భూముల విలువ పెంపునకు కసరత్తు
భూముల మార్కెట్ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో క్షేత్రస్థాయిలో సబ్రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు అధ్యయనం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ పెంపు ఉండాలని సర్కారు పెద్దల ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల అధ్యయనం
ఈనాడు, నల్గొండ
భూముల మార్కెట్ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో క్షేత్రస్థాయిలో సబ్రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు అధ్యయనం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ పెంపు ఉండాలని సర్కారు పెద్దల ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా కేంద్రాలైన నల్గొండ, భువనగిరి, సూర్యాపేటల్లో వాస్తవ ధరలకు, మార్కెట్ వెలలకు భారీ వ్యత్యాసం ఉందని గుర్తించి వాటి అంతరాన్ని తగ్గించే విధంగా చర్యలు మొదలుపెట్టారు.
వారంలో ప్రభుత్వానికి నివేదిక
మండల స్థాయిలో భూముల విలువ పెంపుపై సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లతో కూడిన సమన్వయ కమిటీ అధ్యయనం తుది దశకు చేరుకుంది. మండల, పురపాలిక, డివిజన్, జిల్లా కేంద్రాల స్థాయిలో డిమాండ్ ఉన్న సర్వే నెంబర్లేవీ, వాటిలో ప్రస్తుతం ఎంత విలువ ఉంది? బహిరంగ మార్కెట్తో పోలిస్తే ఎంత మేర పెంపునకు ఆస్కారం ఉంటుందనే వివరాలను రెవెన్యూ సిబ్బంది ద్వారా రిజిస్ట్రేషన్ అధికారులు సేకరిస్తున్నారు. ఈ నెలాఖరుకు కసరత్తు పూర్తి చేసి ఏ ప్రాంతంలో ఎంత పెంచాలో తెలుపుతూ ప్రాథమిక నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ నివేదికలన్నీ జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్గా ఉన్న కమిటీకి చేరనున్నాయి. తర్వాత ప్రభుత్వం ప్రతిపాదిత నివేదికల ప్రకారం అభ్యంతరాలు స్వీకరించి సమస్యల పరిష్కారం అనంతరం ఆ ధరలను వాస్తవ రూపంలోకి తేనున్నారు. ఆగస్టు నెల ప్రారంభం నాటికి ఈ క్రతువును పూర్తి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల ప్రాజెక్టుల నిర్మాణ సమయంలోనూ నిర్వాసితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్లలో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నుంచి గరిష్ఠంగా పరిహారం దక్కలేదు. భూసేకరణ చట్టం - 2013 ప్రకారం బహిరంగ మార్కెట్లో భూమి విలువకు అదనంగా నాలుగు రెట్లు పెంచి ప్రభుత్వం నిర్వాసితుడికి పరిహారం చెల్లిస్తుంది. ఆ ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్కు, రిజిస్ట్రేషన్ విలువకు భారీ అంతరం ఉండటంతో చాలా మంది నిర్వాసితులకు న్యాయం దక్కలేదని అధికారులే అప్పట్లో అభిప్రాయపడ్డారు. ఈ హేతుబద్ధ పెంపు వల్ల ప్రాజెక్టు నిర్వాసితులకు సైతం గరిష్ఠ పరిహారం దక్కనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
డిమాండ్కు అనుగుణంగా నిర్ణయం
గత ప్రభుత్వం 2021, 2022లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ పెంపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలున్న చోట 50 శాతం, మధ్యస్థంగా ఉంటే 40, ఎక్కువ ఉంటే 30 శాతం వరకు ఒకే విధంగా పెంచారు. ఈ దఫా అలా కాకుండా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ విలువ ఎంత ఉంది? ప్రభుత్వ ధర ఎంత ఉందని తెలుసుకొని రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించే విధంగా హేతుబద్ధ ప్రక్రియకు అధికారులు కృషి చేస్తున్నారు. ఉదాహరణకు నల్గొండ పట్టణంలోని దేవరకొండ రహదారిలో, నకిరేకల్-సాగర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రాంతాల్లో గజం రూ.లక్ష వరకు బహిరంగ మార్కెట్లో పలుకుతుండగా.. సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ విలువ మాత్రం రూ.10 వేల వరకు ఉంది. ఇక్కడ సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు రిజిస్ట్రేషన్ విలువ పెంచుకునే వెసులుబాటు ఉందని అధికారులు గుర్తించారు.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న స్థలాల్లో గత ప్రభుత్వం మార్కెట్ ధర అన్ని ఒకే స్థాయిలో పెంచింది. ఇప్పుడు అలా కాకుండా పురపాలికలు, మండల కేంద్రాల్లో ఒక ధర, గ్రామాల్లో ఒక ధర పెంచాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలో పట్టణం నడిబొడ్డున బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ ధర, పురపాలిక చివరన, రహదారికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ధరలు పోల్చినప్పుడు ఒకే విధంగా ఉన్నాయని అధికారులు అంచనాకు వచ్చారు.
హేతుబద్ధంగా ఉండేలా..
- కోమటిరెడ్డి వేణుగోపాల్రెడ్డి, సబ్ రిజిస్ట్రార్, నల్గొండ
ప్రభుత్వ ఆదేశం మేరకు భూముల విలువ పెంపు హేతుబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో ఎంత ఉంది? రిజిస్ట్రేషన్ ధర ఎంత ఉంది? అనే దానిపై అధ్యయనం చేస్తున్నాం. మరో వారం రోజుల్లో ఈ కసరత్తు కొలిక్కి వస్తుంది. ఈ నెలాఖరుకు నివేదిక సమర్పిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పోలీసులకు ఏమైంది..!
[ 26-06-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసింగ్ దారి తప్పుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో హత్యలు, దొంగతనాలు, జాతీయ రహదారిపై దోపిడీలతో గత కొంతకాలంగా ప్రజల భద్రత గాలిలో దీపంలా మారింది. -
పల్లె వెలుగులే.. ఎక్స్ప్రెస్ బస్సులు
[ 26-06-2024]
మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ లాభాల బాట పట్టింది. గతంతో పోలిస్తే బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. -
వ్యాపారంలో రాణించాలని
[ 26-06-2024]
స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ కార్యక్రమాల ద్వారా చేయూతనిస్తోంది. తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తూ వివిధ వ్యాపారాల్లో స్థిరపడేలా ప్రోత్సహిస్తోంది. -
తర(గి)లిపోతున్న ముడి సరకులు
[ 26-06-2024]
నక్కలగండి ప్రాజెక్టుకు పట్టిన గ్రహణం ఇప్పట్లో వీడేలా కన్పించడం లేదు. చేసిన పనులకు, నక్కలగండితండా వాసులకు రావాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పంపిణీకి నోచుకోకపోవడంతో రెండేళ్లలో పూర్తి కావాల్సిన నక్కలగండి బండింగ్, -
వద్దన్నా.. చల్లేస్తున్నారు
[ 26-06-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్రజని(యూరియా) వినియోగం ఏటేటా పెరుగుతోంది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సిఫారసు చేసిన దానికంటే రెట్టింపు స్థాయిలో వాడుతున్నారు. -
వసూళ్లకు పాల్పడుతున్న లైన్మెన్ తొలగింపు
[ 26-06-2024]
విద్యుత్తుశాఖ అనుమతులు లేకుండా పనులు చేస్తూ వినియోగదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న లైన్మెన్ పసుపులేటి శ్రీనివాస్ (జెర్రిపోతులగూడెం, చిలుకూరు మండలం)ను సస్పెండ్ చేసినట్లు.. -
నగదు రెట్టింపు చేస్తామని మోసగిస్తున్న ముఠా అరెస్టు: ఎస్పీ
[ 26-06-2024]
రూ.500 నోట్ల కట్టలో పైనా, కింద అసలు నోట్లు ఉంచి, మధ్యలో తెల్లకాగితాలు పెట్టి పలుమార్లు మోసాలకు పాల్పడుతున్న బిహార్కు చెందిన ముఠాలోని ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేయగా.. -
నకిలీ బంగారం పెట్టి రూ.53.89 లక్షల రుణం
[ 26-06-2024]
నకిలీ బంగారు ఆభరణాలు బ్యాంక్లో కుదువబెట్టి రూ.53.89 లక్షల రుణం తీసుకున్న ఏడుగురు నిందితులను, సహకరించిన గోల్డ్ అప్రయిజర్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. -
యాదాద్రిలో కల్యాణం- ఆకుపూజ
[ 26-06-2024]
స్వయంభూ క్షేత్రమైన యాదాద్రిలో మంగళవారం పంచనారసింహులకు నిత్యారాధనలతో పాటు క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని కొలిచే ప్రత్యేక పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. -
అంతర పంటల సాగుపై అవగాహన కల్పించాలి
[ 26-06-2024]
పండ్ల తోటల్లో అంతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పాలనాధికారి హన్మంతు కె.జెండగే సూచించారు. మండల కేంద్రంలోని స్వరణ్పాల్సింగ్ వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. -
తనిఖీ చేస్తా.. అలసత్వం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తా: కలెక్టర్
[ 26-06-2024]
ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వైద్య అధికారులను ఆదేశించారు. -
సమన్వయంతో పనిచేద్దాం
[ 26-06-2024]
నూతనంగా విధుల్లో చేరిన ఎస్పీ సన్ప్రీత్ సింగ్ను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మంగళవారం ఎస్పీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తే చర్యలు: కలెక్టర్
[ 26-06-2024]
జిల్లాలో ఇసుక, చెరువుల్లో మట్టి అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
హనుమాన్ ఆలయంలో పూజలు
[ 26-06-2024]
ఎన్నో పోరాటాలు చేసిన భక్తులు హనుమాన్ ఆలయం నిర్మించుకోవడమేకాకుండా.. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా గర్భగుడిలో 18 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయడం..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్ సెమీస్కు రిజర్వ్ డే.. భారత్కు మాత్రం లేదు.. ఎందుకలా..?
-
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక..
-
సెక్షన్ 80సి పరిమితి ఈసారైనా పెరిగేనా?.. చివరిసారి ఎప్పుడు సవరించారు?
-
కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. వినతులు ఇచ్చేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
-
‘ఫేక్ ఇన్జూరీ’ ఆరోపణలు.. గుల్బాదిన్పై చర్యలు ఉంటాయా? ఐసీసీ రూల్స్ ఏంటంటే?
-
‘రుషికొండ’ నిర్మాణ సంస్థ సర్దేసుకుందా?