ఇసుకాసురుల ఇష్టారాజ్యం
ఇసుక కొరతను తీర్చేందుకు నార్కట్పల్లి మండలంలో ఇసుక డిపోల ఏర్పాటుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.
నార్కట్పల్లి గ్రామీణం న్యూస్టుడే: ఇసుక కొరతను తీర్చేందుకు నార్కట్పల్లి మండలంలో ఇసుక డిపోల ఏర్పాటుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇసుకాసురులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా కాసుల వర్షం కురిపిస్తోంది. నార్కట్పల్లి మండలంలోని అమ్మనబోలు శివారులోని నిత్యం మూసీ జలాలు పారుతూనే ఉంటాయి. కానీ.. పచ్చని పంటలు మాత్రం మచ్చుకైనా కనిపించవు. దీనంతటికీ కారణం అక్రమార్కులు మూసీ నుంచి ఇసుకను తరలించడమే. అనుమతులు లేకున్నా.. రోజు ఇక్కడి నుంచి వందల సంఖ్యలో వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. తమకేం సంబంధం లేదన్నట్లు అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇసుకను తరలించవద్దని గ్రామస్థులు పేర్కొంటున్నా.. కొందరు ప్రజాప్రతినిధులే ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఈ గ్రామంలో ప్రతి పది ఇళ్లకు ఒక ట్రాక్టర్ ఉంది అంటే ఇసుక ఎంత మోతాదులో తరలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రమాదకరంగా మూసీ వాగు లోలెవల్ వంతెన..
మూసీ వాగు లోలెవల్ వంతెన నుంచి నీరు పారుతుంది. వంతెన కింద ఉన్న ఇసుకను నిత్యం ట్రాక్టర్లలో తరలించడం ద్వారా వంతెన అడుగు భాగం దెబ్బతింటుంది. ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుకను ఎక్కడపడితే అక్కడ తీస్తుండటంతో వంతెన కూలే ప్రమాదం ఉంది.
అందరూ భాగస్వాములే..
అక్రమంగా సాగుతున్న ఇసుక వ్యాపారంలో ఆ గ్రామంలోని కొంత మంది నాయకుల సహకారంతోనే రోజు రోజుకు ఇసుక మాఫియా పెరుగిపోతుంది. దీనికి తోడు పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు నిజాయతీగా వ్యవహరిస్తే ఇసుక తరలింపును ఆపడం కష్టమైన పనేమి కాదు.
కఠిన చర్యలు తీసుకుంటాం
-వెంకటేశ్వర్రావు, తహసీల్దార్, నార్కట్పల్లి
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గత కొద్ది రోజుల క్రితం పోలీసు శాఖ వారి సహకారంతో ఇసుక తరలిస్తున్న వారిని బైండోవర్ చేశాం. మూసీ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించకుండా నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాం.
కేసులు నమోదు చేస్తున్నాం..
-అంతిరెడ్డి, ఎస్సై, నార్కట్పల్లి
ఇసుక తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఘటన స్థలీకి వెళ్లి కేసులు నమోదు చేస్తున్నాం. త్వరలోనే అమ్మనబోలులో ఇద్దరు సిబ్బందిని నియమించి ఇసుక వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం.
ఇసుక తరలింపును అరికట్టాలి
-కొమ్ము గిరి, స్థానికుడు
మూసీ వాగు నుంచి ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. కేవలం స్థానిక అవసరాలకు సరిపడా మాత్రమే ఇసుక నిల్వలే ఉండే వాగును ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక తరలింపును నియంత్రించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పోలీసులకు ఏమైంది..!
[ 26-06-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసింగ్ దారి తప్పుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో హత్యలు, దొంగతనాలు, జాతీయ రహదారిపై దోపిడీలతో గత కొంతకాలంగా ప్రజల భద్రత గాలిలో దీపంలా మారింది. -
పల్లె వెలుగులే.. ఎక్స్ప్రెస్ బస్సులు
[ 26-06-2024]
మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ లాభాల బాట పట్టింది. గతంతో పోలిస్తే బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. -
వ్యాపారంలో రాణించాలని
[ 26-06-2024]
స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ కార్యక్రమాల ద్వారా చేయూతనిస్తోంది. తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తూ వివిధ వ్యాపారాల్లో స్థిరపడేలా ప్రోత్సహిస్తోంది. -
తర(గి)లిపోతున్న ముడి సరకులు
[ 26-06-2024]
నక్కలగండి ప్రాజెక్టుకు పట్టిన గ్రహణం ఇప్పట్లో వీడేలా కన్పించడం లేదు. చేసిన పనులకు, నక్కలగండితండా వాసులకు రావాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పంపిణీకి నోచుకోకపోవడంతో రెండేళ్లలో పూర్తి కావాల్సిన నక్కలగండి బండింగ్, -
వద్దన్నా.. చల్లేస్తున్నారు
[ 26-06-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్రజని(యూరియా) వినియోగం ఏటేటా పెరుగుతోంది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సిఫారసు చేసిన దానికంటే రెట్టింపు స్థాయిలో వాడుతున్నారు. -
వసూళ్లకు పాల్పడుతున్న లైన్మెన్ తొలగింపు
[ 26-06-2024]
విద్యుత్తుశాఖ అనుమతులు లేకుండా పనులు చేస్తూ వినియోగదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న లైన్మెన్ పసుపులేటి శ్రీనివాస్ (జెర్రిపోతులగూడెం, చిలుకూరు మండలం)ను సస్పెండ్ చేసినట్లు.. -
నగదు రెట్టింపు చేస్తామని మోసగిస్తున్న ముఠా అరెస్టు: ఎస్పీ
[ 26-06-2024]
రూ.500 నోట్ల కట్టలో పైనా, కింద అసలు నోట్లు ఉంచి, మధ్యలో తెల్లకాగితాలు పెట్టి పలుమార్లు మోసాలకు పాల్పడుతున్న బిహార్కు చెందిన ముఠాలోని ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేయగా.. -
నకిలీ బంగారం పెట్టి రూ.53.89 లక్షల రుణం
[ 26-06-2024]
నకిలీ బంగారు ఆభరణాలు బ్యాంక్లో కుదువబెట్టి రూ.53.89 లక్షల రుణం తీసుకున్న ఏడుగురు నిందితులను, సహకరించిన గోల్డ్ అప్రయిజర్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. -
యాదాద్రిలో కల్యాణం- ఆకుపూజ
[ 26-06-2024]
స్వయంభూ క్షేత్రమైన యాదాద్రిలో మంగళవారం పంచనారసింహులకు నిత్యారాధనలతో పాటు క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని కొలిచే ప్రత్యేక పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. -
అంతర పంటల సాగుపై అవగాహన కల్పించాలి
[ 26-06-2024]
పండ్ల తోటల్లో అంతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పాలనాధికారి హన్మంతు కె.జెండగే సూచించారు. మండల కేంద్రంలోని స్వరణ్పాల్సింగ్ వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. -
తనిఖీ చేస్తా.. అలసత్వం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తా: కలెక్టర్
[ 26-06-2024]
ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వైద్య అధికారులను ఆదేశించారు. -
సమన్వయంతో పనిచేద్దాం
[ 26-06-2024]
నూతనంగా విధుల్లో చేరిన ఎస్పీ సన్ప్రీత్ సింగ్ను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మంగళవారం ఎస్పీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తే చర్యలు: కలెక్టర్
[ 26-06-2024]
జిల్లాలో ఇసుక, చెరువుల్లో మట్టి అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
హనుమాన్ ఆలయంలో పూజలు
[ 26-06-2024]
ఎన్నో పోరాటాలు చేసిన భక్తులు హనుమాన్ ఆలయం నిర్మించుకోవడమేకాకుండా.. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా గర్భగుడిలో 18 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయడం..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్ సెమీస్కు రిజర్వ్ డే.. భారత్కు మాత్రం లేదు.. ఎందుకలా..?
-
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక..
-
సెక్షన్ 80సి పరిమితి ఈసారైనా పెరిగేనా?.. చివరిసారి ఎప్పుడు సవరించారు?
-
కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. వినతులు ఇచ్చేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
-
‘ఫేక్ ఇన్జూరీ’ ఆరోపణలు.. గుల్బాదిన్పై చర్యలు ఉంటాయా? ఐసీసీ రూల్స్ ఏంటంటే?
-
‘రుషికొండ’ నిర్మాణ సంస్థ సర్దేసుకుందా?