట సంజీవినులయ్యే పలు ఔషధాలు.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఏళ్లుగా ఆసుపత్రుల గదుల్లోనే మగ్గి కాలం చెల్లిపోతుండగా- ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని గుట్టుగా కాల్చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి -
భూములిస్తే.. పరిహాసమా!
[ 05-07-2024]
పరిహారం అందకపోవడంపై ఆవేదనజిల్లాల అశాస్త్రీయ పునర్విభజన సమస్య కందుకూరును వెంటాడుతూనే ఉంది. -
నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలి
[ 05-07-2024]
నీట్ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ డిమాండ్ చేశారు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘బింబిసార’కు ప్రీక్వెల్గా పార్ట్2.. డైరెక్టర్ ఎవరంటే!
-
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
-
కేసీఆర్పై విశ్వాసం లేకే కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?